India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఫజర్: తెల్లవారుజామున 5.22 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.34 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.23 గంటలకు
ఇష: రాత్రి 7.35 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

☛ తిథి: శుక్ల పాడ్యమి, తె.5.30 వరకు
☛ నక్షత్రం: పూర్వాభాద్ర, మ.1.46 వరకు
☛ శుభ సమయం: సా.4.45 నుంచి 5.33 వరకు
☛ రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
☛ యమగండం: మ.1.30 నుంచి 3.00 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.6.00-నుంచి 7.36 వరకు
☛ వర్జ్యం: రా.10.46 నుంచి 12.16 వరకు
☛ అమృత ఘడియలు: ఉ.6.38 గంటల నుంచి 8.08 వరకు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

* రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
* మళ్లీ MLAలుగా గెలవాలంటే పనితీరు మారాలి: చంద్రబాబు
* బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం: బొత్స
* రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్
* ప్రతి నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్క్: శ్రీధర్బాబు
* టన్నెల్లో గల్లంతైన వారికోసం గాలింపు కొనసాగుతోంది: కలెక్టర్
* CT: సెమీస్ చేరిన ఆస్ట్రేలియా

తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ప్రాక్టీస్లో ఎలాంటి తడబాటు లేకుండా ఏకంగా 95 మీటర్లకు పైగా సిక్సర్ బాదినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఎల్లుండి మ్యాచ్లో హిట్ మ్యాన్ ఆడరనే ప్రచారానికి తెరదించినట్లే కనిపిస్తోంది. న్యూజిలాండ్తో మ్యాచుకు రోహిత్ స్థానంలో శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

AP: తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని YCP MLC తోట త్రిమూర్తులు ఖండించారు. ఇటీవల జనసేన నేత సామినేని ఉదయభాను, త్రిమూర్తులు ఓ ఆలయంలో కలుసుకోవడంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో తాను ఇప్పుడు వైసీపీలోనే ఉన్నానని, ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలోనే కొనసాగుతానని వెల్లడించారు.

వర్షం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ రద్దవ్వడంతో అఫ్గానిస్థాన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. పాయింట్ల పరంగా దక్షిణాఫ్రికా(3P)తో సమానంగా ఉండగా రేపటి మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో SA భారీ తేడాతో ఓడితేనే అఫ్గాన్కు అవకాశాలు ఉంటాయి. సుమారు 200 పరుగుల తేడాతో ENG గెలవాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా SA నేరుగా సెమీస్ వెళ్లనుంది.

ఫిట్నెస్ సమస్యలతో మార్చి 2న కివీస్తో మ్యాచ్కు <<15595049>>రోహిత్,<<>> షమీ దూరమవుతారన్న వార్తలపై కేఎల్ రాహుల్ స్పందించారు. ‘నాకు తెలిసినంత వరకు ఆటగాళ్లంతా ఫిట్గా ఉన్నారు. ఎవరూ మ్యాచ్ మిస్సయ్యే ఛాన్స్ లేదు. అందరూ జిమ్, ప్రాక్టీస్ చేస్తున్నారు. పైగా సెమీస్కు ముందు ఒక మ్యాచే ఉన్నందున జట్టులో మార్పులు ఉండకపోవచ్చు’ అని తెలిపారు. కాగా ఇవాళ రోహిత్ గంట పాటు మైదానంలో చెమటోడ్చారు.

AP: రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటర్ ఫస్టియర్, 3వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు మొదలుకానున్నాయి. 10.58 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటుచేశారు. అన్ని సెంటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. స్టూడెంట్స్ గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

TG: రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉపయోగపడే ఆరోగ్యపాలసీని తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హెల్త్, బల్క్ డ్రగ్ విషయంలో హైదరాబాద్కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని చెప్పారు. కొవిడ్ సమయంలో చాలా దేశాలకు హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్లు ఎగుమతి అయ్యాయని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.