news

News April 14, 2025

సుప్రీం తీర్పుపై రివ్యూకు వెళ్లనున్న కేంద్రం?

image

గవర్నర్లు పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు విధించిన గడువు <<16073336>>తీర్పుపై<<>> కేంద్రం రివ్యూకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పిటిషన్ వేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. SC తీర్పు రాష్ట్రపతి నిర్ణయాధికారాన్ని తొలగించేలా ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ విషయమై ప్రెసిడెంట్‌తో చర్చిస్తామని AG వెంకటరమణి తెలిపారు. పిటిషన్ దాఖలుపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.

News April 14, 2025

తహవూర్ రాణా వాయిస్ శాంపిల్స్ సేకరిస్తున్న NIA

image

ఉగ్రవాది తహవూర్ రాణా వాయిస్ నమూనాలను ఎన్ఐఏ సేకరిస్తున్నట్లు సమాచారం. ముంబైలో ఉగ్రదాడులకు కుట్ర పన్నేందుకు డేవిడ్ హెడ్లేతో రాణా మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ భారత నిఘా వర్గాల వద్ద ఉన్నాయి. వాటిలో ఉన్నది రాణా గొంతే అని ధ్రువీకరించేందుకు వాయిస్ నమూనాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అతడే అని ధ్రువీకరించిన అనంతరం భారత్ నుంచి ఆ దుశ్చర్యకు సహకరించిన మరింతమంది వివరాల్ని రాబట్టే అవకాశం ఉంది.

News April 14, 2025

ఘోరం: నిండు గర్భిణిని హత్య చేసిన భర్త

image

నిండు చూలాలైన భార్యను హత్య చేశాడో కిరాతక భర్త. వైజాగ్‌లోని పీఎంపాలెం పీఎస్ పరిధిలో ఉంటున్న జ్ఞానేశ్వర్, అనూషది ప్రేమపెళ్లి. గత కొన్ని రోజులుగా వారి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. నెలలు నిండిన భార్యను జ్ఞానేశ్వర్ ఈరోజు దారుణంగా గొంతునులిమి హత్య చేశాడు. ఆమెకు ఒంట్లో బాలేదని కుటుంబీకులకు చెప్పాడు. వారు ఆస్పత్రికి తరలించేసరికే అనూష మ‌ృతిచెందింది. జ్ఞానేశ్వర్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

News April 14, 2025

గ్రూప్-1పై సీబీఐ విచారణ చేయాలి: కౌశిక్ రెడ్డి

image

TG: గ్రూప్-1 పరీక్షల్లో పెద్ద కుంభకోణం జరిగిందని, CBI విచారణ జరపాలని BRS MLA కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు ఎందుకిచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోఠి కాలేజీ 18, 19 సెంటర్లలో 1490 మంది రాస్తే 74 మంది ఎలా ఎంపికయ్యారని నిలదీశారు. 654 మందికి ఒకే మార్కులు ఎలా వస్తాయని, కాంగ్రెస్ నేత రాములు నాయక్ కోడలికి ST కేటగిరీలో నం.1 ర్యాంక్ వచ్చిందని ఆయన చెప్పారు.

News April 14, 2025

రూ.1000 కోట్ల రెవెన్యూ.. దూసుకుపోతున్న కాంపా కోలా

image

కాంపా కోలా డ్రింక్ ప్రస్తుతం మార్కెట్‌లో దూసుకుపోతుంది. 18 నెలల్లోనే దీని ద్వారా రూ.1000కోట్ల రెవెన్యూ వచ్చింది. 200ML ధర కేవలం రూ.10 ఉండటం, రిలయన్స్ బ్రాండ్ కావడంతో కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మార్కెట్లో 10శాతం అమ్మకాలను ఈ డ్రింక్ ఆక్రమించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 1970-80లో ఫేమస్‌ అయిన కాంపా కోలాను రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసి 2023లో అమ్మకాలు ప్రారంభించింది.

News April 14, 2025

కాంగ్రెస్ ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా: రాబర్ట్ వాద్రా

image

కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే, తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రియాంకా గాంధీ భర్త అయినందునే ఇంతకాలం రాజకీయ చర్చల్లో తనపై విమర్శలు చేసేవారన్నారు. రాహుల్, ప్రియాంకలను చూసి ఎంతో నేర్చుకోవచ్చన్నారు. దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత తరుణంలో, పార్లమెంట్‌లో పోరాడటానికి మరిన్ని గొంతుకలు కావాలని రాబర్ట్ వాద్రా అభిప్రాయపడ్డారు.

News April 14, 2025

డోస్ పెంచిన ఆశావహులు

image

TG: మంత్రిపదవుల ఆశావహులు డోస్ పెంచి గళం విన్పిస్తున్నారు. HYD, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నికైన ఏకైక కాంగ్రెస్ నేతనైన తనకు పదవి దక్కాలని మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. అటు ప్రజల కోసం తపించే తాను మంత్రి పదవికి అర్హుడినని రాజగోపాల్ అన్నారు. అయితే జానారెడ్డి లాంటివారు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇక తనకు మినిస్ట్రీ రాకుంటే మంచిర్యాలను ముంచినట్లే అని స్థానిక నేత ప్రేమ్ సాగర్ ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు.

News April 14, 2025

ఇంగ్లిష్ పుస్తకాలకు హిందీ పేర్లు.. NCERT వివాదాస్పద నిర్ణయం

image

ఇంగ్లిష్ పుస్తకాలకు NCERT హిందీ పేర్లు పెట్టడం వివాదాస్పదమైంది. గతంలో 6వ తరగతి టెక్ట్స్‌బుక్ పేరు ఇంగ్లిష్‌లో ‘Honeysuckle’ అని ఉండగా హిందీలో ‘పూర్వీ’ అని మార్చింది. ఇది సంగీత రాగం పేరు. 1,2 తరగతుల పుస్తకాలకు మృదంగ్, 3rd క్లాస్ బుక్స్‌కు సంతూర్ అని పేర్లు పెట్టింది. ఇవి సంగీత పరికరాలు. తమిళనాడు హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ NCERT పేర్లను మార్చడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

News April 14, 2025

గిగ్ వర్కర్లకు భద్రత కల్పించే బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ

image

TG: గిగ్ వర్కర్లకు భద్రత కల్పించే బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజల సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదా రూపొందించాలని సూచించారు. సచివాలయంలో గిగ్ వర్కర్లు, యూనియన్ల ప్రతినిధులు, మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, ఇతర హక్కులు కల్పించేలా ఈ బిల్లును రూపొందించారు.

News April 14, 2025

దిగ్వేశ్‌కు జరిమానా మళ్లీ ఎందుకు విధించారు?: గవాస్కర్

image

LSG బౌలర్ దిగ్వేశ్ నోట్‌బుక్ సెలబ్రేషన్స్ కారణంగా అతడికి 2సార్లు జరిమానా పడిన సంగతి తెలిసిందే. రెండోసారి ఫైన్ ఎందుకు వేశారంటూ మాజీ క్రికెటర్ గవాస్కర్ ప్రశ్నించారు. ‘వెళ్లిపోతున్న బ్యాటర్‌ దగ్గరకు వెళ్లి మరీ సెలబ్రేట్ చేసుకున్నందుకు తొలిసారి జరిమానా విధించారు. మరి 2వసారి ఎవరి వద్దకూ వెళ్లకుండా తను ఉన్న చోటే సెలబ్రేట్ చేసుకుంటే మళ్లీ ఎందుకు జరిమానా విధించారు? దాని అవసరమేముంది?’ అని ప్రశ్నించారు.