news

News October 26, 2024

రెండు రోజులు ఎవ్వరినీ కలవను: జానీ మాస్టర్

image

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన <<14447920>>జానీ మాస్టర్<<>> తన ఇంట్లో ఓ డైరెక్టర్, ఇద్దరు కొరియోగ్రాఫర్లతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ‘జైలులో పెట్టే ఆహారం తినలేకపోయా. మనిషి అనే వాడు జైలుకు వెళ్లకూడదు. బయట కంటే జైలులో నరకంగా ఉంటుంది. ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. రెండు రోజులు గడిస్తే నార్మల్ పరిస్థితికి వస్తా. అప్పటి వరకూ ఎవరితో మాట్లాడను. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తా’ అని చెప్పినట్లు సమాచారం.

News October 26, 2024

కోహ్లీ ఔట్

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో గట్టెక్కేందుకు భారత్‌ ఆశలు పెట్టుకున్న కోహ్లీ కూడా ఔట్ అయ్యారు. 17 రన్స్ వద్ద సాంట్నర్ బౌలింగ్‌లో LBWగా వెనుదిరిగారు. దీంతో భారత్ 147 పరుగులకే 5 ప్రధాన వికెట్లు కోల్పోయింది. క్రీజులో సుందర్, సర్ఫరాజ్ ఉన్నారు. విజయానికి ఇంకా 212 రన్స్ కావాలి.

News October 26, 2024

డిప్యూటీ సీఎంను కలిసిన JAC నేతలు

image

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఉద్యోగ సంఘాల JAC నేతలు కలిశారు. 2 DAలు, పెండింగ్ బిల్లులు సహా మరికొన్ని అంశాలను పరిష్కరించాలని కోరారు. ఇవాళ జరిగే క్యాబినెట్ భేటీలో వీటిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని భట్టి వారికి చెప్పారు.

News October 26, 2024

BREAKING: కష్టాల్లో భారత్

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. 359 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత జట్టులో రోహిత్(8) వికెట్ త్వరగానే కోల్పోగా, గిల్(23), జైశ్వాల్(77) జోడీ స్కోరు బోర్డును కాసేపు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఇద్దరూ ఔట్ కాగా, ఆ కాసేపటికే పంత్(0) కూడా రనౌట్ అయ్యారు. ప్రస్తుతం కోహ్లీ(14), సుందర్(3) ఆడుతున్నారు. భారత్ గెలవాలంటే ఇంకా 225 రన్స్ చేయాలి.

News October 26, 2024

350+ రన్స్ ఛేదించడంలో ఇండియా తడబాటు!

image

రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై గెలిచేందుకు టీమ్ఇండియా 358 రన్స్ చేయాల్సి ఉంది. అయితే, టీమ్ఇండియా 350+ స్కోరును కేవలం రెండు సార్లే ఛేదించింది. 350కి పైగా పరుగుల లక్ష్యంతో 63 ఇన్నింగ్స్ ఆడితే కేవలం రెండిట్లోనే గెలుపొంది 40 సార్లు ఓడిపోయింది. మరో 21 సార్లు డ్రా చేసుకుంది. 1976లో WIతో మ్యాచ్‌లో 403, 2008లో ENGతో మ్యాచ్‌లో 387 రన్స్‌ ఛేదించి ఇండియా గెలిచింది. మరి ఈ మ్యాచ్‌లో IND గెలుస్తుందా?

News October 26, 2024

ట్రంప్, వాన్స్ ఫోన్లను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు

image

రిపబ్లికన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ ఫోన్లలో డేటాను చైనీస్ హ్యాకర్లు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఏదైనా కమ్యూనికేషన్ డేటాను వీరు యాక్సెస్ చేశారేమో తెలుసుకొనేందుకు అధికారులు దర్యాప్తు ఆరంభించారు. వెరిజోన్ ఫోన్ సిస్టమ్స్ ద్వారా హ్యాకింగ్‌ జరిగినట్టు అంచనావేశారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ క్యాంపెయిన్ సభ్యుల ఫోన్లనూ టార్గెట్ చేసినట్టు అనుమానిస్తున్నారు.

News October 26, 2024

హీరోతో పెళ్లి వార్తలు.. స్పందించిన హీరోయిన్

image

జయం రవితో పెళ్లి జరగబోతోందని వచ్చిన వార్తలను హీరోయిన్ ప్రియాంక మోహన్ ఖండించారు. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. ‘జయం రవితో బ్రదర్ సినిమాలో నటించా. మేమిద్దరం దండలు వేసుకుని దిగిన ఫొటోను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో మాకు నిశ్చితార్థం జరిగిందని టాలీవుడ్‌లోని కొందరు కాల్స్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. అది సినిమాలోని స్టిల్ మాత్రమే. ఆ ఫొటోనే రిలీజ్ చేసినందుకు మేకర్స్‌ను తిట్టుకున్నా’ అని తెలిపారు.

News October 26, 2024

రోహిత్ ఫ్లాప్ షో

image

హిట్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ టెస్టుల్లో ఫ్లాప్ అవుతున్నారు. NZతో సెకండ్ టెస్టులో 0,8 రన్స్‌కే పరిమితమయ్యారు. చివరి 8 టెస్టుల్లో ఆయన కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగారు. టీమ్ గెలుపు కోసం ముందుండి ఆడాల్సిన కెప్టెనే ఇలా సింగిల్ డిజిట్‌కు పరిమితమవడంతో నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఈ మ్యాచ్‌లోనైనా అండగా నిలవాల్సిందని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. రోహిత్ ప్రదర్శనపై మీ కామెంట్?

News October 26, 2024

కాంగ్రెస్‌లో చేరిన BRS ఎమ్మెల్యేలను గమనిస్తున్నాం: మధుయాష్కీ

image

TG: MLC జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. ‘ఈ హత్యపై DGPకి ఫిర్యాదు చేస్తాం. ప్రాణానికి ముప్పు ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు భద్రత ఇవ్వలేదు. పాత కక్షలు అంటూ తేలిగ్గా తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో చేరిన BRS MLAల వ్యవహార శైలిని గమనిస్తున్నాం. కాంగ్రెస్‌పై ప్రేమతో వాళ్లు పార్టీలోకి రావట్లేదు’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.

News October 26, 2024

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

పసిడి కొనుగోలుదారులకు షాక్. బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.710, 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.650 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ రూ.80,290కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.73,600గా నమోదైంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కేజీ ధర రూ.1,07,000గా ఉంది.

error: Content is protected !!