news

News March 1, 2025

కులగణన రీసర్వే పూర్తి.. కేసీఆర్, హరీశ్ దూరం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండోవిడత కులగణన సర్వే నిన్నటితో పూర్తయింది. 18,539కుటుంబాలు సర్వేలో వివరాలు సమర్పించాయి. 3లక్షల56వేలకు పైగా కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉండగా కేవలం 5.21శాతం ఫ్యామిలీల సమాచారం మాత్రమే నమోదైంది. దీంతో ఇప్పటివరకూ మెుత్తంగా 1.12కోట్లకు పైగా కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. కేసీఆర్, హరీశ్‌రావు కుటుంబసభ్యులు సర్వేకు దూరంగా ఉన్నారు.

News March 1, 2025

పెత్తనం చేసే మహిళా సర్పంచ్ భర్తలకు ఫైన్!

image

చాలా గ్రామాల్లో పేరుకే మహిళా సర్పంచ్ ఉంటారు. ఆమె భర్తే పెత్తనం చేస్తుంటారు. ఇలా మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న వారికి జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది. ఎన్నికైన మహిళా సర్పంచులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, పాలనలో వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఓ వ్యవస్థ తీసుకురావాలని కమిటీ సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పించింది.

News March 1, 2025

తీవ్ర ఉత్కంఠ.. ఆ 5 లొకేషన్లలో ఏముంది?

image

SLBC టన్నెల్‌లో గల్లంతైనవారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. GPR పరికరం 5 లొకేషన్లలో మెత్తటి వస్తువులు ఉన్నట్లు గుర్తించింది. అయితే అవి కార్మికుల మృతదేహాలా? లేక వేరే ఏమైనా పరికరాలా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. దీంతో ఆ 5 లొకేషన్లలో సిబ్బంది డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. 3-5 మీ. తవ్వితే అక్కడ ఏం ఉందనే దానిపై క్లారిటీ రానుంది. మరోవైపు టన్నెల్ బయట అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు.

News March 1, 2025

శ్రీకాళహస్తిలో శివపార్వతుల కళ్యాణోత్సవం

image

AP: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుడి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్లను ఆలయ అలంకార మండపంలో సుందరంగా అలంకరించి పెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చారు. ఇదే కళ్యాణ ఘడియలో వందకు పైగా జంటలు మనువాడాయి. వీరికి దేవస్థానం ఆధ్వర్యంలో తాళిబొట్లు, ఇతర పెళ్లి సామగ్రి ఉచితంగా అందించారు.

News March 1, 2025

శివకుమార్ పార్టీని చీలుస్తారు: బీజేపీ నేత

image

కర్ణాటక కాంగ్రెస్‌లో చీలికలు వచ్చేఅవకాశముందని ప్రతిపక్ష బీజేపీ నేత అశోక ఆరోపించారు. ఏక్‌నాథ్ శిందే తరహాలో ఆ పార్టీని ఉపముఖ్యమంత్రి డి.కే శివకుమార్ బీజేపీలో విలీనం చేసే అవకాశముందని తెలిపారు. నవంబర్16న కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు జరగనుందని జోస్యం చెప్పారు. అయితే శివరాత్రి వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు డి.కే శివకుమార్ పాల్గొనటంతో పుకార్లు రేగాయి. ఉప ముఖ్యమంత్రి దీన్ని ఖండించారు.

News March 1, 2025

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులను నేరుగా క్యూలైన్లలోకి పంపుతుండటంతో, ఉ.7గంటల వరకు కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఉ.8 గంటలకు బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇకపై భక్తులను కంపార్ట్‌మెంట్లలోకి పంపనున్నారు. వారు శ్రీవారిని దర్శించుకోవడానికి దాదాపు 8గంటల సమయం పట్టే అవకాశం ఉంది. నిన్న 52,731 మంది దర్శించుకోగా 17,664 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.24 కోట్లు వచ్చింది.

News March 1, 2025

ఇంటర్ పరీక్షలు.. విద్యార్థి ఆత్మహత్య

image

TG: పరీక్షల ఒత్తిడి ఇంటర్ విద్యార్థి ప్రాణాలు బలితీసుకుంది. హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన దీక్షిత్ రాజు(17) మియాపూర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈనెల 5 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈక్రమంలోనే నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయాడు. విద్యార్థి దశలో పరీక్షలు ఒక భాగమని, వాటికి భయపడొద్దని మానసిక నిపుణులు చెబుతున్నారు.

News March 1, 2025

ట్రెండింగ్‌లో #MenToo

image

మూవీ ఇండస్ట్రీని ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కుదిపేశాయి. అవకాశాల కోసం ఇండస్ట్రీలో పురుషుల అవసరాలు తీర్చాలని కొందరు నటీమణులు చెప్పగా #METO0 అంటూ పలువురు బయటికొచ్చారు. ఇటీవల, భార్యల వేధింపులు తట్టుకోలేక భర్తలు సూసైడ్ చేసుకుంటున్నారు. అతుల్ సుభాష్ మొదలుకొని మానవ్ శర్మ వరకు దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో తమనూ భార్యలు వేధిస్తున్నట్లు #MenToo అని పోస్టులు పెడుతున్నారు.

News March 1, 2025

నేటి నుంచి EAPCET దరఖాస్తుల స్వీకరణ

image

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు నిర్వహించే EAP-CET దరఖాస్తుల స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 4వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ దీన్‌కుమార్ తెలిపారు. గతనెల 25నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా 15% నాన్-లోకల్ కన్వీనర్ కోటా అంశంపై స్పష్టత కోసం ప్రభుత్వం వాయిదా వేసింది. నిన్న దీనిపై <<15604020>>నిర్ణయం<<>> తీసుకోగా నేటి నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తోంది.

News March 1, 2025

రూ.3.2లక్షల కోట్ల బడ్జెట్‌లో.. రూ.లక్ష కోట్ల అప్పు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో రూ.3.2లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా, తాజా బడ్జెట్ అమలుకు రూ.లక్ష కోట్ల అప్పు అవసరం కానుంది. ఇందులో బహిరంగ మార్కెట్ నుంచి రూ.80వేల కోట్లు, కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థల నుంచి మిగతా రుణం తీసుకోనున్నట్లు బడ్జెట్ పత్రాల్లో ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, రూ.3.22లక్షల కోట్లలో రెవెన్యూ రాబడి రూ.2.17లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేసింది.