India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. నేడు ఉదయం గాలి నాణ్యత AQI 351గా రికార్డైంది. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలతోపాటు బురారీ, ఆనంద్ విహార్, చందానీ చౌక్, ఐటీఓ, జహంగీర్ పురి ఏరియాల్లో AQI 300 కంటే ఎక్కువ ఉంది. బుధవారం సాయంత్రం 327 వద్ద ఉన్న గాలి నాణ్యత ఈరోజు ఉదయానికి మరింత దిగజారింది. వరుసగా 21వ రోజు కూడా AQI 300 కంటే ఎక్కువ నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది.

రష్యాలో షాకింగ్ ఘటన జరిగింది. ఈటింగ్ ఛాలెంజ్ ద్వారా మొదట బరువు పెరిగి తర్వాత తగ్గే ప్రోగ్రామ్ను ప్రయత్నిస్తూ ఫిట్నెస్ కోచ్ డిమిత్రి నుయాన్జిన్(30) చనిపోయారు. ఆయన రోజుకు 10వేల క్యాలరీలకుపైగా జంక్ ఫుడ్ తిన్నట్లు తెలుస్తోంది. డిమిత్రి ప్రయత్నం వికటించి ఒక నెలలోనే 13KGలు పెరిగి 103KGలకు చేరారు. చివరికి గుండెపోటుతో నిద్రలోనే మరణించారు. ఇలాంటి ఛాలెంజ్లను ఎవరూ అనుసరించొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

AP: దేవతల రాజధాని అమరావతి అని, మన రాజధానికి అమరావతి పేరు పెట్టే అవకాశం దేవుడు తనకిచ్చారని CM CBN చెప్పారు. కృష్ణా తీరంలో వేంకటేశ్వర ఆలయ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ‘ఈ ప్రాంతాన్ని కాపాడే శక్తి ఈ గుడికి ఉంది. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని TTDని కోరుతున్నా. ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతిఒక్కరికీ ఇవ్వాలని స్వామిని వేడుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

స్మోకింగ్, డ్రింకింగ్ కంటే వేగంగా ఆయువును ఒత్తిడి హరిస్తుందని ఓ ఆర్థోపెడిక్ సర్జన్ తెలిపారు. ‘ఒత్తిడి కేవలం మానసిక సమస్య కాదని చాలామందికి తెలియదు. అది పూర్తి బాడీకి సంబంధించినది. ఒత్తిడికి గురైనప్పుడు శరీరం కార్టిసాల్, అడ్రినలిన్ రిలీజ్ చేస్తుంది. వెన్నునొప్పి, తలనొప్పి, పళ్లు కొరకడం, కండరాలు పట్టేయడం వంటి వాటికీ ఒత్తిడే కారణం’ అని చెప్పారు. 7-8 గంటల నిద్రతోనే ఒత్తిడిని ఎదుర్కోగలమన్నారు.

పీరియడ్స్లో 1-3 రోజులకు మించి హెవీ బ్లీడింగ్ అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు నిపుణులు. ఫైబ్రాయిడ్స్, ప్రెగ్నెన్సీ సమస్యలు, పీసీఓఎస్, ఐయూడీ, క్యాన్సర్ దీనికి కారణం కావొచ్చు. కాబట్టి సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీన్ని గుర్తించడానికి రక్త పరీక్ష, పాప్స్మియర్, ఎండోమెట్రియల్ బయాప్సీ, అల్ట్రాసౌండ్ స్కాన్, సోనోహిస్టరోగ్రామ్, హిస్టరోస్కోపీ, D&C పరీక్షలు చేస్తారు.

<

TG: ఇప్పటివరకు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకే పరిమితమైన వ్యూహకర్తలు, ఏజెన్సీలు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్లోకీ ఎంట్రీ ఇచ్చాయి. ‘ప్రచారం ఎలా చేయాలి? ప్రజలతో ఎలా మాట్లాడాలి? సర్వే చేసి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? విజయావకాశాలు ఎలా పెంచుకోవాలి?’ వంటి అంశాలన్నీ తామే చూసుకుంటామని SMలో ప్రకటనలు ఇస్తున్నారు. ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీలే టార్గెట్గా అభ్యర్థులకు స్ట్రాటజిస్టులు వల విసురుతున్నారు.

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణనష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నిన్న తీరాన్ని తాకిన సెన్యార్ తుఫాను వల్ల ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు, కొండ చరియలు విరిగిపడిన కారణంతో ఇప్పటికే 28 మంది మరణించారు.

ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి తర్వాత ఆయన భార్య హేమామాలిని SMలో తొలి పోస్టు చేశారు. ఆయన మృతితో తన జీవితం శూన్యమైందని భావోద్వేగానికి గురయ్యారు. ధర్మేంద్ర తనకు భర్త మాత్రమే కాకుండా.. స్నేహితుడు, మార్గదర్శి అని చెప్పారు. కుమార్తెలు ఈషా, అహానాపై ఆయన చూపిన ప్రేమను గుర్తుచేసుకున్నారు. ధర్మేంద్ర వినయం ఆయనను ఐకాన్గా నిలబెట్టిందని తెలిపారు. ఆయన మరణంతో ఏర్పడిన ఖాళీ జీవితాంతం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి తర్వాత ఆయన భార్య హేమామాలిని SMలో తొలి పోస్టు చేశారు. ఆయన మృతితో తన జీవితం శూన్యమైందని భావోద్వేగానికి గురయ్యారు. ధర్మేంద్ర తనకు భర్త మాత్రమే కాకుండా.. స్నేహితుడు, మార్గదర్శి అని చెప్పారు. కుమార్తెలు ఈషా, అహానాపై ఆయన చూపిన ప్రేమను గుర్తుచేసుకున్నారు. ధర్మేంద్ర వినయం ఆయనను ఐకాన్గా నిలబెట్టిందని తెలిపారు. ఆయన మరణంతో ఏర్పడిన ఖాళీ జీవితాంతం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.