news

News November 19, 2025

తేలని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య

image

TG: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య తేలడం లేదు. దీంతో ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. ఏయే శాఖల్లో ఎంతమంది పనిచేస్తున్నారు? వారికి జీతం ఎంత? ఎన్ని నెలల వేతనం తీసుకున్నారు? పెండింగ్ ఎంత ఉంది? అనే వివరాలు సేకరిస్తున్నాయి. కొన్ని శాఖల్లో సరైన సమాచారం దొరకడం లేదని చెబుతున్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ వంటి వాటిలో జీతాలు తీసుకోకుండా కొంతమంది పనిచేస్తున్నట్లు వారి దృష్టికి వచ్చింది.

News November 19, 2025

RRB గ్రూప్-D ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల

image

<>RRB<<>> 32,438 గ్రూప్-D పోస్టుల భర్తీకి సంబంధించి ఇంటిమేషన్ స్లిప్పులు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి నగర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. నవంబర్ 27 నుంచి జనవరి 16వరకు CBT విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. www.rrbcdg.gov.in/ వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు ఈనెల 23నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

News November 19, 2025

మావోల ఎన్‌కౌంటర్‌.. మృతుల్లో టెక్ శంకర్

image

AP: ఏజెన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోలు మరణించారని అల్లూరి జిల్లా SP బర్దర్ తెలిపారు. 3రోజులుగా నిర్వహిస్తున్న కూంబింగ్‌లో ఇవాళ తెల్లవారుజామున నక్సల్స్ ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. మృతుల్లో టెక్ శంకర్ ఉన్నారని, ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. AOBలో మళ్లీ రిక్రూట్‌మెంట్ జరుగుతోందని, దీన్ని షెల్టర్ జోన్‌గా చేసుకోవాలని మావోలు భావించారని తెలిపారు.

News November 19, 2025

కాంగ్రెస్ మేలుకోకపోతే కష్టం: ముంతాజ్

image

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.

News November 19, 2025

రాష్ట్రంలో 78 పోస్టులకు నోటిఫికేషన్

image

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 78 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD, MS, DNB, PG, పీజీ డిప్లొమా, DM, M.CH, MSC, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.లక్ష నుంచి రూ.1,90,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: rajannasircilla.telangana.gov.in./

News November 19, 2025

రాష్ట్రంలో 78 పోస్టులకు నోటిఫికేషన్

image

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 78 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD, MS, DNB, PG, పీజీ డిప్లొమా, DM, M.CH, MSC, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.లక్ష నుంచి రూ.1,90,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: rajannasircilla.telangana.gov.in./

News November 19, 2025

iBOMMA బంద్.. ఇక కలెక్షన్లు పెరుగుతాయా?

image

iBOMMA క్లోజవడంతో సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవి వల్ల ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం జరిగిందని, ఇకపై తమకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. అయితే పైరసీ ఆగినందున మూవీల కలెక్షన్లు పెరుగుతాయా? అనే చర్చ మొదలైంది. సినిమాల్లో సత్తా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకే వెళ్తారని, ఇది ఎన్నోసార్లు రుజువైందని నెటిజన్లు పేర్కొంటున్నారు. కలెక్షన్లపై పైరసీ ప్రభావం నామమాత్రమేనంటున్నారు. మీరేమంటారు?

News November 19, 2025

రాష్ట్రంలో 78 పోస్టులకు నోటిఫికేషన్

image

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 78 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD, MS, DNB, PG, పీజీ డిప్లొమా, DM, M.CH, MSC, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.లక్ష నుంచి రూ.1,90,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: rajannasircilla.telangana.gov.in./

News November 19, 2025

కాంగ్రెస్ మేలుకోకపోతే కష్టం: ముంతాజ్

image

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.

News November 19, 2025

ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు

image

ఏపీ మెడికల్& హెల్త్ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 8 కాంట్రాక్ట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్(మేనేజర్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, ఎంబీఏ, పీజీడీసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.61,960 జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/msrb/