news

News March 1, 2025

80% పెన్షన్ల పంపిణీ పూర్తి: TDP

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమం మూడు గంటల్లోనే 80 శాతం పూర్తైనట్లు టీడీపీ ట్వీట్ చేసింది. గత నెల వరకు తెల్లవారుజామున 5 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేయగా.. ఉద్యోగులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పంపిణీ ప్రారంభ సమయాన్ని ప్రభుత్వం 7 గంటలకు మార్చిన విషయం తెలిసిందే.

News March 1, 2025

4 ఎమ్మెల్సీ స్థానాలు.. కాంగ్రెస్‌లో గట్టి పోటీ

image

TG: తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 4 దక్కే ఛాన్స్ ఉంది. ఇందుకోసం 40 మంది వరకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వేం నరేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, జగ్గా రెడ్డి, మధుయాష్కీ, సామ రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్, రాములు నాయక్, అంజన్ కుమార్ యాదవ్, సరితా యాదవ్ తదితరులు పోటీలో ఉన్నట్లు సమాచారం. యువ నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని క్యాడర్ కోరుతోంది.

News March 1, 2025

మూడు రోజుల్లో రూ.1200 తగ్గిన బంగారం ధర

image

భారీగా పెరిగిన బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత మూడు రోజుల్లోనే తులం బంగారం ధర రూ.1200 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 తగ్గి రూ.79,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గడంతో రూ.86,620కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,05,000గా ఉంది.

News March 1, 2025

మహిళలను ప్రభుత్వం మోసం చేసింది: వైసీపీ

image

AP: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మెుండి చెయ్యి చూపిందని వైసీపీ ఆరోపించింది. ఉగాది నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని ఆశ చూపించి బడ్జెట్‌లో దాని ఊసే ఎత్తలేదంది. ఆర్టీసీకి కేటాయించిన నిధులు ఉద్యోగుల జీతాలకే సరిపోతాయని పేర్కొంది. పథకం అమలు కావాలంటే అదనంగా రూ.3,182 కోట్లు కావాల్సిఉండగా ఒక్కపైసా కేటాయించలేదని తెలిపింది. అధికారంలోకి రాగానే పథకం అమలు చేస్తామని మహిళలను మోసం చేసిందని వైసీపీ ఆరోపించింది.

News March 1, 2025

అక్కా.. అని పిలిచి అత్యాచారం

image

పుణే రేప్ కేసు <<15605696>>నిందితుడు<<>> దత్తాత్రేయ గడేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే ఘటన జరిగిన రోజు తె.జామున యువతి స్వార్గేట్ బస్టాండ్‌లో నిల్చొని ఉండగా గడే ఇన్‌షర్ట్ వేసుకొని వచ్చాడు. ‘దీదీ(అక్కా) మీ బస్సు పక్కన నిలిపి ఉంది’ అని తీసుకెళ్లాడు. బస్సులో లైట్లు ఆన్ చేయలేదేంటని ఆమె ప్రశ్నించగా ప్రయాణికులు నిద్రపోతున్నట్లు చెప్పాడు. ఆమె అందులోకి ఎక్కగానే డోర్ లాక్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

News March 1, 2025

ఆఫీసులో ఎన్ని గంటలు ఉన్నారన్నది ముఖ్యమే కాదు: ఆకాశ్ అంబానీ

image

ఆఫీసులో రోజూ ఎన్ని గంటలు గడిపామన్నది కాదు ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నదే ముఖ్యమని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ అన్నారు. ముంబై టెక్ వీక్‌ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ‘ఎన్ని గంటలు, ఎంత టైమ్ ఉన్నారని నేను ఆలోచించను. రోజూ ఎంత క్వాలిటీ వర్క్ చేశారన్నదే ముఖ్యం. Growth is Life అన్నదే రిలయన్స్ మోటో. ఇది వ్యక్తిగత జీవితానికీ వర్తిస్తుంది. అంటే మనం ప్రతిరోజూ ఎదుగుతూనే ఉండాలి’ అని పేర్కొన్నారు.

News March 1, 2025

ట్రంప్‌కు క్షమాపణ చెప్పను: జెలెన్‌స్కీ

image

ఓవెల్ ఆఫీస్ ఘటనపై ట్రంప్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. తాను తప్పు చేశానని అనుకోవటం లేదని, అయితే అమెరికా అధ్యక్షుడిని, ప్రజలను గౌరవిస్తానని ఇంటర్వ్యూలో తెలిపారు. ట్రంప్ తటస్థంగా ఉండాలని కోరారు. ఉక్రెయిన్‌లోని ఖనిజాల తవ్వకం ఒప్పందంపై భేటీలో USనుంచి రక్షణ కావాలని జెలెన్‌స్కీ ఒత్తిడి చేయగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.

News March 1, 2025

రాజీనామా తర్వాత GV రెడ్డి తొలి ట్వీట్

image

AP: టీడీపీకి <<15567607>>రాజీనామా తర్వాత<<>> బడ్జెట్‌ను అభినందిస్తూ జీవీ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం రూ.33,000cr రెవెన్యూ లోటుతోనే రూ.3.2లక్షల కోట్ల బడ్జెట్ రూపొందించారన్నారు. ‘రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయకత్వం పట్ల ఎప్పటికీ గౌరవం ఉంటుంది. తక్కువ కాలంలోనే పార్టీలో నాకు దక్కిన గౌరవం పట్ల ఆయనకు రుణపడి ఉంటాను. 2029లోనూ మా సార్ CM కావాలి’ అని ట్వీట్ చేశారు.

News March 1, 2025

రాజా సాబ్.. 3 గంటలు!

image

ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాజా సాబ్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలో రెండు పాటల కోసం స్పెయిన్ వెళ్లనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అవి పూర్తయితే షూటింగ్ పూర్తయినట్లే. ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. మాళవిక మోహనన్ హీరోయిన్. సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉంటుందని సమాచారం. ఏప్రిల్ 10న ఈ మూవీని రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించినా వాయిదా పడే అవకాశం ఉంది.

News March 1, 2025

‘రాణి రుద్రమదేవి ఎయిర్ పోర్ట్’ అని పేరు పెట్టాలని డిమాండ్లు

image

TG: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఓరుగల్లు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ‘రాణి రుద్రమదేవి ఎయిర్ పోర్టు’ అని పేరు పెట్టాలని కోరుతున్నారు. వరంగల్ గడ్డ అంటేనే కాకతీయులు అని, వారి పేరు పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఆ పేరుతో క్రియేట్ చేసిన ఏఐ ఫొటో ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ లోగా విమానాలు నడిపించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.