news

News September 4, 2025

పలువురు ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగులు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం IASల బదిలీలు, పోస్టింగులు చేపట్టింది. సర్వే సెటిల్‌మెంట్స్‌&ల్యాండ్‌ రికార్డ్స్‌ డైరెక్టర్‌గా R.కూర్మనాథ్‌, తూ.గో. జాయింట్‌ కలెక్టర్‌గా వై.మేఘస్వరూప్, గుంటూరు JCగా A.శ్రీవాస్తవ, మన్యం JCగా సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, అల్లూరి(D) పాడేరు ITDA POగా తిరుమాని శ్రీపూజ, AP విజిలెన్స్‌ జాయింట్‌ సెక్రటరీగా కె.ఆర్‌.కల్పశ్రీ, విశాఖ(D) రంపచోడవరం ITDA POగా స్మరణ్‌రాజ్‌‌లను నియమించింది.

News September 4, 2025

వీటిపై త్వరలో 40శాతం జీఎస్టీ!

image

లగ్జరీ వస్తువులపై త్వరలో 40 శాతం పన్ను విధిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పాన్‌మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై ఈ మేరకు జీఎస్టీ వసూలు చేస్తామని తెలిపారు. ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్‌పై 40శాతం పన్ను ఉంటుందని పేర్కొన్నారు. వీటిపై ఇప్పటి వరకు ఉన్న 28శాతం శ్లాబులే కొనసాగనుండగా, త్వరలో 40 శాతం అమలు చేస్తామన్నారు.

News September 4, 2025

GST శ్లాబులతో సామాన్యులకు మేలు: మోదీ

image

సామాన్య ప్రజలకు మేలు చేకూరుస్తూ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేలా కొత్త GST <<17605492>>శ్లాబులు<<>> ప్రకటించామని PM మోదీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్ణయం రైతులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువత, చిన్న-మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఇది పౌరుల జీవితాలను మరింత మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. చిరు వ్యాపారులు సులభంగా వ్యాపారం చేసుకునేందుకు దోహదపడుతుందని మోదీ వెల్లడించారు.

News September 4, 2025

ఆ శరణార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

image

అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చిన మైనార్టీలకు(ముస్లిమేతరులు) కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పాస్ పోర్ట్ లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేకున్నా దేశంలో ఉండటానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్ 31, 2024 వరకు దేశానికి వచ్చిన వారికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ యాక్ట్ కింద ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పింది.

News September 4, 2025

18% జీఎస్టీలోకి ఇవే..

image

సామాన్యులకు ఊరట కల్పించేలా టీవీలపై జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి కేంద్రం తగ్గించింది. పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పీజీ, సీఎన్జీ కార్లు(1,200cc- ఆ లోపు), డీజిల్, డీజిల్ హైబ్రిడ్ కార్లు(1500cc- ఆ లోపు), 3 వీలర్స్, మోటార్ సైకిల్స్(350cc-ఆ లోపు), గూడ్స్ మోటార్ వెహికల్స్, ఏసీలు, అన్ని టెలివిజన్లు, మానిటర్స్, ప్రొజెక్టర్స్, వాషింగ్ మెషీన్స్, సిమెంట్ వంటివి ఈ శ్లాబులోకి రానున్నాయి.

News September 3, 2025

5శాతం శ్లాబులోకి వచ్చిన వస్తువులివే..

image

సబ్బులు, షాంపూలు, టూత్‌బ్రష్‌లు, టాయిలెట్ సోప్, షేవింగ్ క్రీమ్, హెయిర్ ఆయిల్‌‌తో పాటు సైకిళ్లపై గతంలో 18% GST ఉండగా ఇప్పుడు 5% శ్లాబులోకి తీసుకొచ్చారు. వెన్న, నెయ్యి, చీజ్, డెయిరీ ప్రొడక్ట్స్, ప్రీ ప్యాకేజ్డ్ నమ్‌కీన్, గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, న్యాప్‌కిన్స్, కెమికల్ డైపర్స్, కుట్టు మిషన్లు గతంలో 12% శ్లాబులో ఉండగా ఇప్పుడు 5శాతంలోకి తెచ్చారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలూ ఇందులోనే ఉన్నాయి.

News September 3, 2025

వీటిపై GST తొలగింపు

image

* వ్యక్తిగత, టర్మ్, హెల్త్ బీమా పాలసీలు(18% to 0%)
* మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్(12 to 0)
* పెన్సిల్స్, క్రేయాన్స్, షార్ప్‌నర్స్, పాస్టల్స్(12 to 0)
* ఎక్సర్ సైజ్ బుక్స్, నోట్ బుక్స్(12 to 0)
* 33 ప్రాణాధార ఔషధాలు(12 to 0)
* ఎరేజర్స్(5 to 0)
* ఇండియన్ పరోటా, అన్ని రకాల బ్రెడ్లు

News September 3, 2025

హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై GST రద్దు

image

హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీని రద్దు చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్యులకు తక్కువ ధరకే హెల్త్, లైఫ్ ప్రీమియంలు లభించనున్నాయి. తద్వారా చాలామంది ఇన్సూరెన్స్‌లు తీసుకునే అవకాశం ఏర్పడనుంది. ఇక లగ్జరీ వస్తువులపై 40శాతం జీఎస్టీ విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది.

News September 3, 2025

మరో 11 కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం

image

AP: కూటమి ప్రభుత్వం మరో 11 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించింది. ఆయా కార్పొరేషన్లకు సంబంధించి 120 మంది బోర్డు డైరెక్టర్లను ఎంపిక చేసింది. వీరిలో బీసీలు 42, ఓసీలు 40, ఎస్సీలు 23, మైనార్టీలు 15 మందికి చోటు కల్పించింది.

News September 3, 2025

హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి: VHP నేతలు

image

APలోని హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఎండోమెంట్ చట్టాన్ని సవరించాలని VHP నేతలు CM చంద్రబాబును కోరారు. ఈ మేరకు అందించిన నమూనా డ్రాఫ్టును పరిశీలిస్తానని ఆయన సానుకూలంగా స్పందించినట్లు VHP కేంద్రీయ సంఘటనా కార్యదర్శి మిలింద్ పరాండే, కేంద్రీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు తెలిపారు. CMను కలిసిన వారిలో భాగ్యనగర క్షేత్ర కార్యదర్శి రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులున్నారు.