India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టీమ్ ఇండియాలోకి తిరిగి ఎంపికవ్వడం తన చేతుల్లో లేదని ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అన్నారు. మెరుగైన ప్రదర్శన చేస్తూ వికెట్లు తీయడంపైనే తన దృష్టి ఉందని పేర్కొన్నారు. తన వంతుగా 100శాతం ప్రదర్శన చేస్తానని తెలిపారు. ఒకవేళ సెలక్షన్ గురించే ఆలోచిస్తే అది తన ఆటతీరుపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ బౌలర్ను CTకి పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్లో సిరాజ్ గుజరాత్ తరఫున ఆడుతున్నారు.

TG: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. ‘జంగిల్ రమ్మి’ కోసం రానా, ప్రకాశ్ రాజ్, ‘ఏ23’కి విజయ్ దేవరకొండ, ‘యోలో 247’కి మంచు లక్ష్మి, ‘జీట్ విన్’కు నిధి అగర్వాల్, ‘ఫెయిర్ ప్లే లైవ్’ కోసం ప్రణీత ప్రచారం చేసినట్లు గుర్తించారు. మరిన్ని వివరాలను సేకరించిన అనంతరం వీరిని విచారణకు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్ కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు.

కెరీర్ గ్రోత్ అంటూ చాలా మంది మగవాళ్లు 30ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవట్లేదు. మరికొందరేమో సెటిల్ అయ్యాకే పిల్లలంటూ ప్లాన్ చేస్తుంటారు. అయితే, 35ఏళ్లు దాటితే వీర్యంలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుందని, వాటి ఆకారం మారిపోయి కదలికలు తగ్గుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘పిల్లలు పుట్టడానికి ముఖ్యమైన టెస్టోస్టెరాన్ 35ఏళ్ల నుంచి తగ్గుతూ ఉంటుంది. దీనికి పరిష్కారంగా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.

AP: వాట్సాప్ గవర్నెన్స్పై అవగాహన కల్పించడానికి APRలో ‘ప్రతి ఇంటికి మనమిత్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి స్మార్ట్ఫోన్లలో 9552300009 నంబర్ను సేవ్ చేసి సేవల గురించి వివరిస్తారని IT&RTG శాఖ కార్యదర్శి భాస్కర్ వెల్లడించారు. ప్రస్తుతం 210 సేవలు అందుతున్నాయని చెప్పారు. అన్ని రకాల ధ్రువపత్రాలను వాట్సాప్లోనే అందిస్తామని తెలిపారు.

మొన్నటి వరకూ ముంబై బౌలర్ విఘ్నేశ్ పుతుర్ గురించి చాలా మందికి తెలియదు. కానీ, ఒక్క మ్యాచుతో ఆయన ఓవర్ నైట్ స్టార్గా మారిపోయారు. ఇన్స్టాగ్రామ్లోనూ ఆయనకు రెండు రోజుల క్రితం 24.9వేల మంది ఫాలోవర్లుంటే, నేడు వారి సంఖ్య 3,28,000కి చేరింది. ఆటో డ్రైవర్ కొడుకు గ్రౌండ్లో ఆటగాళ్లను షేక్ చేశారని కొనియాడుతున్నారు. జట్టులో ఉన్న సచిన్ కుమారుడు అర్జున్ విఘ్నేశ్ను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

APలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించిన TDP MP శ్రీకృష్ణదేవరాయలుపై వైసీపీ ఫైరయ్యింది. ‘GOVT ద్వారా మద్యాన్ని తక్కువగా అమ్మడమే కాకుండా విక్రయవేళల్ని కుదించిన YCP హయాంలో లంచాలు ఇస్తారా? లేక ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగిన చంద్రబాబు పాలనలో లంచాలు ఇస్తారా? మెజార్టీ డిస్టిలరీలకు అనుమతులిచ్చిన CBNకు లంచాలు వస్తాయా? ఏ ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వని వైసీపీ హయాంలో లంచాలు వస్తాయా?’ అని నిలదీసింది.

ది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన ‘ముఫాసా’ మూవీ రేపు ఓటీటీలోకి రానుంది. జియో హాట్స్టార్లో తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. కాగా తెలుగులో ముఫాసాకు మహేశ్ బాబు, హిందీలో షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. డిస్నీ రూపొందించిన ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ మూవీ గతేడాది విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

జపాన్లో ‘దేవర’ సినిమా విడుదల నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. నిన్న స్పెషల్ స్క్రీనింగ్లో పాల్గొన్న ‘దేవర’.. అక్కడున్న అభిమానులతో స్టెప్పులేశారు. రెండో రోజూ ఆయన షినాగావా అక్వేరియంను సందర్శించారు. అక్కడున్న షార్క్లతో ఫొటోలు దిగుతూ కనిపించారు. క్లాసీ లుక్లో ఉన్న ఎన్టీఆర్ ఫొటోలు వైరలవుతున్నాయి.

మహారాష్ట్ర ప్రతిపక్ష శివసేన(UBT) నేత అంబాదాస్ దాన్వే మండలిలో సంచలన ఆరోపణలు చేశారు. ముంబై పోలీసుల కనుసన్నల్లో భారీగా బెట్టింగ్ సాగుతోందన్నారు. తన వద్ద పెన్డ్రైవ్లో ఆధారాలున్నాయని, త్వరలోనే బయటపెడతానని చెప్పారు. ‘పోలీసు ఉన్నతాధికారులతో కలిసి కొంతమంది ఐపీఎల్ బెట్టింగ్లో పాల్గొంటున్నారు. పాకిస్థానీ క్రికెటర్లతో వీరంతా టచ్లో ఉన్నారు. ముంబై పోలీసులు ఈ ముఠాని కాపాడుతున్నారు’ అని పేర్కొన్నారు.

బాలీవుడ్ నటుడు సోనూసూద్ భార్య సోనాలి రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు తెలుస్తోంది. ముంబై-నాగ్పూర్ హైవేపై జరిగిన యాక్సిడెంట్లో ఆమె గాయపడినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.