news

News January 16, 2026

రాష్ట్రంలో 424 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

EdCIL APలో 424 డిస్ట్రిక్ట్ కెరీర్& మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(JAN 18) ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc/MA, BA/BSc(సైకాలజీ), MSc/M.Phil, MSW, MSc(సైకియాట్రిక్ నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం 30వేలు+అలవెన్సులు రూ.4వేలు చెల్లిస్తారు. సైట్: www.edcilindia.co.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News January 16, 2026

తమిళ ఆడియన్సే అల్లు అర్జున్ టార్గెట్?

image

‘పుష్ప2’ తర్వాత అల్లు అర్జున్ తమిళ దర్శకులు అట్లీ, లోకేశ్ కనగరాజ్‌తో సినిమాలు ప్లాన్ చేశారు. ‘పుష్ప’తో ఇప్పటికే నార్త్‌లో ఆయనకు మంచి ఆదరణ ఏర్పడింది. సౌత్‌లో AP, TGతో పాటు కేరళ, కర్ణాటకలో ఫాలోయింగ్ ఉంది. ఇక మిగిలింది TN కావడంతో అక్కడి ఆడియన్స్‌నే బన్ని టార్గెట్ చేశారని టాక్. తమిళ స్టార్ డైరెక్టర్లు కావడంతో ఈ సినిమాలు అక్కడ కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానున్నాయి. ఇవి హిట్టయితే బన్నీకి తిరుగులేనట్లే.

News January 16, 2026

ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>IIT<<>> గువాహటి 5 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి PhD (VLSI/మైక్రో ఎలక్ట్రానిక్స్/CS), MTech/ME, BE/BTech (RTL డిజైన్/ డేటా వెరిఫికేషన్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 27వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రాజెక్ట్ సైంటిస్ట్‌కు నెలకు రూ.68,450, అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.43,250 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://iitg.ac.in

News January 16, 2026

ప్రీటెర్మ్ బర్త్‌కు ఇదే కారణం

image

గర్భధారణ తర్వాత తొమ్మిది నెలలు నిండాక బిడ్డకు జన్మనివ్వడం సాధారణం. కానీ మరికొందరిలో నెలలు నిండక ముందే ప్రసవం జరుగుతుంది. దీన్నే ప్రీటెర్మ్ బర్త్ అని కూడా అంటారు. ఇలా నెలల నిండకుండానే డెలివరీ కాకపోవడానికి పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక సమస్యలే ముఖ్య కారణమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇలా ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ప్రశాంతంగా ఉంటూ పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News January 16, 2026

9 నెలల్లో భారత్ ఎగుమతులు 634 బిలియన్ డాలర్లు

image

భారత్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లో 4.33% వృద్ధితో 634 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసింది. వాణిజ్య శాఖ ప్రాథమిక డేటా ప్రకారం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య వస్తువుల ఎగుమతులు 330 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో ప్రధానంగా తృణధాన్యాలు, ఎలక్ట్రానిక్స్, జీడిపప్పు, మాంసం, పాల ఉత్పత్తులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా అమెరికా, చైనా, UAE, స్పెయిన్, హాంకాంగ్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

News January 16, 2026

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

image

AP: సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 18 గంటల వరకు టైమ్ పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలా తోరణం వరకు క్యూ లైన్ ఉంది. గురువారం వేంకటేశ్వరుడిని 64,064 మంది దర్శించుకోగా 30,663 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.80కోట్లు ఆదాయం వచ్చిందని TTD ప్రకటించింది.

News January 16, 2026

ఇరాన్ వీధుల్లో అద్దె సైనికులు

image

ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలను అణిచివేయడానికి ఖమేనీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీయ భద్రతా బలగాలపై నమ్మకం తగ్గడంతో ఇరాక్ నుంచి కిరాయికి యువకులను రప్పించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. యాత్రికుల ముసుగులో వీరంతా ఇరాన్‌లోకి చొరబడుతున్నారని, అనంతరం నిరసనకారులపై హింసకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హెజ్బొల్లా గ్రూప్ వంటి వారు ఇందులో ఉన్నట్లు సమాచారం.

News January 16, 2026

NTPCలో ఉద్యోగాలు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>NTPC<<>>లో 6 అసిస్టెంట్ లా ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. CLAT-2026 పీజీలో సాధించిన స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/

News January 16, 2026

కనుమ రోజు మినుము ఎందుకు తినాలి?

image

కనుమ పశువులకు, పితృదేవతలకు అంకితం చేసిన పండుగ. ఈరోజు చనిపోయిన పెద్దల కోసం పెట్టే ప్రసాదాల్లో గారెలు ప్రధానమైనవి. వీటిలో పోషకాల విలువలు ఎక్కువ. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని, బలాన్ని అందించడంలో మినుములు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ‘కనుమ రోజు మినుము తినాలి’ అనే సామెత పుట్టింది. ఆ రోజు అల్లుళ్లు, బంధువులతో కలిసి మినుములతో చేసిన వంటకాలు తింటూ, విశ్రాంతిగా గడపడమే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు రహస్యం.

News January 16, 2026

పౌడర్ రాయడం వల్ల ఈ నష్టాలు

image

బిడ్డకు చెమటలు పడుతున్నప్పుడు పదే పదే పౌడర్ రాస్తే అది తేమను గ్రహించి చర్మాన్ని మరింత సున్నితంగా చేస్తుంది. పౌడర్ వేయడం వల్ల పిల్లల్లో అలెర్జీలు, ఉబ్బసం, దగ్గు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శిశువు చర్మాన్ని పొడిగా, సౌకర్యవంతంగా ఉంచాలనుకుంటే చర్మంపై కొబ్బరి నూనె వాడాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల కోసం పౌడర్‌ను కొనేముందు వైద్యులు సూచించిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం మంచిది.