India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

CAG నివేదికలు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. ఢిల్లీ Govt ఆస్పత్రుల్లో 50-60% డాక్టర్ల కొరత ఉందని హెల్త్కేర్ నివేదిక పేర్కొంది. సర్జరీల కోసం రోగులు 6-8 నెలలు ఎదురుచూడాల్సి వచ్చినట్టు తెలిపింది. 14 ఆస్పత్రుల్లో ICU, 16లో బ్లడ్బ్యాంక్స్, ఆక్సిజన్ సరఫరా, అంబులెన్స్, మార్చురీలు లేవంది. కేంద్రమిచ్చిన కొవిడ్ నిధుల్ని ఖర్చు చేయలేదని, మొహల్లా క్లినిక్కుల్లో బాత్రూములు లేవంది.

TG: వరంగల్లో మామూనూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎయిర్ పోర్టు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే 696 ఎకరాల భూసేకరణ పూర్తవ్వగా మరో 253 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కేంద్రం తాజా ఉత్తర్వులతో నిర్మాణ పనులు ముమ్మరం కానున్నాయి.

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ హెల్మెట్ లేకుండా క్రికెట్ ఆడేవారు. ఇందుకు గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ‘క్రికెట్ మొదలెట్టిన 7-8 ఏళ్లు హెల్మెట్లే అందుబాటులోకి రాలేదు. జేబుల్లో ఫేస్ టవల్స్ పెట్టుకొని థై ప్యాడ్స్లాగా యూజ్ చేసేవాళ్లం. ఒకప్పుడు ఈ పరికరాలేవీ ఉండేవి కావు. అలాంటప్పుడు కొత్తగా వీటి గురించి ఎందుకు ఆలోచిస్తాం. అందుకే హెల్మెట్ గురించి పట్టించుకోలేదు’ అని తెలిపారు.

TG: వ్యవసాయంతోపాటు అన్ని రంగాల్లో సైన్స్ ముఖ్య పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ చెప్పారు. తాను కూడా కొన్నాళ్లు సైన్స్ ప్రొఫెసర్గా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. గచ్చిబౌలిలో జరిగిన విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శనలో ఆయన ప్రసంగించారు. దేశ ప్రగతి, ఆవిష్కరణల్లో విద్యార్థులదే కీలక పాత్ర అని తెలిపారు. దేశంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోందని, రక్షణ రంగంలోనూ అనేక మార్పులొస్తున్నాయని పేర్కొన్నారు.

TG: రాష్ట్రంలో ప్రజాపాలన పరాకాష్ఠకు చేరిందని మాజీ మంత్రి KTR విమర్శలు చేశారు. SLBC ప్రమాదంతో ఓ వైపు విషాదం నెలకొంటే మంత్రులు హెలికాప్టర్ యాత్రలు, చేపకూర విందులతో వినోదం పొందుతున్నారని దుయ్యబట్టారు. అచ్చంపేట నియోజకవర్గం కొండనాగులలోని ఎస్టీ బాలురు హాస్టల్ విద్యార్థులను శివరాత్రి రోజున గుడిలో అన్నదానానికి వెళ్లి తినమనడం దారుణమన్నారు. పండగపూట విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలనా అని ప్రశ్నించారు.

TG: దేశ రక్షణలో తెలంగాణ పాత్ర కీలకంగా ఉందని సీఎం రేవంత్ చెప్పారు. BDL, HAL, మిధాని వంటి కీలక సంస్థలు ఇక్కడే ఉన్నాయన్నారు. గచ్చిబౌలిలో జరిగిన ‘విజ్ఞాన్ వైభవ్’ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్నాథ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సైన్స్ ప్రదర్శనతో విద్యార్థులకు దేశం పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు. దేశ రక్షణ బాధ్యత యువతపై ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

AP: రాష్ట్ర బడ్జెట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. దీనిపై వారికి అవగాహన పెంచాలని సూచించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో సీఎం మాట్లాడారు. ‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే పనితీరు బాగుండాలి. మళ్లీ సభకు రావాలనే భావనతో పని చేయాలి. విభేదాలు, గ్రూపులను సహించను. ఎంపీలతో కలిసి సమన్వయం చేసుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆది పినిశెట్టి, లక్ష్మీ మేనన్ ప్రధాన పాత్రల్లో అరివళగన్(వైశాలి ఫేమ్) దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘శబ్దం’. ఓ కాలేజీలో వరుస ఆత్మహత్యల కేసును హీరో ఛేదించే క్రమంలో ఎదురయ్యే పరిణామాలేంటనేదే ఈ సినిమా స్టోరీ. సిమ్రాన్, లైలా పాత్రలు ఆశ్చర్యపరుస్తాయి. ఆది నటన, తమన్ BGM, ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్లస్. సెకండాఫ్ గజిబిజిగా ఉండటం, వీక్ క్లైమాక్స్, VFX మైనస్.
RATING: 2.5/5

వాక్యుమ్ క్లీనర్ను సాయంత్రం పూటే వాడండి. కిటికీలను కాటన్ కర్టన్లతో కప్పివేయండి. ఇంటిపై కప్పుపై నీటిని చల్లండి. గదిని శుభ్రంగా ఉంచుకోండి. లైట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తక్కువగా వాడండి. లైట్కలర్ పేయింట్స్ వల్ల వేడి కొంచెం తగ్గుతుంది. వీటితో పాటు అందరూ కాటన్దుస్తులు ధరించాలని, నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంటి లోపల, బయట వీలైనంత వరకు మొక్కలను పెంచాలి.

APFDC మాజీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. ఆయన తరఫు న్యాయవాది రైల్వేకోడూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా జడ్జి విచారణకు స్వీకరించలేదు. రేపటి నుంచి ట్రైనింగ్కు వెళ్తున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శని, ఆదివారం సెలవు కావడంతో సోమవారమే విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను రాజంపేట సబ్జైలుకు తరలించారు.
Sorry, no posts matched your criteria.