India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెస్టుల నుంచి రిటైరైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన సేవలు అవసరమైతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సాధన కోసం షెఫీల్డ్ షీల్డ్లో ఆడతానని పేర్కొన్నారు. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియాకు స్మిత్ ఓపెనింగ్ చేస్తుండగా, BGTకి ఆ స్థానం నుంచి తప్పుకొన్నారు. ఓపెనింగ్ స్థానానికి ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో వార్నర్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆఫీసులో ఫ్రీ మీల్స్ ఏర్పాటుతో ఉద్యోగుల్లో సృజనాత్మకత, సహకార ధోరణి పెరుగుతాయని ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచ్చాయ్ అన్నారు. ఉద్యోగంలో చేరిన తొలి నాళ్లలో కేఫేలో ఇతరులతో చర్చల వల్ల పనిపట్ల ఉత్సుకత పెరిగి క్రియేటివిటీ పనితీరుకు దోహదం చేసేదని పేర్కొన్నారు. గూగుల్ కొత్త ఐడియాస్ సంస్థలోని కేఫే చర్చల్లో పుట్టుకొచ్చినవే అని వివరించారు. ఫ్రీ మీల్స్తో ఖర్చుల కంటే ప్రయోజనాలు ఎక్కువన్నారు.
టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను HYD పోలీసులు అరెస్టు చేశారు. నకిలీపత్రాలతో రాయదుర్గంలో రూ.వేల కోట్ల విలువైన 84 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ఆయన ప్రయత్నించినట్లు తేలింది. 20 ఏళ్లపాటు హైకోర్టు, సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. ఆయన సమర్పించిన పత్రాలు నకిలీవని సుప్రీం తేల్చడంతో పోలీసులు కేసు పెట్టారు. ఈయన సీతారత్నంగారి అబ్బాయి, ప్రేమంటే ఇదేరా, యువరాజు, దరువు చిత్రాలను నిర్మించారు.
AP: తుఫాన్ దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ పరిధిలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. 23న 18, 24న 37, 25న 11 రైళ్లను క్యాన్సిల్ చేసినట్లు పేర్కొంది. సికింద్రాబాద్-భువనేశ్వర్, కన్యాకుమారి-దిబ్రూగఢ్, చెన్నై సెంట్రల్-షాలిమార్, ముంబై-భువనేశ్వర్ కోణార్క్, హైదరాబాద్-హౌరా ఈస్ట్ కోస్ట్, బెంగళూరు-హౌరా తదితర రైళ్లు రద్దయ్యాయి.
TG: అసెంబ్లీని అఘాఖాన్ ట్రస్ట్ రూ.49కోట్ల అంచనా వ్యయంతో రెనొవేట్ చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పనులను 3 నెలల్లో పూర్తి చేస్తామని, నిజాం కాలంలో అసెంబ్లీ ఎలా కట్టారో అలా మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు.
తాను సినీ ఫీల్డ్లో ఉండటం తన భార్యకు ఇష్టం ఉండేది కాదని తమిళ నటుడు విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా భార్య శైలజ, నేను తొలిసారి మీట్ అయ్యే టైమ్కి ఓ షూట్లో ప్రమాదం వల్ల తీవ్ర గాయాలతో ఉన్నాను. దాంతో నేను సినిమాలు చేయడం తనకిష్టం ఉండేది కాదు. దానికి తోడు వాళ్ల కుటుంబమంతా కవులు, మేధావులే. కానీ నేను నటనను వదులుకోలేకపోయాను. ఇప్పుడు తను మారిపోయింది. నాకు పూర్తి మద్దతుగా నిలుస్తోంది’ అని తెలిపారు.
HYD బాచుపల్లి సర్కిల్లోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని <<14415656>>అనూష<<>> ఆత్మహత్య చేసుకోవడంపై మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల కింద కాలేజీ, హాస్టల్ను తనిఖీ చేస్తే విద్యార్థులు అనేక సమస్యలను తన దృష్టికి తెచ్చారని చెప్పారు. అయినా యాజమాన్యం పట్టించుకోలేదని ఫైరయ్యారు. కాలేజీల విషయంలో సీఎం రేవంత్ సీరియస్గా ఉన్నారని, చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
భారత టెస్టు జట్టులో మిడిలార్డర్ కోసం పోటీ ఎక్కువగా ఉందని అసిస్టెంట్ కోచ్ డస్కాటే అన్నారు. ఆరు స్థానాలకు ఏడుగురు పోటీ పడుతున్నారని, పిచ్ను బట్టి జట్టును సెలక్ట్ చేస్తామని చెప్పారు. ‘గిల్ ఫిట్గా ఉన్నారు. పంత్ గాయం నుంచి కోలుకున్నారు. సర్ఫరాజ్ తొలి టెస్టులో భారీ స్కోర్ చేశారు. KL రాహుల్ మానసికంగా బలంగా ఉన్నారు. ప్లేయర్లందరికీ మా మద్దతు ఉంటుంది. జట్టు ప్రయోజనాలే మాకు ముఖ్యం’ అని మీడియాకు తెలిపారు.
BJP కో-ఫౌండర్, అగ్రనేత LK అద్వానీ పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు. 97 ఏళ్ల అద్వానీకి పార్టీ ముఖ్యులు పురందీశ్వరి సహా తదితరులు మెంబర్షిప్ను అందించారు. 1927లో పాక్లోని కరాచీలో జన్మించిన అద్వానీ 1942లో RSSలో వాలంటీర్గా చేరారు. 1986 నుంచి 1990 వరకు, మళ్లీ 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకు BJP జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. BJP సభ్యత్వ నమోదు 10 కోట్లు దాటింది.
TG: రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళనకరంగా మారాయని KTR అన్నారు. గత కొన్ని నెలలుగా తాము చెబుతున్నదే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ <<14422586>>జీవన్ రెడ్డి<<>> చెప్పారని Xలో పేర్కొన్నారు. హోం మినిస్టర్ లేకపోవడం, పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా పొలిటికల్ బాసులు పోలీసులకు స్వేచ్ఛనివ్వాలని, పోలీసులు శాంతిభద్రతలను కాపాడటంపై దృష్టి పెట్టాలని KTR కోరారు.
Sorry, no posts matched your criteria.