India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. తొలి రోజు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత విభావరి నిర్వహిస్తారు. 2వ రోజున మీడియా ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమంలో ‘పుష్ప’ స్టార్ డైరెక్టర్ సుకుమార్, ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ముఖ్ పాల్గొంటారు. మరికొంతమంది కళాకారులు సమ్మిట్లో సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించనున్నారు.

<

రూపాయి నేలచూపులు చూస్తోంది. వరుసగా ఐదో సెషన్లోనూ క్షీణించి ఇవాళ రికార్డు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. డాలర్తో పోలిస్తే 89.874 వద్ద ప్రస్తుతం ట్రేడవుతోంది. అంతకుముందు All time low 89.895ను తాకి 90కి చేరువైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 4 శాతం వరకు రూపాయి పడిపోయింది. అమెరికా డాలర్ బలపడటం, ఇండియా-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఆలస్యమవడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

<

రూపాయి నేలచూపులు చూస్తోంది. వరుసగా ఐదో సెషన్లోనూ క్షీణించి ఇవాళ రికార్డు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. డాలర్తో పోలిస్తే 89.874 వద్ద ప్రస్తుతం ట్రేడవుతోంది. అంతకుముందు All time low 89.895ను తాకి 90కి చేరువైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 4 శాతం వరకు రూపాయి పడిపోయింది. అమెరికా డాలర్ బలపడటం, ఇండియా-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఆలస్యమవడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

రాజస్థాన్లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఇచ్చిన రిటర్న్ గిఫ్టులు SMలో వైరల్ అయ్యాయి. అక్కడి కుచామన్ నగరంలో మనోజ్ బర్వాల్ అనే వ్యక్తి తన కూతురు సోనును యశ్ బెద్వాల్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహానికి హాజరైన వారికి రిటర్న్ గిఫ్టులుగా హెల్మెట్లు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ 286 హెల్మెట్లను అందజేయడం పట్ల SMలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

రాజస్థాన్లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఇచ్చిన రిటర్న్ గిఫ్టులు SMలో వైరల్ అయ్యాయి. అక్కడి కుచామన్ నగరంలో మనోజ్ బర్వాల్ అనే వ్యక్తి తన కూతురు సోనును యశ్ బెద్వాల్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహానికి హాజరైన వారికి రిటర్న్ గిఫ్టులుగా హెల్మెట్లు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ 286 హెల్మెట్లను అందజేయడం పట్ల SMలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

గవర్నర్ అధికారిక నివాస, కార్యాలయ భవనం రాజ్ భవన్ పేరు మారింది. ‘లోక్ భవన్’గా మారుస్తూ గత నెల 25న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇకపై దేశంలోని రాజ్ భవన్లను లోక్ భవన్గా పేర్కొనాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పేరు మార్చగా తెలుగు రాష్ట్రాల్లోనూ మార్చనున్నారు. కాగా దీనిపై రెండేళ్ల క్రితమే గవర్నర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

గవర్నర్ అధికారిక నివాస, కార్యాలయ భవనం రాజ్ భవన్ పేరు మారింది. ‘లోక్ భవన్’గా మారుస్తూ గత నెల 25న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇకపై దేశంలోని రాజ్ భవన్లను లోక్ భవన్గా పేర్కొనాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పేరు మార్చగా తెలుగు రాష్ట్రాల్లోనూ మార్చనున్నారు. కాగా దీనిపై రెండేళ్ల క్రితమే గవర్నర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

సబ పర రామ తపస్వీ రాజా। తినకే కాజ సకల తుమ సాజా॥
రాముడు రాజైనా రుషిలా నిగ్రహం, ధర్మపాలన కలవాడు. అలాంటి ధర్మమూర్తి సీతాన్వేషణ, లంకా విజయం వంటి ముఖ్య కార్యాలన్నీ ఆంజనేయుడే చక్కబెట్టాడు. హనుమంతుడు రామునికి కేవలం సేవకుడు కాదు, గొప్ప కార్యసాధకుడు. ఈ కథ మనకు కర్తవ్య నిష్ఠను బోధిస్తుంది. మన లక్ష్యం గొప్పదైనా, నిస్వార్థ సేవ, సంకల్పబలంతో తప్పక విజయం సాధించవచ్చు. <<-se>>#HANUMANCHALISA<<>>
Sorry, no posts matched your criteria.