news

News September 30, 2024

లాక్‌డౌన్ వల్ల చంద్రుడిపై ఉష్ణోగ్రత తగ్గుదల!

image

కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా చంద్రుడిపై ఉష్ణోగ్రతలు తగ్గాయని భారత పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వారి నివేదిక ప్రకారం.. 2017-23 మధ్యకాలంలో చంద్రుడిపై 6 వివిధ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతల్ని నాసా ఆర్బిటర్ డేటా సాయంతో స్టడీ చేశారు. ఈక్రమంలో లాక్‌డౌన్ కాలంలో చందమామపై టెంపరేచర్ గణనీయంగా తగ్గిందని గుర్తించారు. కాలుష్యం తగ్గడంతో భూమి నుంచి వెలువడే రేడియేషన్ కూడా తగ్గడమే దీనికి కారణం కావొచ్చని వారు అంచనా వేశారు.

News September 30, 2024

పాతబస్తీకి హైడ్రా వస్తే తీవ్ర పరిణామాలు: MIM ఎమ్మెల్యేలు

image

TG: హైడ్రాకు ఎంఐఎం ఎమ్మెల్యేలు హెచ్చరికలు జారీ చేశారు. పాతబస్తీలో సర్వేకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు. ఇప్పటివరకు తమ ఇలాఖాలోకి వచ్చే ధైర్యం ఎవరూ చేయలేదని చెప్పారు. బుల్డోజర్లు వస్తే తమ పైనుంచే వెళ్లాలని అల్టిమేటం జారీ చేశారు.

News September 30, 2024

ఈ ఊరిలో కుటుంబంలో ఒకరిగా నాగుపాములు!

image

మహారాష్ట్రలోని షోలాపూర్(D) షెట్పాల్ గ్రామంలో నాగుపాములు కుటుంబసభ్యుల్లా ఇంట్లోనే తిరుగుతుంటాయి. గ్రామస్థులు ఎంతో ప్రేమగా చూసుకుంటుండగా పిల్లలు వాటితో ఆడుకుంటారు. సర్పాలను శివుడి ప్రతిరూపాల్లా భావిస్తూ ఇంట్లో అవి ఉండే ప్రాంతాన్ని దేవాలయంగా పరిగణిస్తుంటారు. ఇప్పటివరకు ఈ విషసర్పాలు కాటేసిన ఘటనలు గ్రామంలో వినిపించలేదు. పాము-మనుషుల మధ్య ఉన్న బంధాన్ని చూసేందుకు పర్యాటకులు ఆ గ్రామాన్ని సందర్శిస్తుంటారు.

News September 30, 2024

DSC అభ్యర్థులకు BIG ALERT

image

TG: DSCలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 5వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగనుంది. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఫోన్‌లో సమాచారం అందిస్తారు. ఎంపికైన వారి జాబితాను DEOలు ప్రకటిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల ఫొటో కాపీలతో హాజరుకావాలి.

News September 30, 2024

కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా: హరీశ్

image

TG: మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని హరీశ్ రావు గుర్తుచేశారు. ‘మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు. ఈ విషయంలో BRS పార్టీ అయినా, వ్యక్తిగతంగా నేనైనా ఉపేక్షించబోము. కొండా సురేఖకు కలిగిన <<14234406>>అసౌకర్యానికి <<>>చింతిస్తున్నా. సోషల్ మీడియాలో ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నా. అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నా’ అని హరీశ్ ట్వీట్ చేశారు.

News September 30, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

ఏపీలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, VZM, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, ATP, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంది.

News September 30, 2024

పుస్తకాల్లో రాజకీయ రంగులు, కంటెంట్ ఉండకూడదు: లోకేశ్

image

AP: స్కూళ్లలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. సాల్డ్ ప్రాజెక్టు ద్వారా HMలు, SGTలకు సమగ్ర శిక్షణ, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు నెలాఖరులోగా ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. ప్రతి స్కూలుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అందించాలని, పుస్తకాల్లో రాజకీయ రంగులు, కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు. స్కూళ్లలో హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

News September 30, 2024

ఆ విద్యార్థి కోసం విచ‌క్ష‌ణాధికారాన్ని వాడిన సుప్రీంకోర్టు

image

ఓ విద్యార్థి కోసం సుప్రీంకోర్టు ఆర్టిక‌ల్‌ 142 ద్వారా త‌న విచ‌క్ష‌ణాధికారాన్ని ఉపయోగించింది. IIT ధ‌న్‌బాద్‌లో అడ్మిష‌న్ పొంద‌డానికి ₹17,500 కట్టలేకపోవడంతో UPకి చెందిన అతుల్ కుమార్ సీటు కోల్పోయారు. 3 నెల‌లపాటు పలు వేదికలను ఆశ్రయించినా ఆ దళిత విద్యార్థికి న్యాయం జరగలేదు. చివరికి SCని ఆశ్రయించగా ప్ర‌తిభావంతుడైన ఆ విద్యార్థికి సీటు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. విద్యార్థికి All The Best చెప్పింది.

News September 30, 2024

నిజం తెలిసి దాచి ఉంటే అది నిజమైన పాపం: TDP

image

AP: తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ప్రభుత్వం రాజీపడదు, రాజకీయం చేయదని TDP ట్వీట్ చేసింది. ‘నెయ్యి కల్తీ జరిగిందని NDDB లాంటి పేరున్న సంస్థ రిపోర్ట్ చూడగానే CM ప్రజల ముందు ఉంచారు. నిజం తెలిసి దాచి ఉంచితే అది నిజమైన పాపం. వాస్తవాలు తేల్చడానికే సిట్ ఏర్పాటు చేశారు. అనేక చర్యలతో ప్రజల్లో అభద్రతను పోగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లడ్డూ నాణ్యతలో మార్పు వచ్చిందని ప్రజలు అంటున్నారు’ అని పేర్కొంది.

News September 30, 2024

గ్రాడ్యుయేట్ MLC ఓట్ల నమోదుకు నోటిఫికేషన్

image

AP: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల (గ్రాడ్యుయేట్) పట్టభద్రుల స్థానం పరిధిలో ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు పట్టభద్రులు ఫారం 18 ద్వారా ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో ఓట్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుండగా, డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబర్ 30న MLC ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.

error: Content is protected !!