news

News March 12, 2025

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తాం: లోకేశ్

image

AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. పీజీ విద్యార్థులకు గత ప్రభుత్వం తొలగించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తిరిగి తీసుకొస్తామన్నారు. అలాగే ఫీజు బకాయిలు చెల్లించాలని కొన్ని కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్న ఘటనలను ఒప్పుకునేది లేదన్నారు. ఏ కాలేజీ అయినా ఫీజులపై ఒత్తిడి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన సూచించారు.

News March 12, 2025

పెండింగ్‌లో 10వేలకు పైగా పిటిషన్లు: రంగనాథ్

image

TG: అక్రమ కట్టడాలపై హైడ్రాకు పెద్ద ఎత్తున పిటిషన్లు వస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఇప్పటికే 10వేలకు పైగా పిటిషన్లు పరిష్కరించకుండా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఒకప్పటి చెరువుల పరిస్థితి, ప్రస్తుత పట్టణీకరణ, హైడ్రా తీసుకుంటున్నచర్యలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతి సమస్యను లోతుగా అధ్యయనం చేశాకే పరిష్కారానికి కృషిచేస్తున్నామని వెల్లడించారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుందని తెలిపారు.

News March 12, 2025

ఎల్లుండి మద్యం షాపులు బంద్

image

హైదరాబాద్ వ్యాప్తంగా ఈ నెల 14న మద్యం షాపులు బంద్ కానున్నాయి. హోలీ పండుగ సందర్భంగా ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ వెల్లడించింది. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశించారు.

News March 12, 2025

త్వరలో పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ రైలు

image

దేశంలో త్వరలో హైడ్రోజన్‌తో నడిచే రైలు అందుబాటులోకి రానుంది. హరియాణా జింద్ నుంచి సోనిపట్ మార్గంలో నడిచే ఈ ట్రైన్‌ను ఈ నెల 31న ప్రారంభించే అవకాశాలున్నాయి. గంటకు 140కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే దీని వాటర్ సామర్థ్యం 40వేల లీటర్లు. ఒకసారి ఫుల్ చేస్తే 1000కిలోమీటర్లు ప్రయాణించగలదు. దేశవ్యాప్తంగా 35రైళ్లను అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ భావిస్తోంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ తయారు చేసింది.

News March 12, 2025

రేవంత్‌ని మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి: కేటీఆర్

image

TG: ప్రతిపక్షాల మరణం కోరుకోవటం సీఎం రేవంత్ నీచబుద్ధికి పరాకాష్ఠ అని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయనను త్వరగా మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని లేకపోతే చుట్టుపక్కల వారికి ప్రమాదమని కుటుంబ సభ్యులకు సూచించారు. చీప్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సీఎంకు ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

News March 12, 2025

కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు తప్పిన ప్రమాదం

image

కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కారు ఢిల్లీలో ప్రమాదానికి గురైంది. విజయ్ చౌక్ నుంచి ఎయిర్‌పోర్టుకు ఆయన కారులో బయల్దేరగా దారిలో ఓ వాహనాన్ని తప్పించబోయి మంత్రి కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారు శ్రీనివాస వర్మ వాహనాన్ని ఢీకొట్టింది. సడన్ బ్రేక్ వేయడంతో మంత్రి తల, కాలుకు గాయాలయ్యాయి. కాలికి బలమైన గాయం కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

News March 12, 2025

మారనున్న KBC హోస్ట్‌!

image

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ హోస్ట్‌గా చేస్తోన్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ సీజన్ నుంచి వైదొలిగే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. దీంతో తర్వాతి హోస్ట్ ఎవరనే చర్చ మొదలైంది. ఆయన స్థానంలో బాలీవుడ్ నటీనటులు షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీలలో ఒకరిని నియమిస్తారని సమాచారం. 2007 KBCలో షారుఖ్ హోస్ట్‌గా చేసిన విషయం తెలిసిందే. ఎవరిని నియమిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.

News March 12, 2025

క్రికెటర్స్ కమ్ రెస్టారెంట్ ఓనర్స్!

image

టీమ్ఇండియా తరఫున ఆడిన కొందరు భారత క్రికెటర్లకు సొంతంగా రెస్టారెంట్ బిజినెస్‌లు ఉన్నాయనే విషయం మీకు తెలుసా? స్పోర్ట్స్ థీమ్‌తో కపిల్ దేవ్ ‘ఎలెవన్స్’ రెస్టారెంట్ స్థాపించారు. విరాట్ కోహ్లీ (One8 Commune), రవీంద్ర జడేజా (జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్), సురేశ్ రైనా (రైనా), జహీర్ ఖాన్ (డైన్ ఫైన్), శిఖర్ దావన్ (ది ఫ్లైయింగ్ క్యాచ్), స్మృతి మందాన మహారాష్ట్రలోని సంగ్లీలో SM18 కేఫ్ నిర్వహిస్తున్నారు.

News March 12, 2025

ఉద్యోగులకు ₹33కోట్ల షేర్లు గిఫ్ట్‌గా ఇస్తున్న ప్రమోటర్

image

ఉద్యోగులకు తన షేర్లలో కొన్ని గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రమోటర్ సంజయ్ షా‌కు సెబీ అనుమతి ఇచ్చింది. కంపెనీ ఆరంభించి 25ఏళ్లు కావడంతో కొన్నేళ్లుగా నిజాయతీగా సేవలందిస్తున్న 650 మందికి ₹33కోట్ల విలువైన 1,75,000 షేర్లను పంచాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందుకు ఒక చిన్న నిబంధన అడ్డంకిగా మారడంతో సెబీని సంప్రదించారు. ప్రస్తుతం ఒక్కో షేరు ధర రూ.1900గా ఉంది. మీ కామెంట్.

News March 12, 2025

వ్యక్తిగత, వృత్తి జీవితం బ్యాలెన్స్ చేయలేక 52శాతం మందిపై ఒత్తిడి

image

వర్క్-లైఫ్-బ్యాలెన్స్‌పై వర్టెక్స్ గ్రూప్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని సమతుల్యం చేయలేక 52 శాతం మంది ఒత్తిడి ఎదుర్కొంటున్నారని తెలిపింది. 23శాతం ఎక్కువ గంటలు, 20 శాతం 2.5-3.5 గంటలే పనిచేస్తున్నారని పేర్కొంది. ఇండియాలో ఐదుగురిలో నలుగురు కుటుంబ బంధాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించింది. మరి మీ వర్క్-లైఫ్‌ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో కామెంట్ చేయండి.