India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సమాజం కోసం ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటారు పోలీసులు. అరాచక శక్తులను ఎదుర్కొనే క్రమంలో ఒక్కోసారి అమరులవుతుంటారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఉద్యోగాలు చేస్తూ సంఘ విద్రోహ శక్తుల నుంచి సమాజాన్ని కాపాడుతారు. విధి నిర్వహణలో అమరులైన వారి గౌరవార్థం, వారి జీవితాలను యువ పోలీసులు ఆదర్శంగా తీసుకునేలా ఏటా OCT 21న దేశంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తుంటారు.
☘ వీరులారా.. వందనం
AP: వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత ప్రభుత్వం తనపై పెట్టిన కేసు కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్ను Dy.CM పవన్ కళ్యాణ్ ఉపసంహరించుకున్నారు. చట్టపరంగా ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించేందుకు వీలు కల్పిస్తూ పిటిషన్ వెనక్కి తీసుకునేలా అనుమతివ్వాలని పవన్ లాయర్ కోరగా హైకోర్టు ఓకే చెప్పింది. వాలంటీర్లు సేకరించిన సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లి మహిళలను అపహరిస్తున్నారని పవన్ గతంలో అన్నారు.
TG: గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు, అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. జీవో 29పైనే ప్రధానంగా ఇవాళ న్యాయస్థానంలో వాదనలు జరుగుతాయని, తమకు న్యాయం జరుగుతుందని పిటిషనర్లు ఆశలు పెట్టుకున్నారు. ఓ వైపు విద్యార్థులు ఆందోళనలు, మరో వైపు ప్రభుత్వం ఇవాళ్టి నుంచి పరీక్షలు నిర్వహిస్తుండటంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ వద్ద ఏర్పడ్డ ఆవర్తనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 23నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రంలో ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
క్యారెట్లు మరీ ఎక్కువగా తింటే మనిషి చర్మం స్వల్పంగా ఆరెంజ్ కలర్లోకి మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని కెరోటెనీమియాగా వ్యవహరిస్తారు. క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ అనే పిగ్మెంట్ మనిషి శరీరంలో విటమిన్-ఏగా మారుతుంది. పిగ్మెంట్ స్థాయి మోతాదుకి మించితే రక్త ప్రసరణలోకి చేరుతుంది. అది ఇంకా పెరిగితే దేహం ఆరెంజ్ కలర్లో కనిపించొచ్చని, కానీ ప్రమాదకరమేమీ కాదని నిపుణులు తెలిపారు.
అత్యంత కష్టమైన అమెరికా అధ్యక్ష పదవిలో పనిచేసేంత ఫిట్గా ట్రంప్ ఉన్నారా అంటూ కమలా హారిస్ తాజాగా ప్రశ్నించారు. అలసిపోవడం వల్ల పలు ఇంటర్వ్యూలను ట్రంప్ రద్దు చేసుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె స్పందించారు. ‘ప్రచారంలోనే అలసిపోయే మీరు అధ్యక్ష పదవికి అర్హులేనా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి’ అని విమర్శించారు. మరోవైపు.. కమలకు కనీసం కుందేలుకున్న ఎనర్జీ కూడా లేదంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు.
తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టులకు నేటి నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ రూమ్, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో CC కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఉండకుండా పోలీసులు BNSS 163 సెక్షన్ విధించారు.
AP: పర్యాటకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రముఖ ఆధ్మాత్మిక దేవాలయాలకు నెలవైన ఉమ్మడి తూ.గో జిల్లా యాత్రకు శ్రీకారం చుట్టింది. కోరుకోండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను సందర్శించుకోవచ్చని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. OCT 26 నుంచి ప్రతి శనివారం రాజమండ్రిలోని సరస్వతి ఘాట్ నుంచి బస్సులు ప్రారంభమవుతాయన్నారు. రద్దీ దృష్ట్యా ఆదివారం కూడా బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.
గెలాక్సీలోని అతి పెద్ద నక్షత్ర సమూహాన్ని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ క్లిక్మనిపించింది. భూమికి 12వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న దీనిని వెస్టర్లండ్ 1గా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. దీని ద్రవ్యరాశి సూర్యుడి కంటే 50 వేల నుంచి లక్ష రెట్లు ఎక్కువ. ఈ సమూహంలోని కొన్ని నక్షత్రాలు సూర్యుడి పోలిస్తే పెద్దవిగా, 1 మిలియన్ రెట్లు ఎక్కువగా ప్రకాశిస్తాయి. ఈ క్లస్టర్ వయస్సు 3.5-5 మిలియన్ సంవత్సరాలుంటుంది.
దివంగత రతన్ టాటా 23 ఏళ్ల క్రితం బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్లో నాటిన ఓ మొక్క నేడు వృక్షంగా ఎదిగింది. 2001, అక్టోబరు 15న టాటా ఇన్ఫీ ప్రాంగణాన్ని సందర్శించారు. ఆ సమయంలో టబీబుయా రోజియా జాతికి చెందిన మొక్కను అక్కడ నాటారు. నేడు అది పది మందికి నీడనిస్తూ ఆయన జీవితాన్ని గుర్తుచేస్తోంది. ఇటీవలే ఆయన కన్నుమూసిన నేపథ్యంలో ఆ చెట్టు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Sorry, no posts matched your criteria.