news

News March 6, 2025

బ్యాలెట్‌ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్‌ చేయాలి: జగన్

image

కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే బ్యాలెట్‌ విధానంలో పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేయాలని YCP MPలకు జగన్ సూచించారు. ‘వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌’‌పై పార్లమెంటులో చర్చ జరిగే అవకాశమున్న నేపథ్యంలో వారికి సూచనలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మొదట్లో EVMలతో నిర్వహించిన దేశాలు కూడా తర్వాత బ్యాలెట్‌ విధానానికి మళ్లాయని గుర్తు చేశారు.

News March 6, 2025

ఇవాళ వే2న్యూస్‌లో ఈ స్టోరీలు చదివారా..?

image

– కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ ఎపిసోడ్
– బాబర్ ఆజమ్‌పై విమర్శలు.. తండ్రి ఆగ్రహం
– YS జగన్‌పై పోలీసులకు ఫిర్యాదు
– సింగర్‌తో BJP MP పెళ్లి.. ఫొటోలు
– ఎగ్జామ్ సిస్టమ్‌ను ఎవరు తయారు చేశారంటే..
– రిటైర్మెంట్‌పై చంద్రబాబు ఏమన్నారంటే
– తమన్నా బ్రేకప్.. కారణమిదే
– తిరుమల అన్న ప్రసాదంలో కొత్తగా..
– ఛాంపియన్స్ ట్రోఫీ: ఈ సారి ఈ పరంపర వద్దు

News March 6, 2025

స్కూళ్లకు వేసవి సెలవులు.. తేదీ ఇదే

image

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి. అయితే తెలంగాణలో APR 20, APలో APR 23 నుంచి సమ్మర్ హాలిడేస్ ఉంటాయని పలు కథనాలు వచ్చాయి. దీనిపై ఇరు రాష్ట్రాల విద్యాశాఖ వర్గాలను Way2News సంప్రదించింది. అకడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం APR 23 చివరి పనిదినం అని వారి నుంచి సమాధానం వచ్చింది. ఎండల తీవ్రత వంటి కారణాలతో సెలవు తేదీల్లో మార్పులు ఉంటే ప్రకటన చేస్తామన్నాయి.
Share It

News March 6, 2025

ప్రపంచంలో బెస్ట్ టీమ్ ఇదేనట.. ఏమంటారు?

image

ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ క్రికెట్ టీమ్ ఏదంటే అందరూ చెప్పేది టీమ్ఇండియా పేరు. కానీ, ఆల్‌టైమ్ బెస్ట్ & డేంజరస్ క్రికెట్ టీమ్ మాత్రం ‘2003 ఆస్ట్రేలియన్’ జట్టు అని కొందరు చెబుతుంటారు. ఆసీస్ వరుసగా 1999, 2003, 2007 వరల్డ్ కప్స్ గెలిచింది. అప్పట్లో గిల్ క్రిస్ట్& మాథ్యూ ఓపెనింగ్ అదిరిపోయేదంటున్నారు. రిక్కీ పాంటింగ్ కెప్టెన్సీలో ప్రత్యర్థులకు చుక్కలు కనపడేవని చెప్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 6, 2025

భాగస్వామితో కలిసి నిద్రిస్తే కలిగే ప్రయోజనాలివే..!

image

భార్యాభర్తలు కలిసి <<15666785>>నిద్రించడం<<>> వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్సవ్వడం, ప్రెజర్స్, టార్గెట్స్, వేధించే ఒంటరితనానికి ఇదే అసలైన ఔషధం అంటున్నారు. లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ విడుదలై డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ తగ్గుతాయని, ఆయు: ప్రమాణం, బంధంపై సంతృప్తి పెరుగుతాయని చెప్తున్నారు. భాగస్వామి నుంచి ప్రేమ, కంఫర్ట్, రిలాక్స్, హ్యాపీ, ప్రశాంతతను ఫీలవుతారన్నారు.

News March 6, 2025

రాష్ట్ర సమస్యలపై గళమెత్తండి: ఎంపీలతో జగన్

image

AP: రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తాలని, ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత జగన్ సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత రావాలని, దానిపై కేంద్రం స్పందించేలా చొరవ చూపాలన్నారు. పోలవరం ఎత్తు తగ్గింపు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వారికి జగన్ దిశానిర్దేశం చేశారు.

News March 6, 2025

తల్లి కాబోతున్న వినేశ్ ఫొగట్

image

భారత మాజీ రెజ్లర్, ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ‘మా లవ్ స్టోరీ కొత్త చాప్టర్‌తో కొనసాగనుంది’ అని తన భర్త సోంవీర్ రథీతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 2024లో ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన ఫొగట్ అధిక బరువు కారణంగా గోల్డ్ మెడల్ సాధించలేకపోయారు. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు.

News March 6, 2025

బిగ్‌బాస్ సీజన్-9కు కొత్త హోస్ట్?

image

టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో తొమ్మిదో సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈసారి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఉండకపోవచ్చని సమాచారం. ఎనిమిదో సీజన్‌కు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ లేకపోవడంతో హోస్ట్‌గా ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. మరి ఈ షోను ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.

News March 6, 2025

విశాఖ, విజయవాడ మెట్రోలపై చర్చించా: సీఎం

image

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టులపై చర్చించానని సీఎం ట్వీట్ చేశారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై సమాలోచనలు చేశామన్నారు. ఇవి రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని, ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని వివరించారు.

News March 6, 2025

ఏపీకి ఏ లోటు లేకుండా చూస్తాం: నిర్మల

image

APకి ఏ లోటు లేకుండా చూస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఇవాళ విశాఖపట్నంలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామన్నారు. అమరావతి నిర్మాణానికి రుణాలు ఇప్పిస్తున్నామని వెల్లడించారు. ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి సాయం చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి అన్నింటా కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.