India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ <<18465862>>పర్యటన<<>> వేళ ఆయన ప్రయాణించే “ఆరస్ సెనాట్” కారుపై చర్చ జరుగుతోంది. ఇది ప్రపంచంలో అత్యంత సురక్షిత వాహనాల్లో ఒకటి. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ కారు బాంబులు, క్షిపణి దాడులను సైతం తట్టుకుంటుంది. నీటిలో మునిగిపోయినా ఇది తేలి సురక్షిత ప్రాంతానికి చేర్చుతుంది. ప్రత్యేకంగా కస్టమైస్డ్ అయిన ఈ కారు ధర సుమారు రూ.5కోట్లు ఉంటుంది. ఇది సాధారణ పౌరులకు అందుబాటులో లేదు.

అవసరమైన వస్తువులను మాత్రమే కలిగి ఉండే జీవనశైలిని అలవరుచుకోవాలని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా యువతకు సూచించారు. ‘మెరుగైన లైఫ్స్టైల్ కోసం ప్రయత్నిస్తూ చాలా మంది తమ మనశ్శాంతిని కోల్పోతున్నారు. విలాసంగా జీవించడం అంటే ఎక్కువ వస్తువులను కొనడం కాదు. తక్కువ వస్తువులు ఉంటే వాటి నిర్వహణ, శ్రమ కూడా తగ్గుతుంది’ అని అభిప్రాయపడ్డారు. అందుకే వస్తువులను కొనేముందు అవి నిజంగా అవసరమా అని ఆలోచించండి. SHARE IT

జాబ్ ఆఫర్ ఇచ్చి ఆపై రద్దు చేసిన 20కి పైగా సంస్థలను ప్లేస్మెంట్ల డ్రైవ్ నుంచి IITలు నిషేధించాయి. ఆ కంపెనీల చర్య విద్యార్థుల కెరీర్ ప్లానింగ్కు ఆటంకం కలిగించడంతో పాటు ఒత్తిడికి గురిచేయడమే దీనికి కారణం. ఇందులో డేటా అనలటిక్స్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఆఫర్ లెటర్లో ఇచ్చిన ప్యాకేజీని జాయినింగ్కు ముందు తగ్గించాయి. కంపెనీల ప్లేస్మెంట్ల హిస్టరీని పరిశీలిస్తున్నట్లు IIT ప్రొఫెసర్ ఒకరు తెలిపారు.

<<18318593>>హిడ్మా<<>> ఎన్కౌంటర్పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట లేఖ విడుదల చేశారు. హిడ్మా, శంకర్ను ఎన్కౌంటర్ చేయలేదని, ఇది పూర్తిగా భూటకపు హత్యలని విమర్శించారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మా, శంకర్ చికిత్స కోసం విజయవాడకు వెళ్తుండగా అరెస్ట్ చేశారన్నారు. వారం రోజుల పాటు వారిని చిత్రహింసలు పెట్టి చంపారని ఆరోపించారు. హత్యలపై న్యాయవిచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

బత్తాయి తోటలను కాయ తయారయ్యే దశలో తొడిమ కుళ్లు తెగులు ఆశిస్తుంది. కాయ పక్వానికి రాకముందే తొడిమ నుంచి ఊడి రాలిపోవటం ఈ తెగులు ప్రధాన లక్షణం. ఈ కాయలను పరిశీలిస్తే వాటికి తొడిమ ఉండదు. ఈ తెగులు ప్రభావం ఎక్కువగా కొమ్మ చివరి భాగాల్లో, అభివృద్ధి చెందుతున్న కాయ తొడిమలపై ఉంటుంది. బలహీనంగా వున్న చెట్లలో ఈ తెగులు ప్రభావం ఎక్కువ. వర్షాలు, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు వేగంగా వ్యాపిస్తుంది.

ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ <<17958042>>మహిళా వింగ్<<>>లో 5 వేల మంది మహిళలు చేరినట్లు తెలుస్తోంది. వారిని తీవ్రవాదంవైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ‘కొన్ని వారాల్లోనే 5 వేల మంది మహిళలు చేరారు. త్వరలో జిల్లా యూనిట్లు ఏర్పాటు చేస్తాం’ అని జైషే చీఫ్ మసూద్ అజర్ SMలో పోస్ట్ చేశారు. పాక్లోని బహావల్పుర్, ముల్తాన్, కరాచీ, ముజఫరాబాద్ తదితర ఏరియాల మహిళలను రిక్రూట్ చేసినట్లు సమాచారం.

AP: చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేశారని జగన్ విమర్శించారు. ‘చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి బొక్కలో వేయాలి. ఎవరైనా ఇలాంటి మోసం చేస్తే ఏం చేసేవారు? జైల్లో పెడతారు కదా’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తల్లికి వందనం, ఉచిత సిలిండర్లు అంటూ మోసం చేశారని.. ఉచిత బస్సుకు ఎన్నో నిబంధనలు పెట్టారని ఫైరయ్యారు. నాడు-నేడును పూర్తిగా ఆపేసి, ఇంగ్లిష్ మీడియాన్ని తీసేశారని విమర్శించారు.

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<

సాధారణంగా పెప్లమ్ టాప్స్ జీన్స్పైకి సూట్ అవుతాయి. కానీ దీన్ని ఎత్నిక్ వేర్గా ట్రై చేస్తే మోడ్రన్ టచ్ ఇస్తుంది. పెప్లమ్ టాప్స్ను చీరలతో స్టైల్ చేసి ట్రెండీ లుక్ సొంతం చేసుకోవచ్చు. పార్టీల్లో, ఫంక్షన్లలో అందరి దృష్టిని ఆకర్షించాలంటే, జాకెట్ స్టైల్ పెప్లమ్ బ్లౌజ్తో చీరను మ్యాచ్ చేస్తే సరిపోతుంది. పెప్లమ్ బ్లౌజ్ వేసుకుంటే పల్లు లోపలికి తీసుకుంటారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

‘అఖండ-2’ విడుదలను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ‘అఖండ-2’ నిర్మాణ సంస్థ 14 రీల్స్(ఇప్పుడు 14 రీల్స్ ప్లస్) తమకు రూ.28 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో సమస్య పరిష్కారం అయ్యే వరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ‘అఖండ2’ విడుదల చేయొద్దని కోర్టు ఆదేశించింది. దీనిపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.
Sorry, no posts matched your criteria.