India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
IPL 2025: SRH ప్లే ఆఫ్స్కు చేరుకుంటుందని ఆ జట్టు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘గతేడాది RCB వరుసగా 7 మ్యాచులు గెలిచి ప్లేఆఫ్స్కు చేరింది. ఈసారి మేమూ అలాగే చేరుకుంటాం. ఇందుకోసం 100% ప్రయత్నిస్తాం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని అన్నారు. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో SRH ఎనిమిదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్కు చేరాలంటే మిగతా 5 మ్యాచులు గెలవడంతో పాటు మెరుగైన NRR కలిగి ఉండాలి.
నౌకదళ సంపత్తి పరంగా ఉత్తర కొరియా మరింత బలోపేతమైంది. 5వేల టన్నుల బరువైన ‘మల్టీపర్పస్ డెస్ట్రాయర్’ నౌకను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా ప్రారంభించారు. దేశ అధికారిక మీడియా KNCA ప్రకారం.. అది చో హ్యోన్ క్లాస్కు చెందిన అత్యాధునిక నౌక. దాన్ని 400 రోజుల్లోనే ప్యాంగ్యాంగ్ నిర్మించింది. పలు రకాలైన క్షిపణుల్ని మోసుకెళ్లే సామర్థ్యం దానికి ఉంది.
పాకిస్థాన్ తమ గగనతలాన్ని మూసేసింది. ఈ చర్యతో పాకిస్థాన్కే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని తెలుస్తోంది. పాక్ గగనతలాన్ని వాడుకున్నందుకు భారత్ డబ్బు చెల్లిస్తుంది. ఇలాగే 2019లో 140 రోజులు గగనతలాన్ని మూసేయడం వల్ల పాక్ 100 మిలియన్ డాలర్లు నష్టపోయిందట. ఇప్పుడూ అన్ని రోజులు మూసేస్తే.. 120-160 మి. డాలర్లు నష్టపోయే అవకాశం ఉంది. పంతానికి పోతే చావు దెబ్బ తగిలేది పాకిస్థాన్కే అని విశ్లేషకులు చెబుతున్నారు.
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఉత్తర, మధ్య, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్న సమయంలో వర్షాలు పడతాయని, రాత్రిపూట ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే ఛాన్సుందని తెలిపారు. హైదరాబాద్లోనూ సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ వర్షం పడొచ్చని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఐపీఎల్లో CSK ఓటముల పరంపర కొనసాగిస్తోంది. ఆఖరికి హోంగ్రౌండు చెపాక్లోనూ అదృష్టం కలిసిరావట్లేదు. IPL హిస్టరీలో తొలిసారి ఆ జట్టు వరుసగా నాలుగు హోం మ్యాచ్లలో ఓడింది. మార్చి 28న RCB, ఏప్రిల్ 5న డీసీ, 11న కేకేఆర్, నిన్న SRH చేతిలో పరాజయం పాలైంది. 2008, 2012లోనూ నాలుగు మ్యాచ్లు ఓడినప్పటికీ వరసగా కాదు. ఇక చెపాక్లో SRHకు ఇదే తొలి విజయం. గతంలో అక్కడ వరుసగా 5 మ్యాచ్లు ఓడింది.
పహల్గామ్ ఉగ్రదాడిని UN సెక్యూరిటీ కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసింది. దాడికి పాల్పడిన, దీన్ని వెనుక ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా కృషి చేయాలని కోరింది. ఉగ్రవాదం ప్రపంచ శాంతి, భద్రతలకు అడ్డంకి అని పునరుద్ఘాటించింది. ఏ విధంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినా.. వారిని చట్టం ముందు నిలబెట్టాలని అన్నీ దేశాలను డిమాండ్ చేసింది.
AP: మద్యం కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మరో నిందితుడిని అదుపులోకి తీసుకుంది. కుంభకోణం కేసులో ఏ-6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తరలించింది. నేడు ఏసీబీ కోర్టులో శ్రీధర్ను హాజరుపరచనుంది. వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమీప బంధువైన శ్రీధర్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కి యజమానిగా ఉన్నారు.
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ జరగాలని పాకిస్థాన్ డిమాండ్ చేసింది. ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘అంతర్జాతీయ దర్యాప్తుకు సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంది. ఆ దాడిలో మా పాత్ర ఏమీ లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రదాడిని భారత్ వాడుకుంటోంది. ఆధారాల్లేకుండా, దర్యాప్తు చేయకుండానే పాక్ను శిక్షించాలని చూస్తోంది’ అని ఆరోపించారు.
TG: SLBC టన్నెల్లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల విరామం ఇచ్చారు. డేంజర్ జోన్ మినహా శిథిలాల తొలగింపు పూర్తికాగా, తాజాగా ఎక్స్కవేటర్లు సొరంగం నుంచి బయటకు వచ్చాయి. ఇంకా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు. 63 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగా, ఇప్పటివరకు రెండు మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఫిబ్రవరి 22న సొరంగంలో ప్రమాదం జరగగా, 8 మంది అందులో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
జులైలో జరిగే అమర్నాథ్ యాత్రను విజయవంతంగా నిర్వహిస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ని అభివృద్ధి మార్గం నుంచి ఎవరూ దూరం చేయలేరని, అక్కడ పర్యాటక రంగాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. కాగా జులై 3న ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర ఆగస్టు 9న రక్షాబంధన్ రోజున ముగుస్తుంది. ఈ యాత్రకు భక్తులు పహల్గామ్, బల్తాల్ మార్గాల గుండా ప్రయాణిస్తారు.
Sorry, no posts matched your criteria.