India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైసీపీ నేత నందిగం సురేశ్ను ఈరోజు పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. 2020లో జరిగిన ఘర్షణల విషయంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత మంగళగిరి కోర్టులో హాజరుపరుస్తారు. రెండు రోజుల పోలీసుల కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టుకు తీసుకొస్తున్నారు. కాగా విచారణలో తేలిన అంశాల ఆధారంగా త్వరలోనే ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
బెంచ్మార్క్ సూచీలు లాభాల్లో మొదలవ్వొచ్చు. ఆసియా మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిక్కీ, తైవాన్, కోస్పీ, జకార్తా సూచీలు మెరుగ్గా ట్రేడవుతున్నాయి. చైనా, హాంకాంగ్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. OCTలో FIIలు రూ.80,217 కోట్లను వెనక్కి తీసుకున్నారు. DIIలు రూ.74,176 కోట్లు పెట్టుబడి పెట్టారు. అంటే నెట్ లాస్ తక్కువగానే ఉంది. కంపెనీల రిజల్ట్స్ను బట్టి సూచీల కదలిక ఉంటుంది.
AP: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ కలుషిత నీటి వల్ల వాంతులు, విరేచనాలతో నాలుగు రోజుల వ్యవధిలోనే ఏడుగురు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే ఆయన బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అక్కడి పరిస్థితులపై సమీక్షిస్తారు.
దేవుడిని బలంగా నమ్మితే సమస్యలకు దారి చూపిస్తాడని CJI DY చంద్రచూడ్ అన్నారు. అయోధ్య కేసు విచారణ టైమ్లో రోజూ దేవుడి ముందు ప్రార్థించేవాడినని పేర్కొన్నారు. వందల ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నట్టు తెలిపారు. తన నేటివ్ విలేజ్ కనేర్సర్లో సన్మానం తర్వాత మాట్లాడారు. ‘కొన్నిసార్లు పరిష్కరించలేని కేసులు వస్తుంటాయి. అయోధ్య వివాదం ఇలాంటిదే’ అని అన్నారు. ఈ తీర్పు రాసిన ఐదుగురు జడ్జిల్లో DYC ఒకరు.
దీపావళి సందర్భంగా ‘మూరత్’ ట్రేడింగ్ను నవంబర్ 1న సా.6-7 గంటల మధ్య నిర్వహించనున్నట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రకటించాయి. హిందూ కాలమానం ప్రకారం ఆరోజు నుంచి ‘సంవత్ 2081’ ప్రారంభం అవుతుంది. మదుపరులు, బ్రోకర్లకు మూరత్ ట్రేడింగ్ భోగభాగ్యాలు ప్రసాదిస్తుందని విశ్వాసం. అందుకే చాలామంది ఆరోజు కనీసం ఒక్క షేర్ అయినా కొనుగోలు చేయాలని చూస్తారు. అంతకుముందు రోజు(దీపావళి-అక్టోబర్ 31)న ప్రీఓపెనింగ్ సెషన్ ఉంటుంది.
TG: రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిందని, KCR ఒక్కడి వల్లే రాలేదని MLC కోదండరాం అన్నారు. నిజామాబాద్ TNGOs భవన్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ కోసం ఎన్నో సంఘాలు ఉద్యమించాయి. ఎందరో బలిదానాలు చేయడంతో రాష్ట్రం సిద్ధించింది. KCR తన స్వలాభం కోసం ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తున్నారు. పదేళ్ల పాలనలో నిరుద్యోగ సమస్యలను BRS తీర్చలేదు’ అని ఆయన విమర్శించారు.
TG: రేషన్ కార్డుల్లో అర్హుల పేర్లు చేర్చడంపై ప్రభుత్వం త్వరలోనే తీపికబురు అందించనుంది. కుటుంబంలో పిల్లలు, కోడలు, కొత్త సభ్యుల పేర్లు నమోదు కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. దాదాపు 10 లక్షల మందికి పైగా పేర్లు చేర్చాలని దరఖాస్తు చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశం పూర్తయ్యాక పేర్లు నమోదు చేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమాచారం.
TG:’కాజీపేటలో కోచ్ఫ్యాక్టరీ’ కోసం వరంగల్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. నిన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి <<14406395>>ప్రకటనతో<<>> వారి కల త్వరలోనే నెరవేరనుంది. ఈ కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్, స్లీపర్ కోచ్లు తయారీ కానున్నాయి. ఇటీవలే దీనిపై RVNL, రైల్వే బోర్డు మధ్య చర్చలు జరిగాయి. ఇప్పటికే వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ ఇక్కడ సిద్ధం అవుతుండగా, కోచ్ ఫ్యాక్టరీ కూడా వస్తే ఓరుగల్లు రూపురేఖలే మారిపోతాయి.
AP: 2024-25 రబీ సాగుకు సంబంధించిన ప్రణాళికలను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 56.58లక్షల ఎకరాలు కాగా ఈసారి 57.65లక్షల ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించింది. ప్రధానంగా 19.87లక్షల ఎకరాల్లో వరి, 11.17లక్షల ఎకరాల్లో శనగ, 8.44లక్షల ఎకరాల్లో మినుము, 5.23లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేయనున్నారు. రబీకి సబ్సిడీతో 3.85లక్షల క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం ఇవ్వనుంది.
TG: అభ్యర్థుల ఆందోళనలు, ప్రభుత్వ పట్టుదల నడుమ మరికొన్ని గంటల్లో గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మ.12.30 నుంచి 1.30 గంటల వరకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చేవారిని అనుమతించబోమని స్పష్టంచేశారు. పరీక్షలకు సంబంధించి అనుమానాలపై 040-23452185, 040-23452186 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.