India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పండగల సీజన్లో ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవ్వడం రొటీన్. రేట్లు పెంచడం, షాకులివ్వడమే వెరైటీ! ZOMATO, SWIGGY ఇలాగే చేశాయి. జొమాటో ప్లాట్ఫామ్ ఫీజును రూ.6 నుంచి రూ.10కి పెంచిన కొన్ని గంటల్లోనే స్విగ్గీ సైతం రూ.10కి పెంచేసింది. EX. మీరేదైనా ఆర్డరిస్తే, దానిపై డెలివరీ ఫీజు రూ.36, ప్లాట్పామ్ ఫీజు రూ.10 అదనంగా చెల్లించాలి. AUG 2023లో రూ.2గా ఉన్న ఈ ఫీజు ఏడాదిలోనే 400% పెరిగింది.
టీమ్ ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ నెట్స్లో చెమటోడుస్తున్నారు. తొలి మ్యాచ్లో పంత్, సర్ఫరాజ్ వంటి యువ ఆటగాళ్లు రాణించగా, అనుభవజ్ఞుడైన రాహుల్ 0, 12 రన్స్కే ఔటయ్యారు. రెండు ఇన్నింగ్స్లలోనూ న్యూజిలాండ్ బౌలర్ ఓ రూర్కే బౌలింగ్లో రాహుల్ ఔటయ్యారు. దీంతో అదే హైట్ ఉన్న మోర్నే మోర్కెల్ బౌలింగ్లో రాహుల్ నెట్స్లో సాధన చేశారు. రేపు ఉదయం 9.30 గంటలకు రెండో టెస్టు మొదలుకానుంది.
BRICSలో జాయిన్ అయ్యేందుకు 30+ కంట్రీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అన్నారు. తమ కూటమితో సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్న గ్లోబల్ సౌత్, ఈస్ట్ దేశాల ఆసక్తిని విస్మరించకూడదని చెప్పారు. అదే టైమ్లో బ్యాలెన్స్ మెయింటేన్ చేయడం, సామర్థ్యం తగ్గకుండా చూసుకోవడం అవసరమన్నారు. తీవ్రమైన ప్రాంతీయ వివాదాలపై డిస్కస్ చేస్తామన్నారు. UNకు BRICS పోటీగా మారొచ్చన్న సందేహాలున్న సంగతి తెలిసిందే.
TG: బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి కొండా సురేఖ తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని నాంపల్లి కోర్టులో KTR వాంగ్మూలం ఇచ్చారు. ‘నేను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని సురేఖ అన్నారు. సాక్షులు నాకు 18ఏళ్లుగా తెలుసు. సురేఖ చేసిన వ్యాఖ్యలను TVలో చూసి వారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నాకు, BRSకి నష్టం చేయాలనేదే ఆమె ఉద్దేశం’ అని పేర్కొన్నారు. సురేఖ వ్యాఖ్యల వీడియోను కోర్టుకు సమర్పించారు.
AP: ప్రతి ఏటా రూ.2,684కోట్లతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈనెల 31న ఈ స్కీమ్ను ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మూడు సిలిండర్లను ఇచ్చేందుకు ఒక షెడ్యూల్ను ఖరారు చేశామన్నారు. ఏప్రిల్-జులై మధ్య మొదటి సిలిండర్, ఆగస్టు-నవంబర్ మధ్య రెండోది, డిసెంబర్-మార్చి 31 మధ్య మూడో సిలిండర్ను ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. చైనాకు చెందిన ఓ వీరాభిమాని ఏకంగా 13వేల కిలోమీటర్లు ఆరున్నర నెలలు సైకిల్పై ప్రయాణించి రొనాల్డోను కలుసుకున్నారు. సౌదీ ప్రో లీగ్లో అల్ షబాబ్తో జరిగిన మ్యాచ్ తర్వాత అభిమాని గురించి తెలుసుకొని రొనాల్డో అతణ్ని కలిసి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. విమానంలో ప్రయాణించే స్తోమత లేకపోవడంతో అతను సైకిల్పై వెళ్లినట్లు తెలుస్తోంది.
AP: రాష్ట్రంలో రూ.99కే క్వార్టర్ మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఒక్కో లిక్కర్ షాప్నకు 3 నుంచి 8 కేసులు మాత్రమే సరఫరా చేస్తుండగా, త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు వైన్స్ నిర్వాహకులు చెబుతున్నారు. షార్ట్స్ పేరుతో బ్రాండీ, విస్కీ విక్రయాలు కూడా జరుగుతున్నాయి. దీంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గాజా యుద్ధాన్ని ముగించేందుకు ఇజ్రాయెల్కు ఇదే సరైన సమయమని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తాజాగా పేర్కొన్నారు. ఇరాన్తో ఉద్రిక్తతల్ని పెంచొద్దని ఆ దేశానికి సూచించారు. ‘గత ఏడాది అక్టోబరు 7 తర్వాతి నుంచి గాజా విషయంలో ఇజ్రాయెల్ నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించింది. ఇప్పుడు ఆ విజయాలను శాశ్వతం చేసుకోవాలి. పరిస్థితి మరింత దిగజారనివ్వకూడదు. గాజాకిప్పుడు మానవతాసాయం అవసరం’ అని పేర్కొన్నారు.
టీమ్ ఇండియాలో క్రికెటర్ KL.రాహుల్ చోటుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కోచ్ గంభీర్ స్పందించారు. వాటితో తమకు అవసరం లేదని, మేనేజ్మెంట్ ఏం అనుకుంటుందనేదే తమకు ముఖ్యమన్నారు. జట్టును ఎంపిక చేసేది నెటిజన్లు కాదన్నారు. రాహుల్ మంచి ఫామ్లో ఉన్నారని, అతడు పెద్ద స్కోర్లు చేయాలని భావిస్తున్నాడని తనకు అనిపిస్తోందని గౌతీ చెప్పుకొచ్చారు. న్యూజిలాండ్తో రెండో టెస్టు రేపు ప్రారంభం కానుంది.
TG: తనకు నోటీసులు పంపిస్తానన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ <<14431823>>వ్యాఖ్యలపై<<>> కేటీఆర్ స్పందించారు. ‘బండి సంజయ్ నాకు లీగల్ నోటీసు ఇస్తే నేను ఆయనకు మళ్లీ లీగల్ నోటీస్ పంపిస్తా. రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ లీగల్ నోటీసు ఇవ్వలేదా? లీగల్ నోటీసుల విషయంలో నరేంద్ర మోదీ బాటలో నడుస్తా’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.