India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం కామన్. అయితే ఇదే అదనుగా కొందరు తమలోని ఆకతాయితనాన్ని బయటకు తీస్తారు. ఇది పరిధిలో ఉంటే పర్లేదు కానీ హద్దు దాటితేనే సమస్య. ఎదుటి వారి ఇష్టంతోనే వారిపై రంగులు చల్లేందుకు ప్రయత్నించండి. పండగ పేరుతో ఇతరులను ఇష్టం వచ్చినట్లు తాకి, రంగులు పూసి ఇబ్బంది పెట్టకండి. ముఖ్యంగా తెలియని వారి విషయంలో హుందాగా వ్యవహరించండి.
HAPPY HOLI

హోలీ పండగ కారణంగా రేపు హిందీ పరీక్ష రాయలేని సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తామని బోర్డు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పండగ మార్చి 15న నిర్వహించుకుంటున్నారని ఎగ్జామ్ కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ తెలిపారు. పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్ణయించినా రేపు ఎగ్జామ్ రాయలేని స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు మరో అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. తేదీని త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

AP: ఇవాళ పిఠాపురంలోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఆ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో పూర్తిచేశారు. పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మ.3 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరనున్నారు. 3.45 గంటలకు సభా స్థలికి చేరుకొని శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రికి కాకినాడలోని జేఎన్టీయూ గెస్ట్ హౌజ్లో బస చేస్తారు.

జియో హాట్స్టార్లో ప్రసారమైన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచులకు 540 కోట్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇది రికార్డు అని, ఇందులో 38 శాతం హిందీ వ్యూయర్ షిప్ ఉందని తెలిపింది. ఇక న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచుకు అత్యధికంగా 124.2 కోట్ల వ్యూస్ వచ్చాయని వెల్లడించింది. జియోహాట్స్టార్లో ఒక రోజులో అత్యధిక సబ్ స్క్రైబర్స్ కూడా ఈ టోర్నీ సమయంలోనే నమోదయ్యారని పేర్కొంది.

TG: నేడు గ్రూప్-3 ఫలితాలు విడుదల కానున్నాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ రిలీజ్ చేయనుంది. గత ఏడాది నవంబర్ 17, 18న నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలకు 2,69,483 మంది హాజరయ్యారు. దాదాపు 49.76 శాతం అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1,365 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రూప్-1, 2 ఫలితాలను TGPSC ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని రేవంత్ అన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు జరుపుకునే ఈ పండుగ సమైక్యతకు అద్దం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పండగ ప్రజల జీవితాల్లో కొత్త రంగులు నింపాలని CBN ఆకాంక్షించారు. రసాయనాలతో కూడిన రంగులు ఉపయోగించవద్దని సూచించారు.

ఉక్రెయిన్తో యుద్ధంలో 30 రోజుల పాటు <<15729985>>కాల్పుల విరమణకు<<>> రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా స్పందించారు. కాల్పుల విరమణకు అనుకూలమేనని అంటూ చిన్నచిన్న విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ విషయమై మధ్యవర్తిత్వం చేస్తున్న యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ను కలిసి మాట్లాడుతామని చెప్పారు. ఈ సంక్షోభాన్ని శాంతియుతంగా ముగించే ఆలోచనకు మద్దతిస్తామని పేర్కొన్నారు.

హోలి అంటేనే రంగుల పండుగ. కలర్స్ ఒకరిపై ఒకరు చల్లుకునే సమయంలో కళ్లలో పడకుండా కళ్లద్దాలు పెట్టుకోవడం ఉత్తమం. కృత్రిమ రంగులు కాకుండా ఆర్గానిక్ రంగులను ఉపయోగించేలా చూడండి. శరీరానికి నూనె అప్లై చేయడం ద్వారా రంగులను త్వరగా శుభ్రం చేసుకోవచ్చు. రంగులు శరీరంపై పడకుండా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించండి. చెరువులు కాలువలు, జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. అప్రమత్తంగా ఉండండి.

తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో <<15745743>>రూపీ(₹) గుర్తును<<>> తొలగించి రూ. అనే అక్షరాన్ని చేర్చడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైరయ్యారు. 2010లో కేంద్రం రూపీ సింబల్ను ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని స్టాలిన్ సర్కారును ప్రశ్నించారు. ఇప్పుడు ఈ గుర్తును తిరస్కరించి తమిళ యువత సృజనాత్మకతను విస్మరించారని మండిపడ్డారు. కాగా రూపీ(₹) గుర్తును డిజైన్ చేసింది డీఎంకే నేత కుమారుడు ఉదయ కుమార్ కావడం గమనార్హం.

నటి రోహిణి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కొడుకు తర్వాత తాను సపోర్ట్ ఇచ్చే ఏకైక వ్యక్తి హీరో నాని అని ట్వీట్ చేశారు. ‘కోర్టు’తో ప్రేక్షకులకు ఆసక్తికర కథను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. నాని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ప్రీమియర్ షోలు వేయగా మూవీని పలువురు ప్రముఖులు వీక్షించారు. కాగా రోహిణి, నాని కలిసి అలా మొదలైంది, అంటే సుందరానికి, జెంటిల్మెన్ వంటి చిత్రాల్లో నటించారు.
Sorry, no posts matched your criteria.