India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారుచేసి అబ్బురపరిచిన తెలంగాణ చేనేత కళాకారులు మరోసారి అద్భుతం చేశారు. సిరిసిల్లకు చెందిన విజయ్ కుమార్ ఓ వ్యాపారవేత్త కూతురి వివాహం కోసం 200 గ్రాముల గోల్డ్తో చీరను రూపొందించారు. బంగారాన్ని జరి తీయడానికి, డిజైన్ చేయడానికి 12 రోజులు పట్టిందని ఆయన తెలిపారు. ఈ చీర 49 ఇంచుల వెడల్పు, 5.50M పొడవు, నూలుతో కలిపి 800 గ్రా. బరువు ఉందని, తయారీకి ₹18 లక్షలు ఖర్చయిందని చెప్పారు.
హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణంతో మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్బొల్లాకు అండదండలు అందించాలని ఇరాన్ సుప్రీం లీడర్ హయతుల్లా అలీ ఖమేనీ పశ్చిమాసియా దేశాలను కోరారు. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్తోనూ ఆయన భేటీ అయ్యారు. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో అమెరికా అప్రమత్తమైంది. ఇజ్రాయెల్, లెబనాన్ ఎయిర్ స్పేస్లో విమానాలు ప్రయాణించకూడదని తమ పైలెట్లను ఆదేశించింది.
ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు మంచు ఫ్యామిలీ రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంచు మోహన్ బాబు, విష్ణు స్వయంగా సీఎం చంద్రబాబుకు చెక్ అందించారు. ఈ సందర్భంగా తాను స్వయంగా గీసిన CBN చిత్రాన్ని సీఎంకు అందించినట్లు విష్ణు తెలిపారు. ఆయన తన ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నట్లు పేర్కొన్నారు. తాను నటిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా గురించి వివిధ విషయాల గురించి ఆయన అడిగినట్లు ట్వీట్ చేశారు.
చైనాకు చెందిన ఓ మహిళ కవలలకు జన్మనిచ్చింది. ఇందులో అద్భుతమేంటి అనుకుంటున్నారా? ఆమెకు రెండు గర్భాశయాలుండగా ఒక్కొక్కరు వేర్వేరు గర్భాల నుంచి జన్మించారు. ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. ప్రపంచంలో కేవలం 0.3 శాతం మంది మహిళల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితిని వైద్యులు గుర్తించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. సహజమైన గర్భధారణ ద్వారా రెండు గర్భాశయాల్లో పిండం అభివృద్ధి చెందడం చాలా అరుదని తెలిపింది.
వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ చరిత్ర సృష్టించారు. ఒక క్యాలెండర్ ఇయర్లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అవతరించారు. ఈ ఏడాది పూరన్ 2,059 పరుగులు చేశారు. ఈ క్రమంలో పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(2036 రన్స్-2021)ను ఆయన అధిగమించారు. వీరిద్దరి తర్వాత అలెక్స్ హేల్స్ (1946 రన్స్-2022), జోస్ బట్లర్ (1833 రన్స్-2023) ఉన్నారు. 2022లోనూ మహ్మద్ రిజ్వాన్ (1817 రన్స్) అత్యధిక పరుగులు చేశారు.
గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. చియా, ఫ్లాక్స్, గుమ్మడి, పొద్దుతిరుగుడు గింజలు తినాలి. ఖర్జూరంలో ఉండే పీచు, పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే డ్రై బ్లూబెర్రీస్ & రాస్ప్బెర్రీలు తినండి. ఇవన్నీ రోజూ ఓ పిడికెడు తింటే చాలా మంచిదని వైద్యులు సూచించారు.
AP: వైసీపీ శ్రేణులు శనివారం పూజల్లో పాల్గొనాలని పిలుపునిచ్చిన జగన్.. ఇవాళ ఎటు వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రశ్నించారు. ‘పూజల్లో పాల్గొనాలని మీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరి మీరు ఎక్కడ? మీరు దగ్గరలోని ఆలయానికి ఎందుకు వెళ్లలేదు? మీరు నిజంగా ఆచారాలను గౌరవిస్తే ఎందుకు వెళ్లలేదు? అందుకే టీటీడీ డిక్లరేషన్ అడుగుతోంది. నాయకులు చెప్పడమే కాదు చెప్పిన మాటను గౌరవించాలి’ అని ట్వీట్ చేశారు.
పొలంలో పాము కాటుకు గురైన వ్యక్తి ఆస్పత్రికి వెళ్లడం లేటవడంతో ఓ వ్యక్తి మరణించాడు. బిహార్లోని కైమూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రామ్ లఖన్ ప్రసాద్ అనే వ్యక్తిని పాము కాటేయడంతో ఆస్పత్రికి పరిగెత్తాడు. మద్యం తాగి పరిగెడుతున్నాడని అనుమానించి పోలీసులు అడ్డుకున్నారు. పాము కాటు గురించి చెప్పినా నమ్మలేదు. వదిలేయాలంటే రూ.2వేలు లంచం అడగ్గా అతని సోదరుడు రూ.700 ఇచ్చి తీసుకెళ్లాడు. లేట్ అవడంతో రామ్ చనిపోయాడు.
దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ను విస్తరిస్తున్న BSNL కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరతో కొత్త ప్లాన్లను తీసుకొస్తోంది. తాజాగా 60 రోజుల వ్యాలిడిటీతో రూ.345 ప్రీప్రెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇందులో అపరిమిత కాలింగ్, రోజూ 1GB డేటా, 100 SMSలు ఉంటాయి. డేటా లిమిట్ పూర్తయ్యాక నెట్ స్పీడ్ 40Kbpsకు తగ్గుతుంది. ఇలాంటి ప్లాన్ జియో, ఎయిర్టెల్, Viలో లేదు.
AP: సనాతన ధర్మం పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్రామాలు చేస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. ‘భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఇంకొకరితో కలిసి ఉండమని ఏ ధర్మంలో ఉంది? చేగువేరా ఆదర్శాలు ఎటు వెళ్లిపోయాయి? బాప్టిజం తీసుకున్నానని ఆయన చెప్పారు. అలాగే తన భార్య క్రిస్టియన్, పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అని తెలిపారు. ఇవన్నీ ఏ సనాతన ధర్మంలో ఉన్నాయో చెప్పాలి?’ అని ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.