India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రిజర్వేషన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో CM రేవంత్పై నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఇవాళ విచారించనుంది. రిజర్వేషన్లను తీసేసేందుకు BJP యత్నిస్తోందని గతంలో CM వ్యాఖ్యానించారు. BJP ప్రతిష్ఠకు భంగం కలిగేలా రేవంత్ మాట్లాడారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 499, 125 సెక్షన్ల కింద రేవంత్పై కేసు నమోదైంది.
AP: హజ్ యాత్రకు దరఖాస్తు గడువును హజ్ కమిటీ ఆఫ్ ఇండియా పొడిగించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్ తెలిపారు. ఏపీ నుంచి ఇప్పటి వరకు 1,937 మంది యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.
విక్రయదారులకు కేవలం వేదికగా మాత్రమే అమెజాన్ ఉందని ఆ సంస్థ ఇండియా వైస్ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ తెలిపారు. వ్యాపారులే ధరల్ని నిర్ణయిస్తారని చెప్పారు. భారీ రాయితీలు తమ అమ్మకాలను దెబ్బతీస్తోందన్న రిటైల్ వ్యాపారుల ఆరోపణలు సరికావన్నారు. భారత్లో గతేడాది కంటే ప్రస్తుత పండుగల సీజన్లో విక్రయాలు బాగుంటాయని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా 1,10,000 మంది తాత్కాలిక ఉద్యోగుల్ని నియమించుకున్నట్లు చెప్పారు.
దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం గతంలో ప్రకటించిన గడువు SEP 23తో ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తితో మళ్లీ పొడిగించారు. అటు విద్యార్థులు తమ అప్లికేషన్స్లో సవరణ చేసుకునేందుకు దరఖాస్తుల దాఖలు చివరి తేదీ తర్వాత రెండు రోజుల పాటు అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ <
అసలు మాంసాహారమే ముట్టుకోని నగరాలు కూడా భారత్లో ఉన్నాయి. శ్రీరాముడు జన్మించినట్లు చెప్పే అయోధ్య, కృష్ణుడు తిరుగాడినట్లు చెప్పే బృందావనం, నరనారాయణులు తపస్సు చేసిన రిషీకేశ్, జైనులకు పవిత్రమైన పాలిటానా, మౌంట్ అబూ, బ్రహ్మదేవుడి ఆలయానికి పేరొందిన పుష్కర్ నగరాల్లో నాన్ వెజ్ నిషేధం. గుజరాత్లోని గాంధీనగర్లో నిషేధం లేకపోయినా అక్కడి వారు స్వచ్ఛందంగా మాంసాహారానికి దూరం పాటిస్తారు.
హైందవ ధర్మాన్ని పవన్ కళ్యాణ్ అమితంగా నమ్ముతారని నాగబాబు ట్విటర్లో తెలిపారు. ‘కలియుగంలో ధర్మం ఒక పాదం మీదే నడుస్తుంది. ఒక పాదమే అయినా ఆ నడక బలంగా ఉండేందుకు నా వంతు పాత్ర పోషిస్తాను. నా ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాను అని చాలాకాలం క్రితం కళ్యాణ్ బాబు నాతో చెప్పిన మాట. ధర్మాచరణకు తను సరైన ఉదాహరణ. అది ఈరోజు మళ్లీ నిరూపితమైంది’ అని అందులో పేర్కొన్నారు.
AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల పోస్టర్ను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, వెనిగండ్ల రాము ఆవిష్కరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చెప్పారు. భక్తుల సూచనల కోసం కాల్ సెంటర్ సైతం అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా అక్టోబర్ 3 నుంచి 12 వరకు ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
AP: చంద్రబాబు ఉన్మాదం పరాకాష్టకు చేరిందని YCP నాయకురాలు, మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ గజ్జల లక్ష్మి తీవ్ర విమర్శలు చేశారు. తనను పదవి నుంచి తొలగించడంపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. తన పదవీకాలం 2026 మార్చి 15 వరకు ఉన్నా అర్ధాంతరంగా తొలగించారని ఆరోపించారు. వలంటీర్లకు పెండింగ్ వేతన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. వలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామన్న బాబు ఎన్నికల హామీ ఏమైందని ప్రశ్నించారు.
చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దది. ఏకంగా 10 ట్రిలియన్ గాలన్ల నీరు అందులో నిల్వ ఉంటుంది. అంత బరువు ఒకేచోట నిల్వ ఉండటం భూమి గమనాన్ని ప్రభావితం చేస్తోంది. 0.06 సెకన్ల మేర భూ పరిభ్రమణ వేగం నెమ్మదించిందని పరిశోధకులు చెబుతున్నారు. దాని వల్ల సూర్యుడి నుంచి 2 సెంటీమీటర్ల దూరం పెరిగిందన్నారు. ఈ డ్యామ్ కారణంగా భూకంపాలు, పెను విపత్తులు సంభవిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ సిరీస్కు భారత్ తమ అత్యుత్తమ పేస్ దళాన్ని తీసుకెళ్లాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించారు. ‘బుమ్రా, షమీ, సిరాజ్, ఆకాశ్ దీప్తో కూడిన టీమ్ ఇండియా పేస్ బ్యాటరీ ఎన్నడూ లేనంత బలంగా ఉంది. ఆస్ట్రేలియాకు ఆ వేడి కచ్చితంగా తగులుతుంది. మన ప్లేయర్స్ బ్యాటింగ్ బాగా చేయడమే కీలకం. సీనియర్లు బరువును మోయాలి. భారత్ ఈసారి కూడా సిరీస్ గెలుస్తుందనే అనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.