India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లద్దాక్ సరిహద్దుల్లో పహారా, సరకు రవాణా కోసం భారత సైన్యం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. బ్యాక్ట్రియన్ ఒంటెలకు DIHAR శిక్షణ ఇస్తోంది. పురాతన కాలంలో దేశాల మధ్య వర్తక వ్యాపారానికి వీటిని ఉపయోగించేవారని, అయితే వాటిని మచ్చిక చేసుకొనే నైపుణ్యాన్ని భారత్ కోల్పోయినట్టు కల్నల్ రవికాంత్ శర్మ తెలిపారు. ఇవి అరుదైన వాతావరణంలో సైతం బరువులు మోస్తూ 2 వారాలపాటు ఆహారం లేకుండా జీవించగలవు.
నందమూరి బాలకృష్ణ హీరోగా ‘NBK109’ అనే మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ‘సర్కార్ సీతారామ్’, డాకూ మహారాజా’ అనే టైటిల్స్లో ఏదో ఒకటి పెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్. బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు సమాచారం.
ప్రపంచంలోనే (జీ20 దేశాలు) భారతీయ ఆహారం అత్యుత్తమం అని స్విట్జర్లాండ్కు చెందిన WWF లివింగ్ ప్లానెట్ రిపోర్టు-2024 వెల్లడించింది. ఇండియన్లు ఎక్కువగా మొక్కల నుంచి వచ్చే ఆహారం తీసుకుంటారని, అప్పుడప్పుడు మాంసాహారం తీసుకోవడం వల్ల సుస్థిర ఆహార వినియోగాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపింది. US, ఆస్ట్రేలియా, అర్జెంటీనా ఫుడ్ అత్యంత చెత్త ర్యాంకింగ్ నమోదు చేసిందని పేర్కొంది.
ఉత్తరాఖండ్లోని రోషనాబాద్ జైలులో నాటకమాడుతూ ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. దసరా సందర్భంగా జైలులో రామాయణం నాటకం వేశారు. ఇందులో భాగంగా వానర పాత్రధారులు పంకజ్, రాజ్ కుమార్.. సీతను వెతికే క్రమంలో 22 అడుగుల జైలు గోడపై నుంచి పోలీసులు, తోటి ఖైదీలు చూస్తుండగానే దూకి పరారయ్యారు. పంకజ్ ఓ హత్య కేసులో జీవిత ఖైదు, రాజ్ కుమార్ కిడ్నాప్ కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
మహారాష్ట్రలో మాజీ మంత్రి, NCP నేత బాబా సిద్దిఖీ దారుణ <<14343654>>హత్యకు<<>> గురికావడం సంచలనం రేపింది. దీనికి సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడణవీస్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని NCP(SP), శివసేన(UBT) డిమాండ్ చేశాయి. Y కేటగిరీ భద్రత కలిగిన రాజకీయ నేతనే కాపాడలేని ఈ ప్రభుత్వం ఇక సామాన్య ప్రజలను ఏం కాపాడుతుందని ప్రశ్నించాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తాయి.
వయసు పెరిగే పిల్లలకు తల్లిదండ్రులు కొన్ని స్కిల్స్ నేర్పించాలి. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, సాయం చేయడం వంటివి నేర్పాలి. చెట్లు నాటడం, సంరక్షణ, తోటి పిల్లలతో ఎలా మెలగాలో చెప్పాలి. డబ్బు విలువ తెలియజేయాలి, వస్తువులపై ధరలు, క్వాలిటీ వంటివి చూపించాలి. మార్కెట్లో బేరాలు ఆడటం నేర్పించాలి. ఎమోషనల్ బ్యాలెన్స్పై అవగాహన కల్పించాలి. పెద్దలను గౌరవించేలా తీర్చిదిద్దాలి.
‘దసరా’ మూవీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో హీరో నాని ఓ సినిమా చేయబోతున్నారు. దసరా సందర్భంగా ముహూర్త షాట్కు హీరో నాని క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
వికెట్ కీపర్ సంజూ శాంసన్ సెల్ఫ్ లెస్ క్రీడాకారుడు అని టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. సెంచరీ ముందు కూడా బౌండరీ బాదడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ‘నాకు నిస్వార్ధపరులైన ఆటగాళ్లతో కూడిన జట్టు అంటే ఇష్టం. ఎవరైనా 49 లేదా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు సింగిల్ కోసం ప్రయత్నించి జట్టు ప్రయోజనాలు దెబ్బ తీయొద్దు. పరుగులు సాధించే క్రమంలో రికార్డులు వాటంతటవే రావాలి’ అని ఆయన పేర్కొన్నారు.
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఓ ఛాంపియన్ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొనియాడారు. ‘నాతోపాటు ఇజ్రాయెల్ ప్రజలందరూ టాటా మృతికి సంతాపం తెలుపుతున్నాం. ఆయన భారత్ గర్వించదగ్గ ముద్దుబిడ్డ. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేయండి’ అని ప్రధాని మోదీని ఎక్స్లో ట్యాగ్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా సంతాపం తెలిపారు.
ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ సైబర్ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖల సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. తమ విలువైన డాటా చోరీకి గురైనట్లు ఇరాన్ కూడా వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరపొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Sorry, no posts matched your criteria.