India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉందని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ తెలిపింది. బదిలీలు, సర్వీసు అంశాలను సీఎంతో సమావేశంలో చర్చించినట్లు పేర్కొంది. డీఏపై డిప్యూటీ సీఎంతో మాట్లాడి ప్రకటన చేస్తానని సీఎం చెప్పారని వెల్లడించింది. తమ సమస్యల పరిష్కారానికి రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపింది.
గిరిజన ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల బిని ముదులి యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సత్తాచాటారు. నెట్వర్క్ లేకపోవడంతో ఇతర ప్రాంతానికి వెళ్లి యూట్యూబ్ వీడియోలు, ఆన్లైన్ మాక్ టెస్ట్ల ద్వారా ప్రిపేర్ అయి 596వ ర్యాంకు సాధించారు. దీంతో OCSలో ఉద్యోగం పొందిన తొలి బోండా జాతి యువతిగా ఆమె చరిత్ర సృష్టించారు. పేరెంట్స్ కోచింగ్ ఫీజు చెల్లించలేరని, సొంతంగా ప్రిపేర్ అయినట్లు ఆమె తెలిపారు.
భారత్ లక్ష్యం ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే కానీ ఆధిపత్యం చెలాయించడం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. నేడు భారత్ ఉన్న స్థాయిని అటు US, ఇటు చైనా రెండూ విస్మరించలేవని గుర్తుచేశారు. ‘మనది అతి పెద్ద ప్రజాస్వామ్యం. అతి పెద్ద జనాభా కలిగిన దేశం. భూమ్మీద ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడే. మన ఆర్థిక వ్యవస్థను పట్టించుకోకుండా ఉండటం ఎవరికైనా అసాధ్యం’ అని స్పష్టం చేశారు.
BJP జాతీయ అధ్యక్ష ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఈ సారి దక్షిణాది నేతకు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. అదే గనక జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక, తెలంగాణ, AP, కేరళలో పార్టీ బలోపేతానికి ఇది దోహదపడుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు! ఉత్తరాది విషయానికొస్తే రాజ్నాథ్ సింగ్, శివరాజ్సింగ్ చౌహాన్, వినోద్ తావ్డే, సునీల్ బన్సల్ రేసులో ఉన్నారు.
AP: జగన్ తనకు షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమని షర్మిల మండిపడ్డారు. ‘ఆస్తులపై ప్రేమతో కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తెచ్చారు. సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదు. వాటిని బదిలీ చేసుకోవచ్చు. షేర్లు బదిలీ చేస్తే బెయిల్ రద్దవుతుందని జగన్ వాదిస్తున్నారు. 2019లో వంద శాతం వాటాలు బదలాయిస్తానని ఎంవోయూపై సంతకం ఎలా చేశారు? అప్పుడు మీ బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా?’ అని ప్రశ్నించారు.
ఇంట్లో ఆహార పొట్లాలకు చిల్లులు పెట్టి చిత్తడి చేసే ఎలుక కాదిది. ల్యాండ్మైన్లు, క్షయవ్యాధిని గుర్తించగలిగేలా శిక్షణ పొందిన ర్యాట్ ఇది. దీని పేరు మగావా. బెల్జియం ఛారిటీ సంస్థ APOPOలో మగావా శిక్షణ పొందింది. ఐదేళ్ల కెరీర్లో ఈ చిట్టెలుక కంబోడియాలో 100కి పైగా ల్యాండ్మైన్లు, పేలుడు పదార్థాలను పసిగట్టింది. దీని వీరత్వానికి బంగారు పతకం కూడా లభించింది. ఇది జనవరి 2022లో చనిపోయింది.
రెండో టెస్టులో తమిళ తంబీలు వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు న్యూజిలాండ్ జట్టు కుప్పకూలిపోయింది. అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న సుందర్ సంచలన ప్రదర్శన చేశారు. గింగిరాలు తిరిగే బంతులతో కివీస్ ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టారు. మొత్తం ఏడుగురు కివీస్ బ్యాటర్లను పెవిలియన్కు పంపారు. మరోవైపు అశ్విన్ కూడా 3 వికెట్లతో చెలరేగడంతో పర్యాటక జట్టు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
AP: రాబోయే రెండున్నరేళ్లలో రూ.50 వేల కోట్లతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం 47 పనులు కొనసాగుతున్నాయి. 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిలో కొన్నిటికి భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల సమస్యలు ఉన్నాయి. బెంగళూరు-కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ వే పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇందుకు సంబంధించి పర్యావరణ అనుమతులు సాధించాలి’ అని ఆయన పేర్కొన్నారు.
న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత మహిళల జట్టు 227 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా కెప్టెన్ మంధాన(5) విఫలమయ్యారు. హసబ్నిస్(42), దీప్తి శర్మ(41), యస్తిక(37), షఫాలీ(33) ఫర్వాలేదనిపించడంతో మోస్తరు స్కోరు చేసింది. న్యూజిలాండ్ టార్గెట్ 228.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 2వ టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ 259 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లు తీశారు. అనంతరం బరిలోకి దిగిన భారత్ ఒక పరుగుకే రోహిత్ వికెట్ కోల్పోయింది. సౌథీ వేసిన అద్భుతమైన బంతికి ఆయన బౌల్డ్ అయ్యారు. మొత్తంగా 11 ఓవర్లు ఆడిన ఇండియా 16 రన్స్ చేసింది. గిల్(10), జైస్వాల్(6) క్రీజులో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.