India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కశ్మీర్లో ఉగ్రమూకలు మరో దాడికి తెగబడ్డాయి. ఉత్తర కశ్మీర్లోని గుల్మార్గ్ బోటాపతేర్ ప్రాంతంలో సైనికుల వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు గాయపడినట్టు తెలుస్తోంది. గందర్బాల్లో ఓ కార్మికుడిపై కాల్పులు జరిగిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
న్యూజిలాండ్పై తాను 7 వికెట్లు తీయడం వెనుక తన తోటి స్పిన్నర్ అశ్విన్ ఇచ్చిన సూచనలు కీలకమయ్యాయని వాషింగ్టన్ సుందర్ తెలిపారు. ‘బాల్ బాగా సాఫ్ట్గా మారడంతో వికెట్ల కోసం బంతిని వేగంగా విసరాలని అశ్విన్ సూచించారు. ఆ టెక్నిక్తోనే కాన్వేను ఆయన ఔట్ చేశారు. ఆ సూచన పాటించడంతో పాటు సరైన ప్రాంతాల్లో బంతిని వేయడం ద్వారా వికెట్లు తీయగలిగాను. అశ్విన్తో కలిసి మరిన్ని మ్యాచులు ఆడాలనుకుంటున్నాను’ అని వివరించారు.
AP: ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ముంబైలో జరిగిన ఎన్విడియా ఏఐ సమ్మిట్లో వీరిద్దరూ కలుసుకున్నారు. అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటులో సూచనలు, మద్దతు ఇవ్వాల్సిందిగా జెన్సన్ను కోరినట్లు లోకేశ్ ఎక్స్లో ట్వీట్ చేశారు. అలాగే భవిష్యత్లో ఏఐ విస్తరణపై కూడా చర్చించినట్లు తెలిపారు. మళ్లీ ఆయనను కలుసుకునేందుకు తహతహలాడుతున్నానంటూ పేర్కొన్నారు.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో INDIA కూటమి తరఫున ఢిల్లీ EX CM కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నట్టు సమాచారం. ఈ విషయమై శివసేన UBT, NCP SP కేజ్రీవాల్ను సంప్రదించినట్టు తెలిసింది. MHలో ఆప్ క్యాడర్ ఉన్న స్థానాల్లో వివాదాస్పద నేపథ్యం లేని అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేస్తారని సమాచారం. హేమంత్ సోరెన్కు మద్దతుగా ఝార్ఖండ్లో ప్రచారం చేస్తారని ఆప్ వర్గాలు చెప్పాయి.
NDAలో కీలక భాగస్వాములైన ఏపీ, బిహార్లకు కేంద్రం ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసింది. ఏపీలో ₹2,245 కోట్ల విలువైన 57 KM అమరావతి లైన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు బిహార్కు ₹4,553 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ 2 రాష్ట్రాలకే రూ.6,798 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించడం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇంట్లో కూర్చొని పైరసీ సినిమాలు చూడడం వల్ల గత ఏడాది వినోద పరిశ్రమకు ₹22,400 కోట్ల నష్టం వాటిల్లినట్టు నివేదికలు అంచనా వేశాయి. సగానికి పైగా భారతీయులు అక్రమంగా కంటెంట్ను యాక్సెస్ చేస్తున్నారని, అందులో 63% OTT కంటెంట్ను వీక్షిస్తున్నారని తేలింది. థియేటర్ల నుంచి ₹13,700 కోట్లు, OTTల నుంచి ₹8,700 కోట్ల విలువైన కంటెంట్ పైరసీ జరిగింది. ఇది కఠిన నిబంధనల అవసరాన్ని నొక్కిచెబుతోంది.
బంగ్లా EX PM షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఢిల్లీలోని ఓ లుటియన్స్ బంగ్లాలో వసతి కల్పించింది! అన్ని వసతులు, గార్డెన్ ఉండేలా లుటియన్స్ బంగ్లాలను 20వ శతాబ్దంలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ లుటియన్స్ రూపొందించారు. హసీనా గత హోదాను దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రులకు కేటాయించదగిన బంగ్లానే ఆమెకూ కేటాయించారు. భద్రత మధ్య లోధీ గార్డెన్స్కి తరచుగా ఆమె వాక్కి వెళ్తున్నట్టు తెలిసింది.
TG: జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో ధాన్యం సేకరిస్తోందని, ఈ సీజన్లో 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రతి ఏటా 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తీసుకొస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. J&Kకు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని J&K క్యాబినెట్ చేసిన తీర్మాన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. అంతకుముందు అబ్దుల్లా.. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్లను కలిశారు. J&Kలో రహదారుల అనుసంధానాన్ని పెంచాలని కోరారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ‘ఫౌజీ’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రేపు, ఎల్లుండి హైదరాబాద్ బీహెచ్ఈఎల్లో జరిగే షూటింగ్లో ప్రభాస్ పాల్గొంటారని తెలుస్తోంది. అలాగే వచ్చే నెల 3, 4 తేదీల్లో కూడా ఇదే సెట్లో ఆయన మళ్లీ షూట్లో పాల్గొంటారని సమాచారం. కాగా ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాక్.
Sorry, no posts matched your criteria.