news

News November 22, 2025

రెండేళ్ల నుంచి పేలుళ్లకు సిద్ధమవుతున్నాం: షకీల్‌

image

ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. రెండేళ్లుగా పేలుళ్ల కోసం సిద్ధమవుతున్నట్టు ఒప్పుకున్నాడు. యూరియా, అమోనియం నైట్రేట్‌, 26 క్వింటాళ్ల NPK ఫెర్టిలైజర్, కెమికల్స్ నిల్వ కోసం డీప్‌ ఫ్రీజర్‌ను ముజమ్మిల్ కొనుగోలు చేశాడు. కుట్రకు నిందితులే రూ.26 లక్షలు సమకూర్చుకున్నారు. పేలుళ్లలో ఉమర్ మరణించగా, మిగతా నిందితులు కస్టడీలో ఉన్నారు.

News November 22, 2025

బొద్దింకలతో కాఫీ.. టేస్ట్ ఎలా ఉందంటే?

image

ఏదైనా తినే పదార్థంలో బొద్దింక పడితే మనమైతే దానిని చెత్తబుట్టలో పడేస్తాం. కానీ చైనాలోని బీజింగ్‌లో ఓ కీటకాల మ్యూజియంలో ప్రత్యేకంగా ‘బొద్దింక కాఫీ’ని ప్రవేశపెట్టారు. దీని ధర సుమారు 45 యువాన్లు (US$6). రుచి చూసిన కస్టమర్లు ఇది కాల్చిన- పుల్లటి ఫ్లేవర్ వస్తోందని తెలిపారు. కాఫీపై రుబ్బిన బొద్దింకలు, ఎండిన పసుపు మీల్‌వార్మ్‌లను చల్లుతారు. ఈ వింత డ్రింక్ యువతను ఆకర్షిస్తూ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

News November 22, 2025

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో 46ను విడుదల చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని జీవోలో స్పష్టం చేసింది. SC, ST, BC, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనుంది. ST రిజర్వేషన్లు ఖరారయ్యాక SC, BC రిజర్వేషన్లు ఉంటాయి. రేపు సా.6 గంటల్లోపు ఖరారు చేసిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖకు కలెక్టర్లు అందించనున్నారు.

News November 22, 2025

ఇంజినీరింగ్ విద్యార్థినులకు JNTU హైదరాబాద్ గొప్ప అవకాశం

image

బీటెక్​ చదివిన ప్రతి విద్యార్థినికి ఉద్యోగం రావాలని JNTU హైదరాబాద్​ అధికారులు కొత్త ఆలోచనను అమల్లోకి తీసుకొచ్చారు. క్యాంపస్​ ఇంటర్వ్యూల్లో కొద్దిపాటి తేడాతో ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన విద్యార్థినులకు ఆరు నెలలు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు సాధించేందుకు సాయం చేయనున్నారు. ఇందుకోసం బెంగళూరులోని ఎమర్టెక్స్​ అనే ఐటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. JNTUలో చదివితే ఉద్యోగం ఖాయం అనే ధీమాను కల్పిస్తున్నారు.

News November 22, 2025

IIITకల్యాణిలో నాన్ టీచింగ్ పోస్టులు

image

IIITకల్యాణి, పశ్చిమబెంగాల్‌లో 6 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిలో డిప్యూటీ రిజిస్ట్రార్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పీజీ, CA/ICWA, ME, M.Tech, MSc, MCA, డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://iiitkalyani.ac.in

News November 22, 2025

హనుమాన్ చాలీసా భావం – 17

image

తుమ్హరో మంత్ర విభీషణ మానా | లంకేశ్వర భయె సబ జగ జానా || హనుమంతుడి ఉద్దేశాన్ని పాటించిన విభీషణుడు లంకకు రాజయ్యాడు. ఆయన విజయానికి ఆంజనేయుడి సలహా, ఆశీర్వాదాలు ఎంతో తోడ్పడ్డాయి. ఇలా విభీషనుడిని ఆదుకున్నట్లే హనుమాన్ మనల్ని కూడా ఆదుకుంటాడు. ఎంతో విశ్వాసంతో ఆయన నామాన్ని, మంత్రాన్ని జపిస్తే.. వారిని సత్య మార్గంలో నడిపిస్తాడు. రాముడిని కొలిచేవారికి హనుమంతుని అండదండలు ఎప్పుడూ ఉంటాయని నమ్మకం.<<-se>>#HANUMANCHALISA<<>>

News November 22, 2025

T2OIWC-2026.. ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

image

భారత్, శ్రీలంక వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగే మెన్స్ T2OIWCలో 20 జట్లు 4 గ్రూపుల్లో పోటీ పడనున్నాయి. ఒక గ్రూపులో ఇండియా, పాక్, USA, నమీబియా, నెదర్లాండ్స్, రెండో గ్రూపులో ఆసీస్, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ ఉంటాయని క్రిక్‌బజ్ వెల్లడించింది. మూడో గ్రూపులో ఇంగ్లండ్, విండీస్, ఇటలీ, బంగ్లాదేశ్, నేపాల్, నాలుగో గ్రూపులో సౌతాఫ్రికా, కివీస్, అఫ్గాన్, UAE, కెనడా ఉంటాయని తెలిపింది.

News November 22, 2025

బెంగళూరు ట్రాఫిక్ కంటే అంతరిక్ష ప్రయాణమే సులువు: శుభాంశు

image

భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు బెంగళూరు ట్రాఫిక్ చిరాకు తెప్పించింది. టెక్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన అక్కడి ట్రాఫిక్ కష్టాలపై చమత్కరించారు. ‘బెంగళూరులోని ఈ ట్రాఫిక్‌ను దాటడం కంటే అంతరిక్షంలో ప్రయాణించడం చాలా సులువు’ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ‘మారతహళ్లి నుంచి ఈవెంట్‌కు రావడానికి ప్రసంగానికి కేటాయించిన సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ పట్టింది’ అని నవ్వుతూ నగర ప్రజల బాధను హైలైట్ చేశారు.

News November 22, 2025

‘పండ్లు, కూరగాయల సాగుతో ఎక్కువ లాభం’

image

నారింజ పంట ఉత్పత్తికి నాణ్యమైన విత్తనాల కోసం నాగ్‌పూర్‌లో రూ.70 కోట్లతో క్లీన్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలను అందజేయడంపై ICAR సైంటిస్టులు దృష్టిపెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే పండ్లు, కూరగాయ పంటలను సాగు చేయాలని.. యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్‌ వాడకంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.

News November 22, 2025

ఇంగ్లండ్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

image

యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లిష్ బ్యాటర్లను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. పోప్(33), డకెట్(28), జేమీ స్మిత్(15), అట్కిన్సన్(37), కార్స్(20) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్, డగ్గెట్ చెరో 3 వికెట్లు తీశారు. విజయం కోసం ఆస్ట్రేలియా 205 పరుగులు చేయాల్సి ఉంటుంది.