India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్ర మంత్రుల బృందం దక్షిణ కొరియా పర్యటన ముగిసింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అధికారులు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. సియోల్తో పాటు ఇంచియాన్ నగరంలో నదుల ప్రక్షాళన, మురుగునీటి శుద్ధీకరణపై అధికారులతో కలిసి మంత్రులు అధ్యయనం చేశారు. మూసీ పునరుజ్జీవం కోసం సీఎం ఆదేశాలతో తాము ఆ దేశంలో పర్యటించినట్లు పొంగులేటి తెలిపారు.
టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆయన 2 రంజీ మ్యాచ్లు ఆడతారని సమాచారం. కర్ణాటక, మధ్యప్రదేశ్తో జరిగే మ్యాచుల్లో ఆయన బెంగాల్కు ప్రాతినిధ్యం వహిస్తారని టాక్. కాగా వన్డే వరల్డ్ కప్లో షమీ గాయపడి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం కోలుకుని ప్రాక్టీస్ ప్రారంభించారు.
* రోజు ఫిజికల్ యాక్టివిటీ చేయించండి. గేమ్స్ ఆడేలా ప్రోత్సహించండి.
* పోషకాలతో కూడిన సమతుల ఆహారం ఇవ్వండి
* శీతల పానీయాలను నియంత్రించండి
* ఆహారం, స్నాక్స్ తినే విషయంలో సమయపాలన అలవాటు చేయండి
* నెమ్మదిగా, నమిలి తినడం నేర్పించండి
* మొబైల్, టీవీ స్క్రీన్ టైమ్ పరిమితం చేయండి
* వయసును బట్టి రోజుకు 9-11 గంటలు నిద్రపోయేలా చూడండి.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. టెస్టుల్లో అత్యధికంగా 47 సార్లు సింగిల్ డిజిట్కే పరిమితమైన ఏడో ప్లేయర్గా ఆయన నిలిచారు. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆయన ఒక్క రన్ మాత్రమే చేశారు. ఈ క్రమంలో టామ్ లాథమ్(47)ను సమం చేశారు. ఈ జాబితాలో క్రెగ్ బ్రాత్వైట్ (65) టాప్లో ఉండగా, ఆ తర్వాత రూట్ (64), కరుణరత్నే (51), స్టోక్స్ (50), విలియమ్సన్ (48) ఉన్నారు.
డిజిటల్ విప్లవం అనేక మార్పులతో పాటు కొన్ని రోగాల్నీ తెచ్చిపెట్టింది. అందుకిదే ఉదాహరణ. ప్రపంచ వ్యాప్తంగా 8కోట్ల మంది గ్యాంబ్లింగ్ డిజార్డర్ లేదా జూదరోగంతో బాధపడుతున్నారని లాన్సెట్ తెలిపింది. ఆన్లైన్ క్యాసినో, గేమ్స్, బెట్టింగ్ మార్కెట్లే ఇందుకు కారణమంది. ఈజీ మనీ పేరుతో పిల్లలు, పెద్దలు వీటికి ఆకర్షితులవుతున్నారని పేర్కొంది. మొత్తంగా 44 కోట్ల మందికి గ్యాంబ్లింగ్ రిస్క్ ఉన్నట్టు వెల్లడించింది.
ఈ విచిత్రమైన ఘటన కొలరాడోలోని(US) ఫ్రూటాలో 1945లో జరిగింది. స్థానికంగా ఉండే రైతు లాయిడ్ ఒల్సేన్ తన దగ్గరున్న కోడి మెడను కట్ చేయగా అది పారిపోయింది. తర్వాత దాన్ని పట్టుకొచ్చి చూస్తే బతికే ఉంది. ఓ బాక్స్లో పెట్టి ఐడ్రాపర్ని ఉపయోగించి ఆహారం అందించాడు. కోళ్లకు తల వెనుక భాగంలో మెదడు ఉంటుంది. ఆ పార్ట్ కట్ కాకపోవడంతో కోడి బతికిపోయింది. అయితే రెండేళ్ల తర్వాత 1947లో అది మరణించింది.
యూట్యూబ్ మరో సరికొత్త ఫీచర్ను భారత్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కంటెంట్ క్రియేటర్ల కోసం షాపింగ్ అఫ్లియేట్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. దీని ద్వారా అర్హులైన వారు వీడియోలు, షార్ట్స్ ద్వారా నేరుగా మింత్రా, ఫ్లిప్కార్ట్ రిటైలర్ సైట్ల నుంచి అవసరమైన ఉత్పత్తులు కొనుగోలు చేసేలా అనుమతి ఇస్తుంది. ఇది కంటెంట్ క్రియేటర్లకు, వ్యూయర్లకు మధ్య కనెక్షన్ను బలపరుస్తోందని యూట్యూబ్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
పుణే వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 198 రన్స్ చేసింది. దీంతో 301 పరుగుల ఆధిక్యం సాధించింది. కెప్టెన్ లాథమ్ 86 రన్స్తో రాణించారు. క్రీజులో బ్లండెల్(30), ఫిలిప్స్(9) ఉన్నారు. సుందర్ 4, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 156 రన్స్కు ఆలౌటైంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు AP హైకోర్టులో భారీ ఊరట లభించింది. బన్నీపై నంద్యాల పోలీసులు పెట్టిన కేసుకు సంబంధించి వచ్చే నెల 6న ఉత్తర్వులిస్తామని, అప్పటివరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కాగా గత ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ నేత రవిచంద్ర కిశోర్ రెడ్డి తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘించారని బన్నీపై పోలీసులు కేసు నమోదు చేయగా, ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.
TG: కాంగ్రెస్, బీజేపీ మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్కు రక్షణ కవచంలా బీజేపీ పనిచేస్తోందని ఆయన విమర్శించారు. ‘కాంగ్రెస్ నేతల బాంబ్ <<14439514>>ప్రకటనలకు<<>> భయపడం. ఒరిజినల్ బాంబులకే మేం భయపడలేదు. మంత్రి పొంగులేటిపైనే ఈడీ కేసులు ఉన్నాయి. ఆయనే అరెస్ట్ అవుతారేమో? బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Sorry, no posts matched your criteria.