News February 25, 2025

రేపు, ఎల్లుండి సెలవు

image

శివరాత్రి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. అలాగే ఎల్లుండి గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికలు జరగనున్నాయి. దీంతో APలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు ప్రత్యేక హాలిడే ఇవ్వాలని SEC ఆదేశించింది. TGలోని ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ సెలవు ఉంటుంది.

Similar News

News March 18, 2025

రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

AP: మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. రేపు 58 మండలాల్లో, ఎల్లుండి 37 మండలాల్లో వడగాలులు వీస్తాయని <>APSDMA<<>> వెల్లడించింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా చూసుకోవాలని హెచ్చరించింది. డీహైడ్రేట్ కాకుండా ORS, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని సూచించింది.

News March 18, 2025

కావలి గ్రీష్మ రాజీనామాకు ఆమోదం

image

AP: ఏపీ మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పదవికి కావలి గ్రీష్మ ఈ నెల 9న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించగానే ఆమె రాజీనామా చేశారు. ఇటీవల ఆమె ఆ కోటాలో MLCగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం గ్రీష్మ రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News March 18, 2025

విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకుంటాం: కన్నబాబు

image

AP: విశాఖ మేయర్ పీఠంపై <<15799147>>కూటమి కన్నేయడంతో<<>> వైసీపీ అప్రమత్తమైంది. ఇవాళ కార్పొరేటర్లతో ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు సమావేశయ్యారు. ఈ భేటీకి 34 మంది హాజరుకాగా, ముగ్గురు రాలేదు. తమ కార్పొరేటర్లను ప్రలోభపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. మేయర్ స్థానాన్ని కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చీప్ పాలిటిక్స్ మానుకోవాలని CBNకు మాజీ మంత్రి అమర్నాథ్ హితవు పలికారు.

error: Content is protected !!