news

News March 1, 2025

మ్యాచులు రద్దు.. టికెట్ డబ్బులు రీఫండ్: PCB

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈనెల 25, 27న రావల్పిండిలో జరగాల్సిన మ్యాచులు టాస్ పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచుల కోసం టికెట్లు కొన్న ప్రేక్షకులకు పూర్తి డబ్బులను రీఫండ్ చేయనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. డ్యామేజ్ అవని ఒరిజినల్ టికెట్లతో వచ్చి టికెట్ సెంటర్ల వద్ద డబ్బులు తీసుకోవాలని సూచించింది. బాక్సెస్, గ్యాలరీ టికెట్లు తీసుకున్న వారికి రీఫండ్ వర్తించదని పేర్కొంది.

News March 1, 2025

వారికి రేపటి నుంచి ఒంటి పూట బడులు

image

TG: నెలవంక కనిపించడంతో రేపటి నుంచి <<15622646>>రంజాన్ మాసం<<>> ప్రారంభం కానుంది. దీంతో ఉర్దూ మీడియం విద్యార్థులకు రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉ.8 నుంచి మ.1.30 వరకు క్లాసులు కొనసాగుతాయని తెలిపారు. కాగా మిగతా విద్యార్థులకు మార్చి 10 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించే యోచనలో సర్కారు ఉంది. APలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు ఆరంభం కానున్నాయి.

News March 1, 2025

కనిపించిన నెలవంక.. రేపటి నుంచి పవిత్రమాసం

image

భారత్‌లో నెలవంక దర్శనమిచ్చింది. దీంతో రేపటి నుంచి రంజాన్ పవిత్రమాసం ప్రారంభం కానుంది. ఈ సమయంలో నెల రోజుల పాటు ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ మాసంలో తమ సంపదలో కొంత భాగాన్ని పేదలకు దానం చేస్తారు. సౌదీ అరేబియాలో నిన్ననే చంద్రవంక దర్శనమివ్వగా నేటి నుంచి రంజాన్ మొదలైన సంగతి తెలిసిందే. కాగా రంజాన్ మాసంలో తెలంగాణలోని ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వ కార్యాలయ వేళల్లో వెసులుబాటు కల్పించింది.

News March 1, 2025

తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని లేఖ

image

AP: ఇటీవల తిరుమల కొండపై పలుమార్లు విమానాలు చక్కర్లు కొట్టిన ఘటనల నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరారు. ఆలయ పవిత్రత, ఆగమ శాస్త్ర నిబంధనల దృష్ట్యా నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

News March 1, 2025

CT: సెమీస్ చేరిన జట్లివే

image

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్-A నుంచి ఇండియా, న్యూజిలాండ్ జట్లు, గ్రూప్-B నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరాయి. రేపు ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితంతో సెమీస్‌లో ఏ జట్లు పోటీ పడతాయనేది తేలనుంది.

News March 1, 2025

ఇది దేశంలోనే తొలిసారి: మంత్రి సత్యకుమార్

image

AP: దేశంలోనే తొలిసారిగా ఆశా వర్కర్లకు గ్రాట్యుటీని కూటమి ప్రభుత్వం అమలు చేయనుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 30yrs సేవల్లో ఉన్న వారికి గ్రాట్యూటీ కింద ₹1.50 లక్షల వరకూ లబ్ధి చేకూరుతుందన్నారు. గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచడంతో 42,752 మంది వర్కర్లకు మేలు జరుగుతుందని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా ₹10వేల వేతనం ఇస్తున్నామని, రెండు కాన్పులకు 180 రోజుల ప్రసూతి సెలవులు ఇస్తామని పేర్కొన్నారు.

News March 1, 2025

ఇసుక సరఫరాపై సీఎం ఆదేశాలు

image

TG: ఇసుక, ఖనిజాల అక్రమ తవ్వకాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఖనిజాభివృద్ధి శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టే పనులకు TGMDC నుంచే ఇసుక సరఫరా చేయాలన్నారు. పెద్దమొత్తంలో చేపట్టే నిర్మాణ రంగాలకు వీటి నుంచి సరఫరా చేయాలని సూచించారు. ప్రభుత్వమే సరైన ధరలకు సరఫరా చేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు.

News March 1, 2025

వీల్లేంట్రా బాబు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు!

image

హోటల్‌కు వచ్చిన వారిలో కొందరు రూమ్స్‌లోని వస్తువులను దొంగిలిస్తుండటంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు సదరు యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. ముంబైలోని ఓ హోటల్ రూమ్స్‌లో ఉన్న బాత్రూమ్ స్లిప్పర్స్ కూడా దొంగతనానికి గురయ్యాయి. దీంతో ఒకే సైజులోని వేర్వేరు చెప్పులను జోడీగా ఉంచారు. ఓ వ్యక్తి దీనిని ఫొటో తీసి Xలో షేర్ చేయడంతో వైరలవుతోంది. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News March 1, 2025

దేశానికి రోల్ మోడల్‌లా పోలీస్ స్కూల్: సీఎం

image

TG: యంగ్ ఇండియా పోలీస్ స్కూలులో పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. HYD మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలోని ఈ స్కూలులో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్‌ను దేశానికి రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. స్కూల్ <>వెబ్‌సైట్‌ను<<>> లాంచ్ చేశారు.

News March 1, 2025

‘అందుకొనేంత దూరంలో అభివృద్ధి చెందిన దేశం’

image

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం అందుకొనేంత దూరంలోనే ఉందని 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ అరవింద్ పనగడియా అన్నారు. ఇందుకు కొన్ని సంస్కరణలు అవసరమని సూచించారు. ‘ప్రస్తుత ధరల వద్ద డాలర్‌ ప్రాతిపదికన 2003-24 వరకు భారత్ 10.1% వృద్ధిరేటు సాధించింది. మరో పదేళ్లు ఇదే రేటు కొనసాగిస్తే దేశం $9.5T ఎకానమీ అవుతుంది. 2047 నాటికి తలసరి ఆదాయం $14000 కావాలంటే 7.3% గ్రోత్ అవసరం’ అని వివరించారు.