news

News December 31, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

✒ తేది: డిసెంబర్ 31, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
✒సూర్యోదయం: ఉదయం 6.46 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.19 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.17 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.53 గంటలకు
✒ ఇష: రాత్రి 7.10 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 31, 2024

శుభ ముహూర్తం (31-12-2024)

image

✒ తిథి: శుక్ల పాడ్యమి తె.4:00 వరకు
✒ నక్షత్రం: పూర్వాషాఢ రా.1.09 వరకు
✒ శుభ సమయం: మ.12.10 నుంచి 1.00 వరకు
✒ రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు. తిరిగి రా. 10.48 నుంచి 11.36 వరకు
✒ వర్జ్యం: రా. 10.25 నుంచి 12.00 వరకు
✒ అమృత ఘడియలు: రా. 8.07 నుంచి 9.47 వరకు

News December 31, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 31, 2024

TODAY HEADLINES

image

☛ సత్య నాదెళ్లతో CM రేవంత్ భేటీ.. పెట్టుబడులపై చర్చ
☛ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని TG అసెంబ్లీ తీర్మానం
☛ 2025లో BRS చీఫ్ ఎన్నిక: KTR
☛ ₹80,112crతో తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టు: CM CBN
☛ APలో FEB 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు
☛ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను ఒంటరి చేశారు: పవన్
☛ ఎయిడ్స్ టీకాకు USFDA ఆమోదం
☛ PSLV-C60 ప్రయోగం సక్సెస్
☛ BGT నాలుగో టెస్టులో INDపై AUS గెలుపు

News December 31, 2024

కండోమ్స్, ORSలతో న్యూఇయర్ పార్టీ ఇన్విటేషన్

image

మహారాష్ట్ర పుణేలో ఓ పబ్ నిర్వాహకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు యువతకు ఇన్విటేషన్ లెటర్‌తోపాటు కండోమ్‌లు, ORS ప్యాకెట్లను పంపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవడంతో నెటిజన్లు ఫైరవుతున్నారు. మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇన్విటేషన్ పొందిన వ్యక్తుల వాంగ్మూలాలను రికార్డు చేశామని వారు చెప్పారు.

News December 31, 2024

‘మ్యాడ్’ దర్శకుడితో మాస్ మహరాజా సినిమా?

image

‘మ్యాడ్’ సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ సక్సెస్ సాధించి, దానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ రూపొందిస్తున్నారు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. ఇటీవల ఆయన మాస్ మహరాజా రవితేజకు ఓ కథ వినిపించారని సినీ వర్గాలు వెల్లడించాయి. రవితేజ ఈ స్క్రిప్ట్‌ను ఓకే చేస్తే సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News December 31, 2024

విస్కీ ఛాలెంజ్.. ఇన్‌ఫ్లూయెన్సర్ దుర్మరణం

image

థాయ్‌లాండ్‌లో తనకర్న్ కాంథీ(21) అనే ఇన్‌ఫ్లూయెన్సర్ మద్యం ఛాలెంజ్‌లో విఫలమై దుర్మరణం పాలయ్యాడు. రూ.75,000 ఇస్తే ఒక్కోటి 350ML క్వాంటిటీగల మూడు బాటిళ్ల విస్కీని తాగేస్తానంటూ పందెం కాశాడు. అప్పటికే ఫుల్లుగా తాగిన అతను ఛాలెంజ్‌లో భాగంగా మరో 2 బాటిళ్లను 20 నిమిషాల్లో తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ పందెం కాసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

News December 30, 2024

మీరు క్షేమంగా ఉండటమే నాకిచ్చే గొప్ప బహుమతి: యశ్

image

JAN 8న తన పుట్టినరోజు సందర్భంగా హీరో యశ్ అభిమానులకు కీలక సూచనలు చేశారు. ‘ఇన్నాళ్లుగా మీరు చూపిస్తున్న ప్రేమ అసాధారణం. బర్త్‌డే వేడుకల విషయంలో ప్రేమ వ్యక్తీకరణను మార్చుకోవాలి. మీరు సురక్షితంగా, క్షేమంగా ఉండటమే నాకిచ్చే గొప్ప బహుమతి. మీరు 2025లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. గత ఏడాది తన ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తూ ముగ్గురు ఫ్యాన్స్ చనిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన రాసుకొచ్చారు.

News December 30, 2024

ఎవరి ఘనతనో తనదిగా చెప్పుకోవడానికి అలవాటుపడ్డ CBN: వైసీపీ

image

AP: బనకచర్ల ప్రాజెక్టు విషయంలో సీఎం <<15020850>>చంద్రబాబు<<>> తీరు ‘గల్లీలో చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ’ అనే చందంగా ఉందని YCP ఎద్దేవా చేసింది. ‘గోదావరి నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు నీళ్లు తీసుకెళ్లేందుకు జగన్ హయాంలోనే అడుగులు పడ్డాయి. ₹68,028Cr అంచనాతో DPR కోసం WAPCOS సంస్థ‌కు అప్పగించారు. ఎవ‌రో ప్రారంభించిన ప్రాజెక్టులు తన ఘనతే అని చెప్పుకోవడానికి CBN అలవాటుపడ్డారు’ అని ట్వీట్ చేసింది.

News December 30, 2024

సర్వ శిక్షా ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం

image

TG: కేజీబీవీల్లో పనిచేసే సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సమ్మె విరమిస్తే వారి సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. 25 రోజులుగా సమ్మె చేయడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఆర్థికపరమైన డిమాండ్స్‌పై క్యాబినెట్ సబ్ కమిటీ‌ భేటీలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు.