India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తాను కాంగ్రెస్లోనే ఉంటానని, ఎక్కడికీ వెళ్లడం లేదని INC MP శశిథరూర్ స్పష్టం చేశారు. కేరళ ఎన్నికల్లో UDFను గెలిపించేందుకు పనిచేస్తానన్నారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న థరూర్ తాజాగా అగ్రనేతలు ఖర్గే, రాహుల్తో భేటీ అయ్యారు. పార్టీతో విభేదాలు లేవని మీడియాతో పేర్కొన్నారు. ‘నేను చేసిన వ్యాఖ్యలు BJPకి అనుకూలమని కొందరు భావించొచ్చు. కానీ అవి భారత్కు అనుకూలం. రాహుల్ నిజాయతీ కల నేత’ అని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 1 నుంచి పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి.
*ఫాస్టాగ్ను <<18735050>>యాక్టివేట్<<>> చేసిన తర్వాత అదనంగా KYC/KYV వెరిఫికేషన్ అవసరం లేదు.
*పాన్ మసాలా, <<18730084>>సిగరెట్లు<<>>, పొగాకు ధరలు పెరగనున్నాయి.
*LPG సిలిండర్, CNG, PNG, విమాన ఇంధన ధరల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.
*కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. పన్ను విధానంలో మార్పులు జరగొచ్చు. ఆదివారమైనా స్టాక్ మార్కెట్ ఓపెన్లో ఉంటుంది.

కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆకుగూడు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు కంది మొక్కల చిగురు ఆకులను గూడుగా చేసి, లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్ఫాస్ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్ 36% యస్.యల్ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ మరణంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. NCP, NCP-SP వర్గాల రీయూనియన్పై FEB రెండో వారంలో ప్రకటన రావొచ్చని సమాచారం. కొన్ని నెలలుగా అజిత్-శరద్ మధ్య దీనిపై చర్చలు జరిగాయని తెలుస్తోంది. NCP విలీనమై మహాయుతిలోనే కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రస్థాయిలో సునేత్రా/ప్రఫుల్, జాతీయ స్థాయిలో శరద్ పార్టీని లీడ్ చేస్తారని టాక్. ఇదే జరిగితే మహా వికాస్ అఘాడీకి షాక్ తప్పదు.

మహారాష్ట్రలో NCP వర్గాల విలీనంతో INC ఏకాకిగా మిగిలే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహా వికాస్ అఘాడీకి శివసేన(ఉద్ధవ్) దూరంగా ఉంటోంది. తాజాగా స్థానిక ఎన్నికల్లో దాయాది రాజ్ ఠాక్రే(MNS)తో చేతులు కలిపింది. అటు NCP వర్గాలూ కలిసి మహాయుతివైపే మొగ్గు చూపొచ్చని తెలుస్తోంది. శరద్ పవార్కు కేంద్ర పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఇదేమీ సమస్య కాకపోవచ్చు. ఇదే జరిగితే MVA కకావికలమై INCకి ఎదురుదెబ్బ తప్పదు.

స్పానిష్ టెన్నిస్ స్టార్ అల్కరాజ్ ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీస్లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్పై 6-4, 7-6, 6-7, 6-7, 7-5 తేడాతో గెలుపొందారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జరిగే మరో సెమీస్లో జకోవిచ్-సిన్నర్ తలపడనున్నారు. వీరిలో గెలిచే విజేతతో అల్కరాజ్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. అటు ఒలీవియా గాడెక్కి-జాన్ పీర్స్ జంట మిక్స్డ్ డబుల్స్ విజేతగా నిలిచింది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ <<18999353>>మరోసారి<<>> తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయంతో పోల్చితే రూ.1,420 తగ్గి రూ.1,69,200కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,300 పతనమై రూ.1,55,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలతో పోటీ పడి హిట్ టాక్ తెచ్చుకున్న శర్వానంద్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’ OTTలోకి వచ్చేస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది.

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వాడకంపై బిహార్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఉద్యోగులెవరైనా SM ఖాతాను తెరవడానికి అధికారుల అనుమతి తప్పనిసరి. వీటికి అధికారిక ఈమెయిల్, ప్రభుత్వ నంబర్లను వాడరాదు. వారి హోదా, ప్రభుత్వ లోగోను SM పోస్టులలో ఉపయోగించరాదు. నకిలీ ఖాతాలను వాడితే చర్యలు తప్పవు. డిజిటల్ స్పేస్లో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

<
Sorry, no posts matched your criteria.