news

News February 25, 2025

ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ ఆదిత్య

image

AP: రాష్ట్ర ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ ఆదిత్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పాత ఎండీ దినేశ్ కుమార్‌ అవినీతికి పాల్పడ్డారని <<15567607>>జీవీ రెడ్డి<<>>(ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్) ఆరోపించిన విషయం తెలిసిందే. నిన్న తన పదవికి ఆయన రాజీనామా చేయగా ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. ఆ తర్వాత దినేశ్‌ను జీఏడీకి అటాచ్ చేసింది. ఇవాళ కొత్త ఎండీని నియమించింది.

News February 25, 2025

EAPCET దరఖాస్తుల స్వీకరణ వాయిదా

image

TG: ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సిన ఈఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. మార్చి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అదే రోజు నుంచి డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్‌ను <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం నేడు సా.4.45 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సిన సంగతి తెలిసిందే.

News February 25, 2025

మెగా డీఎస్సీ, ‘సుఖీభవ’పై సీఎం కీలక ప్రకటన

image

AP: మెగా డీఎస్సీ, అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ‘త్వరలోనే 16,384 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రిక్రూట్‌మెంట్ పూర్తి చేసి, వారికి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగులు అందజేసిన తర్వాతే పాఠశాలలు ఓపెన్ చేస్తాం. ఎన్ని ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తాం. కేంద్రం తర్వాత విడతలో ఇచ్చే డబ్బుతో కలిపి అన్నదాత సుఖీభవను(రైతుకు ₹20K) 3 విడతల్లో అందిస్తాం’ అని వెల్లడించారు.

News February 25, 2025

బంగారం కాదు వెండిని కొంటా: ఫేమస్ ఇన్వెస్టర్

image

వెండి తక్కువ ధరకు దొరుకుతోందని ఆథర్, కమోడిటీ గురువు జిమ్ రోజర్స్ అంటున్నారు. బంగారమంటే తనకెంతో ఇష్టమని, దాని విలువ అతిగా పెరిగిందని పేర్కొన్నారు. అందుకే తాను వెండిని కొంటానని చెప్పారు. ఎకానమీ మెరుగవుతోందని, మళ్లీ పరిశ్రమలకు దాని అవసరం పెరుగుతుందని అంచనా వేశారు. ఈ 2 మెటల్స్ అత్యంత విలువైనవని వివరించారు. అలాగే అగ్రి కమోడిటీస్‌పై దృష్టి పెడతానన్నారు. Note: ఈ వార్త సమాచారం కోసమే. పెట్టుబడి సూచన కాదు.

News February 25, 2025

ఇలాంటి వ్యక్తిని తొలిసారి చూస్తున్నా: సీఎం చంద్రబాబు

image

AP: ప్రతిపక్ష హోదా తాము ఇచ్చేది కాదని, ప్రజలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ‘ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే వ్యక్తిని తొలి సారి చూస్తున్నా. నిన్న 11 మంది వైసీపీ సభ్యులు సభలో 11 నిమిషాలే ఉన్నారు. వారికి సభను గౌరవించే సంస్కారం లేదు. అసెంబ్లీలో నిన్న చీకటి రోజు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం’ అని స్పష్టం చేశారు.

News February 25, 2025

Nifty Worst Record: 30 ఏళ్లలో రెండోసారి వరుసగా 5 నెలలు నష్టాలే..

image

నిఫ్టీ50 ఇన్వెస్టర్లు కోరుకోని రికార్డును నమోదు చేసింది. సూచీ ఆరంభం నుంచి 30 ఏళ్లలో రెండోసారి వరుసగా 5 అంతకన్నా ఎక్కువ నెలలు పతనమైంది. 2024 OCT – 2025 FEB మధ్య 5 నెలలు దిగజారింది. 12.6% నష్టపోయింది. ఇది ఇంకా కొనసాగే అవకాశముంది. 1994 SEP – 1995 APR మధ్యన నిఫ్టీ ఏకంగా 8 నెలలు కుంగింది. 31.4% పతనమైంది. ఇక 1996 JUL – NOV మధ్య 5 నెలల్లో 26% తగ్గింది. 1990, 1998, 2001లో వరుసగా 4 నెలలు నష్టపోయింది.

News February 25, 2025

వారానికి 48గంటల పని చాలు: అశ్విన్ యార్ది

image

‘క్యాప్‌జెమినీ’ ఇండియా సీఈఓ అశ్విన్ యార్ది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగి రోజుకు 9.30గంటల చొప్పున వారానికి ఐదు రోజులు పనిచేస్తే సరిపోతుందని తెలిపారు. అంతేకాకుండా వారాంతాల్లో ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదని వారికి మెయిల్స్ పంపడానికి తాను వ్యతిరేకమని అన్నారు. అయితే గతంలో ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ వారంలో 90 గంటలు పనిచేయాలన్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

News February 25, 2025

ఇంటర్నెట్ షట్‌డౌన్‌లో భారత్ టాప్

image

2024లో ప్రపంచవ్యాప్తంగా 54 ప్రజాస్వామ్య దేశాల్లో 296 సార్లు ఇంటర్‌నెట్‌ను నిలిపివేసినట్లు Access Now సంస్థ వెల్లడించింది. 84సార్లు షట్‌డౌన్‌తో భారత్ వరుసగా ఆరో ఏడాది టాప్‌లో నిలిచింది. మణిపుర్‌లో 21, హరియాణాలో 12, J&Kలో 12 సార్లు ఇంటర్నెట్ ఆపేశారు. పాక్‌ 21, రష్యా 19, ఉక్రెయిన్ 7సార్లు నెట్ నిలిపేశాయి. మయన్మార్‌లో 85సార్లు ఆపేసినా అది మిలిటరీ ప్రభుత్వం కావడంతో జాబితాలో చేర్చలేదు.

News February 25, 2025

రేపు, ఎల్లుండి సెలవు

image

శివరాత్రి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. అలాగే ఎల్లుండి గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికలు జరగనున్నాయి. దీంతో APలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు ప్రత్యేక హాలిడే ఇవ్వాలని SEC ఆదేశించింది. TGలోని ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ సెలవు ఉంటుంది.

News February 25, 2025

6 నెలల్లో 4000 కి.మీ రోడ్లు వేశాం: పవన్

image

AP: NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 4వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 1800 కి.మీ సీసీ రోడ్లు మాత్రమే వేసిందని విమర్శించారు. తమ పాలనలో 22వేలకు పైగా గోకులాలు నిర్మించామని, ఒకేరోజు 13,326 గ్రామసభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఓ మంత్రి 77 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని ఆరోపించారు.