India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి, అహంకారాన్ని తొలగించుకోవడానికి మనీషా పంచకం చదవాలి. బాహ్య రూపం, కులాన్ని బట్టి మనిషిని అంచనా వేయడం అజ్ఞానమని, అందరిలో ఉన్న ఆత్మ చైతన్యం ఒకటేనని ఇది బోధిస్తుంది. సమదృష్టిని పెంపొందించుకోడానికి, సత్యం వైపు పయణించడానికి ఇవి మార్గదర్శకాలు. ‘నేను శరీరాన్ని కాదు, ఆత్మను’ అనే సత్యాన్ని గ్రహించిన రోజే మనిషికి సంపూర్ణ విముక్తి లభిస్తుందని శంకరాచార్యులు ఇందులో స్పష్టం చేశారు.

యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ ఎదురీదుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 302/8 స్కోర్ చేసింది. దీంతో 119 పరుగుల లీడ్ సాధించింది. యంగ్ బ్యాటర్ జాకోబ్ బెతల్ 142*, డకెట్ 42, బ్రూక్ 42, జేమీ స్మిత్ 26 రన్స్ చేశారు. చేతిలో 2 వికెట్లే ఉండగా చివరి రోజు ఆసీస్ బౌలింగ్ను ఎంత మేర తట్టుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే 3-1 తేడాతో కంగారూలు సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ రోజుల్లో పిల్లల పెంపకం చాలా సవాలుతో కూడుకున్న విషయం. ముఖ్యంగా ఆడపిల్లలను భయపడకుండా, ధైర్యంగా నిలబడుతూ, తమను తాము ఎలా రక్షించుకోవాలో కచ్చితంగా నేర్పించాలంటున్నారు నిపుణులు. జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా దృఢ సంకల్పంతో ఎలా ఎదుర్కోవాలో అమ్మాయిలకు నేర్పాలి. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేలా ప్రోత్సహించాలి. వారు మంచి పనులు చేస్తే పొగడటం, కొత్త పనిని ప్రయత్నిస్తుంటే ప్రోత్సహించడం ముఖ్యమంటున్నారు.

రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలకు హైకోర్టు డివిజన్ బెంచ్లో ఊరట లభించింది. టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పుష్ప-2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ-2 చిత్రాలకే పరిమితం చేసింది.

రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు కాదు అధికారమే లక్ష్యమని అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక నిరూపించింది. రాజకీయాల్లో ఉప్పూనిప్పుగా భ్రమ కల్పించే BJP-INC అక్కడ <<18786772>>కలిసిపోవడం<<>> ఆ పార్టీల నైతికతను ప్రశ్నిస్తోంది. అసెంబ్లీలు, పార్లమెంటులో ప్రజాప్రయోజన అంశాలపై చర్చకు ఏకతాటిపైకి రాని పార్టీలు అధికారం కోసం చేతులు కలపడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటివి చూసైనా కార్యకర్తలు మారాల్సిన అవసరం ఉంది. ఏమంటారు?

భార్య ఆశ్రిత తనను కొడుతోందని కన్నడ నటుడు ధనుష్ రాజ్ గిరినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసి, బాత్రూమ్లో గాజు పగలగొట్టి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నట్టు కంప్లైంట్లో పేర్కొన్నారు. కట్నం కోసం వేధించారని, ఫిజికల్గా దాడి చేశారని సౌత్ డివిజన్ మహిళా పోలీస్ స్టేషన్లో ధనుష్ భార్య ఆశ్రిత కూడా ఫిర్యాదు చేశారు. తనకు అబద్ధం చెప్పి వేరే మహిళతో విదేశాలకు వెళ్లాడని ఆరోపించారు.

రన్నింగ్ మేలా లేక వెయిట్ లిఫ్టింగ్ బెటరా? అనే ప్రశ్నకు ప్రముఖ వైద్యుడు సుధీర్ సమాధానమిచ్చారు. ‘దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం రెండింటినీ చేయడం బెటర్. శాస్త్రీయంగా చూస్తే గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణలో రన్నింగ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. వృద్ధాప్యంలో కండరాలు, ఎముకల దృఢత్వానికి వెయిట్ లిఫ్టింగ్ అత్యవసరం. అయితే ఈ రెండింటినీ చేయడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ & క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు’ అని తెలిపారు.

పాక్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ మండిపడ్డారు. అది ఏదో రహస్యంగా చేసే పని కాదని, ఆ దేశంలోని పెద్ద నగరాల్లోనే బహిరంగంగా టెర్రర్ ట్రైనింగ్ క్యాంపులు నడుస్తున్నాయని కుండబద్దలు కొట్టారు. దీనికి ఆ దేశ సైన్యం పూర్తి మద్దతు ఉందన్నారు. పాక్ తీరు వల్ల ఆ దేశంతో సంబంధాలు ఎప్పటికీ ఓ మినహాయింపు అని, ఈ చేదు నిజం ఆధారంగానే భారత్ తన పాలసీలను రూపొందిస్తోందని స్పష్టం చేశారు.

లండన్లో ₹1.3 కోట్ల జీతం కంటే బెంగళూరులో ₹45 లక్షలతోనే లైఫ్ బిందాస్గా ఉందని గూగుల్ ఇంజినీర్ వైభవ్ అగర్వాల్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. లండన్లో అద్దెలు, పన్నులు పోనూ ఏమీ మిగలదని, పనులన్నీ మనమే చేసుకోవాలని పేర్కొన్నారు. అదే బెంగళూరులో పనిమనుషులు, తక్కువ ఖర్చుతో లగ్జరీ లైఫ్ అనుభవించ వచ్చని లెక్కలతో వివరించారు. క్వాలిటీ లైఫ్స్టైల్ కోసం లండన్, లగ్జరీ, కంఫర్ట్ కోసం బెంగళూరు బెటర్ అని తేల్చారు.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్రావు, ఎమ్మెల్సీ నవీన్రావు తండ్రి కొండల్రావుకు సిట్ నోటీసులు జారీచేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ పీఎస్లో విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ఇటీవల నవీన్రావు కూడా విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.