India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: సంక్రాంతి పండగ వేళ టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. అప్ అండ్ డౌన్(రానూపోనూ) టికెట్ బుక్ చేసుకుంటే ఛార్జీల్లో 10శాతం రాయితీ ప్రకటించింది. ఇప్పటికే పలు మార్గాల్లో టికెట్ ధరలు, ఈవీ బస్సు ప్రయాణాల్లో రాయితీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ <

మామిడి చెట్లలో పూత పూర్తిగా విడిగిన దశలో తేనెటీగలు ఎక్కువగా తిరుగుతూ ఫలదీకరణకు సహాయపడతాయి. అందుకే ఈ దశలో చెట్లకు ఎలాంటి మందులు స్ప్రే చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మందులను పిచికారీ చేస్తే పిందె ఏర్పడడానికి అవసరమయ్యే పుప్పొడి కొట్టుకుపోతుంది. అలాగే పిందె ఏర్పడటానికి సాయం చేసే తేనేటీగలు కూడా రసాయనాల వల్ల చనిపోతాయి. ఫలితంగా ఫలదీకరణ సరిగా జరగక పిందె సరిగా కట్టదు.

కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఈ రోజంతా నవ్వుతూ ఉండాలి. ఇంటిని శుభ్రం చేసి, గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులేసి, తోరణాలతో అలంకరించాలి. సాయంత్రం లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసి, తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అన్నదానం, వస్త్రదానం చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. నేడు సంతోషంగా జీవిస్తే మహాలక్ష్మి అనుగ్రహంతో ఏడాదంతా ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.

AP: ఎస్సీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్వయం ఉపాధి పథకాల కింద SC యువత తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేసింది. దీంతో 11,479 మందికి ఊరట కలగనుంది. మరోవైపు SC కార్పొరేషన్, సెర్ప్ ఆధ్వర్యంలో 4,400 మందికి రాయితీ రుణాలు ఇవ్వనుంది. ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. ₹50వేల వరకు రాయితీ ఇచ్చి, మిగతా మొత్తాన్ని వడ్డీలేని రుణంగా ఇవ్వనుంది. ఇందుకు ప్రభుత్వం ₹63.26 కోట్లు రిలీజ్ చేసింది.

TG: కొత్త ఏడాదికి ముందు 4 రోజుల్లోనే(28,29,30,31) రూ.1,230 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ నెలలో మొత్తంగా రూ.5వేల కోట్ల మద్యం సేల్స్ జరిగాయని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికలు, కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడమూ కారణమని చెబుతున్నారు. ఒక్క నెలలో ఈ స్థాయిలో అమ్మకాలు జరగడం రికార్డు కాగా, 2023 డిసెంబర్లో రూ.4,291 కోట్ల అమ్మకాలు జరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని రకాల మామిడి చెట్లలో ఇప్పటికే పూమొగ్గలు కనిపిస్తున్నాయి. ఇలా పూమొగ్గలు ఏర్పడి, అవి పెరుగుదల దశలో ఉన్నప్పుడు తేలికపాటి నీటి తడి ఇవ్వాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పిందె ఏర్పడిన తర్వాత (బఠాణి గింజ సైజులో ఉన్నప్పుడు), ప్రతి 15-20 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలని చెబుతున్నారు. రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి వ్యవసాయ నిపుణుల సూచనలు తీసుకోవాలి.

కొత్త ఏడాది మొదటి రోజున మనం చేసే పనులు ఆ ఏడాదంతా మనపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఇంట్లో గొడవలు, వాదనలకు దూరంగా ఉండాలని, అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదని సూచిస్తున్నారు. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని అంటున్నారు. ‘నలుపు దుస్తులు వద్దు. ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది. ఏడిచినా, విచారంగా ఉన్నా ఏడాదంతా అదే కొనసాగుతుంది’ అంటున్నారు.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<

కొత్త ఏడాదిలోకి గ్రాండ్గా అడుగు పెట్టేశాం. ఈ శుభ సందర్భంలో చాలా మంది రెజల్యూషన్స్ తీసుకుంటారు. ఉద్యోగం సాధించాలని, పొదుపు చేయాలని, మందు/ సిగరెట్ మానేయాలని, డైట్ ఫాలో కావాలని, జిమ్కు వెళ్లాలని, కొత్త ప్రదేశాలు చుట్టిరావాలని ఇలా తమకు నచ్చిన తీర్మానాలు చేసుకుంటారు. మీ రెజల్యూషన్స్ ఏంటి? గతేడాది పెట్టుకున్న గోల్స్ను పూర్తి చేశారా? కామెంట్ చేయండి.

కొందరు పాడి రైతులు పశువు నుంచి పాలను సేకరించేటప్పుడు పొదుగు నుంచి పూర్తిగా పాలను తీయకుండా కొన్నింటిని వదిలేస్తారు. ఇలా పొదుగులో మిగిలిపోయిన పాలలోకి బాక్టీరియా చేరి పొదుగువాపు వ్యాధికి కారణమవుతుందని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అలాగే పొదుగుకు అయ్యే చిన్న గాయాలకు చికిత్స అందించకుండా నిర్లక్ష్యం చేస్తే, ఇన్ఫెక్షన్ నెమ్మదిగా పొదుగులోకి వ్యాపించి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.