India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేరళ కాంగ్రెస్ IT సెల్లో విచిత్రమైన ట్రెండ్ కనిపిస్తోంది. హెడ్గా ఎవరొచ్చినా కొన్నాళ్లకు ప్రత్యర్థి పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్రపై BBC డాక్యుమెంటరీని కాంగ్రెస్ ఎండార్స్ చేసిందని AK ఆంటోనీ కొడుకు అనిల్ వెళ్లిపోయారు. BJP నుంచి లోక్సభకు పోటీచేసి ఓడిపోయారు. సివిల్ సర్వీసెస్ నుంచి పాలిటిక్స్లో జాయినైన Dr సరిన్ P తాజాగా CPMకు అనుకూలంగా మాట్లాడటంతో ఆయనపై వేటు పడింది.
AP: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు టీడీపీ కీలక పాత్ర పోషించిందని సీఎం చంద్రబాబు చెప్పారు. అధికారం కోసం కాకుండా దేశం, ప్రజల కోసం పాటుపడిందని టీడీపీ నేతలతో భేటీలో పేర్కొన్నారు. పదవులు తీసుకోకుండానే వాజ్పేయీ ప్రభుత్వంలో కొనసాగామని గుర్తు చేశారు. తాజాగా NDAతో పొత్తు సందర్భంగా కూడా ఎలాంటి డిమాండ్లూ చేయలేదన్నారు. ప్రస్తుతం టీడీపీ శక్తిమంతమైన పార్టీగా ఆవిర్భవించిందన్నారు.
కొన్ని రూల్స్ రాజ్యాంగబద్ధంగా లేవంటూ 2022లో బినామీ సవరణ చట్టంపై ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును CJI చంద్రచూడ్, PS నరసింహ, మనోజ్ మిశ్రాల ప్రత్యేక ధర్మాసనం నేడు రికాల్ చేసింది. కేంద్రం, IT వేసిన రివ్యూ పిటిషన్ను స్వీకరించింది. ఒక రూల్ను సవాల్ చేసినప్పుడే దాని రాజ్యాంగబద్ధతను నిర్ణయించగలుగుతామని తెలిపింది. చట్టమే లేనప్పుడు చేసిన నేరానికి తర్వాత తెచ్చిన చట్టంతో శిక్షించడం కుదరదని 2022 తీర్పు సారాంశం.
INDతో తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్లో కివీస్ 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో 356 పరుగుల ఆధిక్యత సాధించింది. రచిన్ రవీంద్ర 134, కాన్వే 91, టిమ్ సౌథీ 65, విల్ యంగ్ 33 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ చెరో 3 వికెట్లు, సిరాజ్ 2, అశ్విన్, బుమ్రా తలో వికెట్ తీశారు. టీమ్ ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 46 స్కోరుకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇంకా రెండు రోజుల ఆట మిగిలిఉండటంతో భారత్ చెమటోడ్చాల్సి ఉంది.
ఏడాదిలోనే అతిపెద్ద, ప్రకాశవంతమైన చంద్రుడిని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. ఇవాళ తెల్లవారుజామున, నిన్న రాత్రి సూపర్ మూన్ను చూసి ఫొటోలు తీసి నెట్టింట పోస్ట్ చేశారు. అయితే, ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద చంద్రుడిని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఎప్పటిలా కాకుండా చందమామ చాలా పెద్దగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. మీరూ చూశారా?
AP: ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ వ్యవస్థలను నాశనం చేశారని, కేంద్ర నిధులను కూడా మళ్లించారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సి ఉందని టీడీపీ ప్రజాప్రతినిధులతో సమావేశంలో తెలిపారు. పార్టీని నమ్ముకున్న కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయామని, వారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఎన్డీఏ పక్షాలను కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
TG: ఓపెన్ కాంపిటీషన్/అన్ రిజర్వుడ్ కేటగిరీలో SC, ST, BC, మైనార్టీ, EWSలకు ప్రవేశం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా జీవో29ను తీసుకొచ్చిందని డా.ఆర్.ఎస్.ప్రవీణ్ మండిపడ్డారు. దీనిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘మీకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా సీఎంను నిలదీయండి. ఒకే వర్గానికి కొమ్ము కాస్తున్నTGPSC బోర్డును రీకాల్ చేయించండి’ అని ట్వీట్ చేశారు.
INDతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దిశగా కివీస్ సాగుతోంది. ఇప్పటికే 300+ లీడ్ సాధించింది. ఆ జట్టుకు భారత్పై తొలి ఇన్నింగ్సులో ఇదే అత్యధిక లీడ్ కావడం విశేషం. కివీస్ తొలి ఇన్నింగ్స్లో 2016లో 412(vsZIM), 2005లో 393(vsZIM), 1985లో 374(vsAUS), 2004లో 363(vsBAN) లీడ్ సాధించింది. అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇండియాపై ఈ స్థాయి ఆధిక్యత కనబర్చింది. రచిన్(107*), సౌథీ(59*) క్రీజులో ఉన్నారు.
స్టాక్ మార్కెట్లో రాబడి పూలపాన్పు కాదు. లాసెస్, ప్రెజర్ తట్టుకోవాలి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు సైకలాజికల్ ఎడ్జ్, కన్విక్షన్, సహనం లేకుంటే నష్టపోవడం ఖాయం. చిన్న ఇన్వెస్టర్లు పెద్ద చేపల ట్రాప్లో పడటానికి ఇదే రీజన్. SEP క్వార్టర్లో 56PSU షేర్లలో రిటైల్ ఇన్వెస్టర్లు వాటా పెంచుకోవడం ట్రాప్ అని కొందరు, వాటిని డిప్స్లో కొనడం మంచిదేనని మరికొందరు అంటున్నారు. ఏది నిజమవుతుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
సద్గురు/జగ్గీ వాసుదేవ్కు ఊరట లభించింది. బ్రెయిన్వాష్ చేసి తమ కుమార్తెలను ఈశా యోగా సెంటర్లోనే ఉంచుతున్నారని ఓ తండ్రి వేసిన <<14260998>>HCPని<<>> సుప్రీంకోర్టు కొట్టేసింది. తామిద్దరం మేజర్లమని, ఇష్టంతోనే అక్కడ ఉంటున్నామని, ఆశ్రమం నుంచి బయటకెళ్లే స్వేచ్ఛ తమకుందన్న కుమార్తెల వాంగ్మూలాలను కోర్టు నోట్ చేసుకుంది. ఈశా సెంటర్ పాటించాల్సిన ఇతర రూల్స్పై ఈ కేసు క్లోజింగ్ ప్రొసీజర్స్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.
Sorry, no posts matched your criteria.