India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: MLC జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. ‘ఈ హత్యపై DGPకి ఫిర్యాదు చేస్తాం. ప్రాణానికి ముప్పు ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు భద్రత ఇవ్వలేదు. పాత కక్షలు అంటూ తేలిగ్గా తీసుకుంటున్నారు. కాంగ్రెస్లో చేరిన BRS MLAల వ్యవహార శైలిని గమనిస్తున్నాం. కాంగ్రెస్పై ప్రేమతో వాళ్లు పార్టీలోకి రావట్లేదు’ అని ప్రెస్మీట్లో వ్యాఖ్యానించారు.
పసిడి కొనుగోలుదారులకు షాక్. బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.710, 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.650 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ రూ.80,290కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.73,600గా నమోదైంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కేజీ ధర రూ.1,07,000గా ఉంది.
ఉన్నత విద్య కోసం ఇటలీకి వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఎక్కువ ఖర్చు, పరిస్థితులు బాగాలేకపోవడంతో UK, US, కెనడాకు ఆల్టర్నేటివ్ ఆప్షన్లు వెతుకుతున్నారు. 2023లో ఇటలీ 93,000 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ను తీసుకుంది. ఇందులో 6100 మంది భారతీయులుండగా, 20% AP, TG వాళ్లేనని TOI తెలిపింది. 2025లో ఇటలీకి వెళ్లే భారతీయుల సంఖ్య 22%, 2030కి 500% పెరుగుతుందని అంచనా. అక్కడ రూ.10లక్షల్లోపే ఖర్చవుతోంది.
AP: టీచర్ల బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయ సంఘాలతో భేటీలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. టీచర్ల బదిలీలకు చట్టం రూపొందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో సంబంధం లేకుండా చట్ట ప్రకారం ట్రాన్స్ఫర్లు జరిగేలా చూడాలని భావిస్తోంది. విధివిధానాల ఖరారుపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరిగాక DECలో చట్టం అమల్లోకి తేవాలని చూస్తోంది. ఇటు మున్సిపల్ టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సైతం అంగీకారం తెలిపింది.
న్యూజిలాండ్తో రెండో టెస్టులో భారత్ లక్ష్యం దిశగా సాగుతోంది. 359 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన IND లంచ్ సమయానికి 81/1 రన్స్ చేసింది. రోహిత్ 8 పరుగులు చేసి ఔట్ కాగా జైస్వాల్ 46, గిల్ 22 రన్స్తో క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి మరో 278 పరుగులు కావాలి. ఆట ఇంకా రెండు రోజులు మిగిలి ఉంది. మరి భారత్ ఈ టెస్ట్ గెలుస్తుందా? తడబడుతుందా? కామెంట్ చేయండి.
టెలికం దిగ్గజం జియో దీపావళి ధమాకా పేరుతో యూజర్ల కోసం ఆఫర్లు ప్రకటించింది. రూ.899, రూ.3599 రీఛార్జ్ ప్లాన్లపై రూ.3350(ఈజీమై ట్రిప్, AJIO, స్విగ్గీ ఓచర్లు) విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. రూ.899 ప్లాన్ ద్వారా 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటాతో పాటు అదనంగా 20GB డేటా లభిస్తుంది. రూ.3599 ప్లాన్లో 365 రోజులు రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం పొందవచ్చు.
గత ఏడాదితో పోలిస్తే ఈ దీపావళి, ధంతేరాస్కు గోల్డ్ డిమాండ్ 15-20% తగ్గుతుందని జువెలర్స్ అంచనా వేస్తున్నారు. ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమన్నారు. దాదాపుగా వీరి వార్షిక అమ్మకాల్లో 30-40% ఈ సీజన్లోనే నమోదవుతుంది. అందుకే కస్టమర్లను ఆకర్షించేందుకు ఎలక్ట్రిక్ కార్లు, SUVలు, ఐఫోన్ 16, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ స్కీములను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం గోల్డ్ 10grams ధర రూ.81వేలుగా ఉంది.
ట్రెండింగ్లో ఉన్న AI అవకాశాలను వినియోగించుకుని APని శరవేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. USA శాన్ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ‘AI ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందిస్తాం. మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ప్రతి 100 రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్తున్నాం’ అని వెల్లడించారు.
TG: పలు స్కాముల్లో నవంబర్ 1 నుంచి 8 వరకు కీలక నేతల అరెస్టులు జరుగుతాయన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై మాజీ మంత్రి KTR సెటైర్లు వేశారు. ‘చూస్తుంటే తెలంగాణకు కొత్త DGP వచ్చినట్లున్నారు. కొత్త రోల్ పోషిస్తున్న పొంగులేటి గారికి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. అటు నల్గొండలో కానిస్టేబుళ్లు చేస్తున్న నిరసనపైనా KTR స్పందించారు. ‘తెలంగాణలో పోలీసులే పోలీసులకు రెబెల్స్గా మారారు’ అని కామెంట్ చేశారు.
యంగ్ డైరెక్టర్ సుజీత్ బర్త్ డే సందర్భంగా ‘OG’ సినిమా మేకర్స్ స్పెషల్ విషెస్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే బ్లాజింగ్ గన్ సుజీత్.. నువ్వు సుఖంగా ఉండు.. మమ్మల్ని సుఖంగా ఉంచు’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ డేట్స్కు అనుగుణంగా షూటింగ్ జరిపి వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.