India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శంషాబాద్ నుంచి వైజాగ్కు కేవలం 4 గంటల్లోనే చేరుకునే సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్మెంట్ ఖరారైంది. గంటకు 220KM వేగంతో దూసుకెళ్లే ఈ రైలు విజయవాడ మీదుగా వైజాగ్ చేరుకుంటుంది. ఈ రూట్లో మొత్తం 12 స్టేషన్లుంటాయి. సర్వే తుది దశకు చేరగా నవంబర్లో రైల్వేబోర్డుకు సమర్పించనున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్కర్నూల్ మీదుగా కర్నూలుకు మరో కారిడార్ను నిర్మించనున్నారు.
TG:ప్రధాన కాలువలు, డ్యామ్లు/రిజర్వాయర్ల పర్యవేక్షణ, గేట్ల ఆపరేషన్ కోసం 1597 మంది లష్కర్లు, 281 మంది హెల్పర్లను ప్రభుత్వం త్వరలో నియమించుకోనుంది. చదవడం, రాయడం వస్తే ఉంటున్న గ్రామంలోనే ఔట్సోర్సింగ్ జాబ్ చేయవచ్చు. జీతం ₹15,600. విద్యార్హతతో సంబంధం లేకుండా 45 ఏళ్లలోపు, ఫిట్గా ఉన్న వారిని తీసుకుంటారు. ప్రాజెక్టులు, చెరువుల నుంచి నీరు పొలానికి చేరుతుందా? గండ్లు పడ్డాయా? అనే వివరాలు వీరు సేకరిస్తారు.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 55వ ఎడిషన్లో ప్రదర్శనకు రెండు తెలుగు సినిమాలు (కల్కి 2898 AD, 35 చిన్న కథ కాదు) ఎంపికయ్యాయి. వీటితో పాటు 12th ఫెయిల్, ఆర్టికల్ 370, స్వాతంత్య్ర వీర్ సావర్కర్(హిందీ), మంజుమ్మల్ బాయ్స్, భ్రమయుగం, ఆడు జీవితం(మలయాళం), జిగర్తాండ డబుల్ ఎక్స్(తమిళ) వంటి మరికొన్ని సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఈ ఫెస్టివల్ గోవాలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనుంది.
TG: CM రేవంత్ అధ్యక్షతన ఇవాళ సా.4గంటలకు జరిగే క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉంది. వారికి 2 DAలు ఇవ్వడంపై ప్రకటన చేసే ఛాన్సుంది. దీంతో పాటు రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం తెలపడం, గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియామకం, మూసీ నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపు, ఇందిరమ్మ కమిటీలు, కులగణన, SC వర్గీకరణ, అసెంబ్లీ సమావేశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
AP: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్పై మరో కేసు నమోదైంది. గతంలో అమరావతి ఉద్యమానికి మద్దతిచ్చేందుకు రైతుల శిబిరాలకు వచ్చిన ప్రస్తుత మంత్రి సత్యకుమార్పై నందిగం సురేశ్, అతని అనుచరులు దాడి చేశారని ఓ BJP నేత ఫిర్యాదు చేశారు. ఆ దాడిలో సురేశ్ స్వయంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే TDP ఆఫీసుపై దాడి, ఓ మహిళ హత్య కేసులు ఆయనపై నమోదయ్యాయి.
AP: బీఎస్సీ నర్సింగ్ కోర్సులో మిగిలిన కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా సీట్లను ఏపీఈఏపీ సెట్, నీట్ ర్యాంకులతో సంబంధం లేకుండా ఇంటర్ మార్కులతో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 మాత్రమే ఈ మినహాయింపు ఉంటుందని తెలిసింది. 2025-26 నుంచి ఇండియన్ నర్సింగ్ కౌన్సెల్ మార్గదర్శకాలు అనుసరించి NTR హెల్త్ వర్సిటీ ప్రత్యేకంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని పేర్కొన్నారు.
AP: షర్మిలకు సొంత ఆస్తుల్లోనూ YS జగన్ వాటా ఇవ్వాలనుకున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గిఫ్ట్ డీడ్ను ఆమె దుర్వినియోగం చేసి, తల్లి పేరిట షేర్లుగా మార్చారని చెప్పారు. హైకోర్టులో స్టేటస్కో ఉన్నా ఆమె షేర్లు మార్చుకోవడంతోనే NCLTలో జగన్ పిటిషన్ వేశారని, ఆస్తులు వెనక్కు తీసుకోవాలనే ఆలోచన ఆయనకు లేదన్నారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన ఆమెపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు.
AP: విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై పడనుంది. 2022-23లో విద్యుత్ కొనుగోలు భారాన్ని వచ్చే నెల నుంచి వసూలు చేసేలా డిస్కంలకు ERC అనుమతి ఇచ్చింది. దాదాపుగా ₹6072.86 కోట్లను ప్రజలే భరించాల్సి ఉండగా యూనిట్కు ₹1.21 చొప్పున 15 నెలల పాటు వసూలు చేస్తారు. 2019-20, 20-21 సంవత్సరాలకు ఇంధన సర్దుబాటు కింద ₹1.05 చెల్లించిన ప్రజలు తాజా భారంతో కలిపి అదనంగా యూనిట్కు ₹2.26 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ‘ఇంటర్నేషనల్ లాగిన్’ పేరుతో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. US, కెనడా, జర్మనీ, UK, ఆస్ట్రేలియా, UAEతో సహా 27 దేశాల్లో వినియోగదారులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. భారత్లోని తమ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు ఫుడ్, నిత్యవసర వస్తువులు, గిఫ్ట్స్ ఆర్డర్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులు, UPIతో చెల్లింపులు చేయొచ్చు.
AP: గత ప్రభుత్వ హయాంలో తనను అరెస్ట్ చేయకపోయినా కూటమి పొత్తు ఏర్పడేదేమో అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘మనం నిమిత్తమాత్రులమే. విధి స్పష్టంగా ఉంటుంది. అరెస్ట్ చేయకపోయినా పొత్తు ఉండేదేమో. నా అరెస్ట్ పొత్తు నిర్ణయానికి మరింత ఊతమైంది. సరైన సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేశారు’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.