India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలో కోటీశ్వరులు పెరుగుతున్నారు. AY2013-14లో రూ.కోటికి మించి Taxable Income చూపినవారి సంఖ్య 44,078. పదేళ్లలో (AY2023-24) వీరు 2.3 లక్షలకు చేరారు. ఆదాయం పెరగడం, ITR ఫైలింగ్ ఈజీ అవ్వడమే ఇందుకు కారణాలు. AY2023-24లో రూ.కోటిగా పైగా ITR ఫైల్ చేస్తున్నవారిలో ఉద్యోగులు 52% ఉన్నారు. చాలామందికి రూ.1-5 కోట్ల వరకు శాలరీ వస్తోంది. మొత్తంగా ITR ఫైల్ చేస్తున్నవారు పదేళ్లలో 3.3 కోట్ల నుంచి 7.5 కోట్లకు చేరారు.
AP: హైకోర్టులో దాఖలు చేసిన <<14413512>>పిటిషన్లో<<>> అల్లు అర్జున్ పలు విషయాలను ప్రస్తావించారు. MLAగా పోటీ చేస్తున్న స్నేహితుడు కిశోర్రెడ్డి ఇంటికి వెళ్లడం తన వ్యక్తిగత పర్యటన అని వివరించారు. ఆయన్ను అభినందించేందుకు మాత్రమే వెళ్లానని, బహిరంగ సభ నిర్వహించే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. ఎన్నికల టైంలో వ్యక్తిగత సందర్శన కోడ్ ఉల్లంఘన కిందకు రాదని, కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. రేపు ఈ పిటిషన్ విచారణకు రానుంది.
బలమైన బ్యాటింగ్ లైనప్కు కేరాఫ్గా పేరున్న టీమ్ ఇండియా క్రమంగా బలహీనమవుతూ వస్తోంది. 2020 నుంచి సొంతగడ్డపై టెస్టుల్లో యావరేజ్ రన్స్ పర్ వికెట్ తగ్గిపోతూ వస్తోంది. 2015-19లో తొలి ఇన్నింగ్స్ సగటు 48.57 ఉంటే ఇప్పుడు 32.62కి పడిపోయింది. 2వ ఇన్నింగ్స్లో 53.93 నుంచి 36.58 రన్స్కి తగ్గింది. అటు మన పిచ్లపై విదేశీ బ్యాటర్ల రన్రేట్ పెరుగుతూ వస్తోంది. NZతో టెస్టులో భారత్ 46 పరుగులకే ఆలౌట్ అయింది.
TG: అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.
సంయుక్త లక్ష్యాలను సాధించేందుకు అనేక దేశాలతో US కలిసి పనిచేస్తుందని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరిన్ జీన్ పియరీ అన్నారు. BRICSను తాము జియో పొలిటికల్ రైవల్గా చూడటం లేదని పేర్కొన్నారు. భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. PM మోదీ సైతం ‘బ్రిక్స్ యాంటీ వెస్ట్రన్ కూటమి కాదు, నాన్ వెస్ట్రన్ కూటమి మాత్రమే’ అని అభిప్రాయపడటం తెలిసిందే. G7తో పోలిస్తే BRICS బలంగా మారింది.
AP: కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) అదనపు గదులు, లేబొరేటరీలు ఇతర సివిల్ పనుల కోసం సమగ్ర శిక్ష రూ.24.84 కోట్లు మంజూరు చేసింది. వీటిలో రూ.20.61 కోట్లు నిర్మాణాలకు, రూ.4.23 కోట్లు రిపేర్ల కోసం ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. అన్ని పనులను మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించింది.
రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా బ్రిజ్భూషణ్ను తొలగించాలంటూ చేసిన ఉద్యమంలో తన సహచర రెజర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియాపై రెజ్లర్ సాక్షి మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పు. అది మా నిరసనకు చెడ్డ పేరు తెచ్చింది. కొందరు వారిద్దరిలో స్వార్థం నింపి సొంత ప్రయోజనాల కోసం ఆలోచించేలా చేయగలిగారు’ అని తన పుస్తకం విట్నెస్లో వెల్లడించారు.
భారత్తో తమది సుదీర్ఘ మిత్రబంధమని ఇజ్రాయెల్ అంబాసిడర్ రూవెన్ అజర్ అన్నారు. వెస్ట్ ఏషియాలో ఎకనామికల్గా, పొలిటికల్గా ఢిల్లీ చాలా చేయగలదని పేర్కొన్నారు. ‘భారత్ మా సెల్ప్ డిఫెన్స్ హక్కును సమర్థించింది. వాళ్లు చాలా సమర్థులు. OCT 7న మాపై భీకర దాడి జరిగింది. సామాన్యులు చనిపోయారు. హమాస్ను దాదాపుగా తుడిచిపెట్టేశాం. గాజా, లెబనాన్లో కొంత పని మిగిలే ఉంది. మా ప్రజలు స్వేచ్ఛగా బతికేలా చేస్తాం’ అని అన్నారు.
మూడు సార్లు పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ సారి తనను తానే పెళ్లి చేసుకున్నట్లు ట్విస్ట్ ఇచ్చారు. సోలోగా హనీమూన్కు వెళ్లానని ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను చేసిన తెలివైన పని ఇదేనని రాసుకొచ్చారు. 42 ఏళ్ల ఈ పాప్ సింగర్ ఈ ఏడాది మేలో సామ్ అస్గారి నుంచి విడాకులు తీసుకున్నారు.
AP: ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల్లో పని చేస్తున్న వారు రాత్రి పూట చదువుకునేలా 6 పాలిటెక్నిక్ కాలేజీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మామూలు రోజుల్లో రాత్రి 6-9 గంటల వరకు, ఆదివారాల్లో పూర్తిగా క్లాసులు నిర్వహిస్తారు. విశాఖలో 3, చిత్తూరులో 2, రాజమహేంద్రవరంలో ఒక కాలేజీలో 429 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 26వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సెలక్ట్ చేసుకున్న కాలేజీల్లోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
Sorry, no posts matched your criteria.