India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజా సాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కొంతకాలం షూటింగ్లకు విరామం ఇచ్చినట్లు సమాచారం. తన డ్రీమ్ డెస్టినేషన్ అయిన ఇటలీలోని ఓ పల్లెటూరుకు డార్లింగ్ వెళ్లినట్లు తెలుస్తోంది. మూడు, నాలుగు వారాలపాటు ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. తిరిగొచ్చాక పెండింగ్ షూటింగ్స్ కంప్లీట్ చేసి కొత్త సినిమాలపై ఫోకస్ చేస్తారని టాక్.
TG: నేషనల్ హెరాల్డ్ కేసుపై CM రేవంత్ ఎందుకు స్పందించడం లేదని BRS నేత KTR ప్రశ్నించారు. ‘ఓవైపు కాంగ్రెస్ నేతలంతా వీధుల్లో నిరసనలు తెలుపుతుంటే రేవంత్ మాత్రం తన బాస్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విషయంలో మౌనమెందుకు పాటిస్తున్నారు? నాకొక్కడికే ఇది తేడాగా అనిపిస్తోందా?’ అని Xలో సెటైర్ వేశారు. కాగా ఈ కేసులో సోనియా, రాహుల్ పేర్లను ఈడీ ఛార్జిషీట్లో చేర్చిన విషయం తెలిసిందే.
ఢిల్లీ క్యాపిటల్స్పై మ్యాచ్లో చేతులారా విజయాన్ని దూరం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ సంజూ ఆ మ్యాచ్లో పక్కటెముకల నొప్పితో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఆయనకు స్కాన్స్ తీయించామని, రేపు LSGతో మ్యాచ్కు ఆడటం అనుమానమేనని RR వర్గాలు తెలిపాయి. దీంతో మరోసారి పరాగ్ కెప్టెన్సీ చేసే అవకాశముంది.
శరీరంలోని మలినాల్ని శుభ్రం చేయడంలో లివర్దే ప్రధాన పాత్ర. అంతటి కీలకమైన లివర్లో ఏదైనా సమస్య తలెత్తితే కనిపించే కొన్ని లక్షణాలు:
-> కడుపునిండా తింటూ కంటినిండా నిద్రపోతున్నా నీరసంగానే అనిపిస్తుండటం, తరచూ కామెర్లు రావడం, కళ్లు, చర్మం పసుపురంగులో ఉండటం, విరోచనాల రంగులో మార్పు, పొట్టకు కుడివైపు పైన నొప్పి రావడం, వాంతులు, కాళ్లు-మడమల్లో వాపు ఉంటే లివర్ టెస్ట్ చేయించుకోవాలి.
*రేపు కాలేయ ఆరోగ్య దినోత్సవం
యెమెన్లోని ఆయిల్ పోర్టుపై US చేసిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 74కు చేరింది. ఈ ఘటనలో 171 మంది గాయపడినట్లు హౌతీ గ్రూప్ వెల్లడించింది. నెలరోజులుగా జరుగుతున్న దాడుల్లో ఇదే అత్యంత దారుణమైన దాడి అని తెలిపింది. కాగా ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న నౌకలపై హౌతీల దాడులను ట్రంప్ సీరియస్గా తీసుకున్నారు. వారికి నరకాన్ని చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో US ఆర్మీ హౌతీలపై విరుచుకుపడుతోంది.
అసభ్యంగా ప్రవర్తించాడంటూ మలయాళ నటి విన్సీ అలోషియస్ ఓ నటుడిపై ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అది టామ్ చాకో అని బయటికి రావడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపారు. ‘నేను అధికారుల్ని నమ్మాను. అతడి పేరు బయటికి రావొద్దని స్పష్టంగా చెప్పాను. అయినా పేరును లీక్ చేశారు. ప్రతిభావంతుడైన నటుడికి సినిమాల్లో అవకాశాలు ఆగకూడదు. తన తప్పును సరిదిద్దుకుంటాడన్నదే నా ఆశ’ అని పేర్కొన్నారు.
వలసదారులు, విద్యార్థులపై అమెరికా అనుసరిస్తున్న విధానంలో అత్యధికంగా భారత విద్యార్థులే ప్రభావితమవుతున్నారు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్(AILA) నివేదిక ప్రకారం.. తిరస్కరణకు గురవుతున్న వీసాల్లో 50శాతం భారత విద్యార్థులవే ఉంటున్నాయి. చైనా మీద వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నా ఆ దేశానికి చెందిన విద్యార్థుల వీసాల్ని అధికారులు కేవలం 14శాతమే రిజెక్ట్ చేస్తున్నారని అసోసియేషన్ తెలిపింది.
బెంగళూరు, పంజాబ్ మ్యాచ్ జరగాల్సిన చిన్నస్వామి స్టేడియంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని IPL అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే రాత్రి 10.54 గంటల వరకు మ్యాచ్ ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి. అప్పటిలోపు వర్షం ఆగితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ సాధ్యమవుతుందని అంపైర్లు తెలిపారు. అప్పటికీ వాన తగ్గకపోతే మ్యాచ్ను రద్దు చేసి, చెరో పాయింట్ ఇవ్వనున్నారు.
రాష్ట్రపతికి గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు లేదన్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ <<16129153>>వ్యాఖ్యలపై<<>> రాజకీయ దుమారం రేగుతోంది. తాజాగా ఎంపీ కపిల్ సిబల్ ధన్ఖడ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘శాసన వ్యవస్థ విఫలమైనప్పుడు న్యాయవ్యవస్థ కచ్చితంగా కలగజేసుకుంటుంది. అది దాని హక్కు. న్యాయస్థానాలు స్వతంత్రంగా పనిచేయడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఎప్పుడూ చూడలేదు’ అని అన్నారు.
ఇండియన్ ఎయిర్ఫోర్స్(IAF) గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)కు వెళ్లనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. నాసా అనుమతి పొందిన ప్రైవేట్ స్పేస్ఫ్లైట్లో ఆయన ప్రయాణించనున్నారు. గత 40 ఏళ్లలో స్పేస్లోకి వెళ్లిన తొలి ఇండియన్గా శుక్లా నిలవనున్నారు. 1984లో తొలిసారి రాకేశ్శర్మ స్పేస్లోకి వెళ్లారు. ఈ మిషన్ ఇస్రో, నాసా భాగస్వామ్యంలో కీలకంగా మారనుంది.
Sorry, no posts matched your criteria.