News April 14, 2025

అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు యోచన

image

AP: అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద పెదలంక, చినలంకలో భూములను మంత్రి నారాయణ, MLAలు, కలెక్టర్ పరిశీలించారు. అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేలా ఈ స్పోర్ట్స్ సిటీ ఉండాలని CM చెప్పారని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం 2 వేల ఎకరాల అవసరం ఉంటుందని, లంక భూముల్లో సాధ్యాసాధ్యాలపై కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా ముందుకెళ్తామన్నారు.

Similar News

News July 6, 2025

శుభ సమయం (06-07-2025) ఆదివారం

image

✒ తిథి: శుక్ల ఏకాదశి రా.8.15 వరకు తదుపరి ద్వాదశి
✒ నక్షత్రం: విశాఖ రా.10.37 వరకు తదుపరి అనురాధ
✒ శుభ సమయం: సామాన్యము
✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
✒ యమగండం: మ.12.00-1.30 వరకు
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
✒ వర్జ్యం: తె.3.03-4.49 వరకు
✒ అమృత ఘడియలు: మ.12.50-2.36 వరకు

News July 6, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: రేవంత్
* ఈనెల 12 నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ: భట్టి
* ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
* చర్చకు ప్రిపేరయ్యేందుకు 72 గంటల సమయం: కేటీఆర్
* మహిళలకు 5వేల ఈవీ ఆటోలు: మంత్రి పొన్నం
* AP: వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు
* 20,494 ఎకరాల భూ సమీకరణకు CRDA ఆమోదం: మంత్రి

News July 6, 2025

టెస్టు చరిత్రలో తొలిసారి

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.