India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమెరికాలో ఓ జంట ప్రభుత్వానికి రూ.4.2 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది. ఆర్మీ కాంట్రాక్టర్గా పనిచేస్తున్న థామస్ బౌచర్డ్(61) తన పలుకుబడిని ఉపయోగించి ప్రియురాలిని(53) ప్రభుత్వం జీతం ఇచ్చే సహాయకురాలిగా నియమించుకున్నారు. ప్రభుత్వ పని మీద అని చెప్పి ఇద్దరూ డిస్నీ వరల్డ్, ఇతర విలాసాలకు 31సార్లు తిరిగారు. ఎట్టకేలకు వారి బండారం బట్టబయలైంది. దీంతో అధికారులు వారు తిన్న డబ్బును వసూలు చేసే పనిలో పడ్డారు.
‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ‘పుష్ప2’ ఐటమ్ సాంగ్లో సందడి చేయబోతున్నారని కొద్దికాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఆమెను సుకుమార్ రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఆమె కొత్త మూవీ ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’లోని ‘మేరే మెహబూబ్’లో స్టెప్పులు వేయగా దానిపై విపరీతమైన ట్రోలింగ్ రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో పునరాలోచనలో పడ్డ సుక్కు ఆమెను ఆడిషన్స్లోనే తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఉదయం లేవగానే బొప్పాయి పండు తినడం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరంలోని హానికర టాక్సిన్లు బయటికి వెళ్తాయి. జీర్ణక్రియ బాగా పనిచేసి, మలబద్ధకం అనే సమస్య ఉండదు. శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే కెఫిన్ యాసిడ్, మైరిసెటిన్, విటమిన్ సి, ఎ, ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే గర్భిణులు దీన్ని పరగడుపున తీసుకోకపోవడం మంచిది.
అత్యాచారం కేసులో పెరోల్పై విడుదలైన డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ హరియాణా ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాల్సిందిగా తన మద్దతుదారులను కోరడం వివాదం రేపింది. సిర్సాలోని సత్సంగ్లో శనివారం జరిగిన సమావేశంలో బహిరంగంగా కాకుండా సమూహంలో కలిసిపోయిన తన అనుయాయుల ద్వారా బీజేపీకి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. ప్రతిఒక్కరూ ఐదుగురిని పోలింగ్ బూత్కు తరలించాలని కూడా కోరినట్టు తెలిసింది.
అత్యాచారం కేసులో అరెస్టై, బెయిల్పై బయటికొచ్చిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేశారు. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అవార్డుకు ఎంపికైన కొద్దిరోజులకే ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో అరెస్టయ్యారు. అవార్డు అందుకునేందుకు జానీకి కోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ నెలలో సీఎస్కే ప్రతినిధులతో మహేంద్ర సింగ్ ధోనీ ముంబైలో సమావేశం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే సీజన్లో తాను ఆడేదీ లేనిదీ వారితో తేల్చి చెప్తారని తెలుస్తోంది. కాగా సీఎస్కే మాత్రం ధోనీ అన్క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కనీస ధర రూ.4 కోట్లు చెల్లించి ఆయనను దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
బంగ్లాతో T20 సిరీస్ ముంగిట భారత పేస్ ఆల్రౌండర్ హార్దిక్ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇప్పటి వరకు T20ల్లో 86 వికెట్లు తీసిన పాండ్య మరో 5 తీస్తే ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్గా నిలుస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు భువనేశ్వర్(90) పేరిట ఉంది. మొత్తంగా చూసుకుంటే స్పిన్నర్ చాహల్ 96 వికెట్లతో టాప్లో ఉన్నారు. బుమ్రా 86 వికెట్లు తీసినప్పటికీ అతడు బంగ్లాతో సిరీస్ ఆడటం లేదు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఇవాళ వేంకటేశ్వరుడు హంసవాహనంపై తిరుమల మాడ వీధుల్లో విహరించారు. సరస్వతీమూర్తి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కనులపండువగా సాగిన మహోత్సవ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.
టీమ్ ఇండియా ఆల్రౌండర్ శివమ్ దూబే వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన రేపటి నుంచి బంగ్లాదేశ్తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. దూబే స్థానంలో హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. త్వరలోనే తిలక్ జట్టుతో కలుస్తారని తెలుస్తోంది. కాగా రేపు రాత్రి 7.30 గంటలకు గ్వాలియర్లో భారత్, బంగ్లా మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది.
AP: ఉచిత ఇసుకపై సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలంటూ గనులశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ప్రజలను తప్పుదారి పట్టించే దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కావాలనే కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని సీఎం దుయ్యబట్టారు.
Sorry, no posts matched your criteria.