news

News October 24, 2024

APPLY: NICలో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 500 పోస్టులు ఖాళీలున్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 21 నుంచి 30 ఏళ్ల లోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. అభ్యర్థులు నవంబర్ 11లోపు ఆన్‌లైన్లో అప్లై చేసుకోవాలి. నవంబర్ 30న ఫేజ్-1, డిసెంబర్ 28న ఫేజ్-2 రాత పరీక్షలు నిర్వహిస్తారు. వెబ్‌సైట్: nationalinsurance.nic.co.in/recruitment

News October 24, 2024

‘టార్జాన్’ నటుడు కన్నుమూత

image

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. హాలీవుడ్ నటుడు రాన్ ఎలీ(86) కన్నుమూశారు. 1960లో కండలు తిరిగిన ‘టార్జాన్’గా ఆయన నటించారు. ఈ సినిమాతో ఎంతో గుర్తింపు పొందారు. ఆయన మరణ వార్తను కుమార్తె కిర్‌స్టెన్ సోషల్ మీడియా ద్వారా తాజాగా ధ్రువీకరించారు. ఈ ప్రపంచం ఓ గొప్ప వ్యక్తిని, తాను తండ్రిని కోల్పోయినట్లు ట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు. 100కు పైగా సినిమాల్లో నటించిన ఆయన 2001లో నటనకు స్వస్తిపలికి రచయితగా మారారు.

News October 24, 2024

నమ్ముకున్న పార్టీయే నన్ను అవమానిస్తోంది: జీవన్‌రెడ్డి

image

TG: నమ్ముకున్న పార్టీయే తనను అవమానిస్తోందంటూ AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ MLC జీవన్‌రెడ్డి లేఖ రాశారు. తన భవిష్యత్తు కార్యాచరణపై పార్టీనే మార్గదర్శకం చేయాలన్నారు. కాంగ్రెస్ కూడా కేసీఆర్‌లా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

News October 24, 2024

రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తాం: బండి

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇళ్ల కూల్చివేతలకు తాము వ్యతిరేకమన్నారు. మూసీ ప్రాజెక్ట్ ఓ పెద్ద స్కామ్ అని బండి ఆరోపించారు. ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని ప్రభుత్వానికి మూసీ కోసం రూ.1.50 లక్షల కోట్లు ఎక్కడివని నిలదీశారు.

News October 24, 2024

‘న్యాయదేవత’ మార్పునకు కారణాలేంటో తెలీదు: SC బార్ అసోసియేషన్

image

సుప్రీంకోర్టులో విప్లవాత్మక మార్పులను కపిల్ సిబల్ నేతృత్వంలోని బార్ అసోసియేషన్ ప్రశ్నించింది. కొత్త ఎంబ్లెమ్, న్యాయదేవత మార్పులపై తమను సంప్రదించలేదని పేర్కొంది. మ్యూజియం ప్రతిపాదించిన స్థలంలో లాయర్లకు కెఫేను నిర్మించాలని డిమాండ్ చేసింది. తాము వ్యతిరేకిస్తున్నా మ్యూజియం పనులు మొదలవ్వడంపై ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయ పరిపాలనలో తామూ సమాన హక్కుదారులమని, మార్పులు తమ దృష్టికి తీసుకురాలేదని తెలిపింది.

News October 24, 2024

BREAKING: జానీ మాస్టర్‌కు బెయిల్

image

కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోక్సో కేసులో అరెస్టయిన జానీ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఈ అరెస్టు నేపథ్యంలో ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డు కూడా రద్దయిన విషయం తెలిసిందే.

News October 24, 2024

సుందర్‌కు చోటు: టీమ్ఇండియా భయపడిందన్న గవాస్కర్

image

NZతో రెండో టెస్టులో వాషింగ్టన్ సుందర్‌కు చోటివ్వడం టీమ్‌ఇండియా భయానికి సంకేతమని సునిల్ గవాస్కర్ అన్నారు. అందుకే కుల్‌దీప్ యాదవ్‌ను తీసుకోలేదన్నారు. ‘సాధారణంగా గాయాల బెడద ఉంటే తప్ప జట్టులోంచి ముగ్గుర్ని తప్పించరు. బ్యాటింగ్ డెప్త్‌పై ఆందోళనతోనే కుల్‌దీప్‌ను కాదని సుందర్‌ను తీసుకున్నారు. నిజమే, NZలో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. కానీ కుల్‌దీప్ వారికి దూరంగా బంతిని టర్న్ చేయగలరు’ అని వివరించారు.

News October 24, 2024

అవినాశ్ రెడ్డిని విమర్శిస్తున్నారని కేసు పెట్టడం ఏంటి జగన్?: TDP

image

AP: అవినాశ్ రెడ్డిని విమర్శించడం మానేస్తేనే షర్మిలకు ఆస్తి రాసిస్తానంటూ YS జగన్ బ్లాక్‌మెయిల్ చేశారని TDP ట్వీట్ చేసింది. ‘నీ గురించి రాజకీయంగా విమర్శించవద్దని అన్నావు ఓకే. కానీ మధ్యలో అవినాశ్ ఎందుకు వచ్చాడు? అవినాశ్‌ను విమర్శిస్తున్నారని సొంత తల్లి, చెల్లిపై కేసు పెట్టడం ఏంటి? బాబాయ్ హత్యలో నిందితుడైన అతని గురించి మాట్లాడితే నీ ఇంటి నుంచి జరిగిన హత్య మంత్రాంగం బయటపడుతుందని భయమా?’ అని పేర్కొంది.

News October 24, 2024

సాక్ష్యాలివిగో.. YCP సంచలన ట్వీట్

image

AP: ఇవాళ మ.12గంటలకు <<14432304>>‘ట్రూత్ బాంబ్’<<>> అంటూ ఉత్కంఠ రేకెత్తించిన YCP చెప్పినట్లుగానే సరిగ్గా 12గంటలకు ట్వీట్ చేసింది. ‘మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్‌ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్‌ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!’ అంటూ కొన్ని పత్రాలను జత చేసింది.

News October 24, 2024

HEART TOUCHING: తండ్రే కొడుకై మళ్లీ పుట్టాడేమో!

image

గద్వాల(D) తుమ్మలపల్లికి చెందిన శివ(28)కు కర్నూలు(D) బనగానపల్లెకు చెందిన లక్ష్మీతో పెళ్లైంది. భార్య నిండు గర్భిణి కావడంతో పుట్టింటికి పంపాడు. అయితే మంగళవారం బైక్‌ నుంచి పడి గాయపడ్డ శివను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లక్ష్మీకి కూడా నొప్పులు రావడంతో అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. బుధవారం రాత్రి 2 గంటలకు పరిస్థితి విషమించడంతో శివ మృతి చెందాడు. ఆ తర్వాత గంటకే లక్ష్మీ మగబిడ్డకు జన్మనిచ్చారు.

error: Content is protected !!