India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మన్మోహన్ సింగ్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన ఆధునిక భారతదేశ పితామహుడిగా మార్చింది చదువు, తెలివితేటలే. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశమైన తర్వాత ఆయన జ్ఞానానికి ముగ్ధుడై సింగ్కు సెండాఫ్ ఇచ్చేందుకు వైట్హౌస్ బయటకొచ్చి గౌరవించారు. 2014లో మాజీ ప్రధాని అయ్యాక జపాన్ రెండో అత్యున్నత పురస్కారంతో సత్కరించారు.
అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ను అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై ఆయన సంతకం చేశారు. 1782 నుంచి ఈ పక్షిని అమెరికా చిహ్నంగా వాడుతున్నా అధికారిక హోదా మాత్రం కల్పించలేదు. 240 ఏళ్ల తర్వాత బైడెన్ దీనికి ఇటీవల ఆమోద ముద్ర వేశారు. ఈ పక్షికి తెల్లటి తల, పసుపు రంగు ముక్కు, గోధుమ రంగులో శరీరం ఉంటుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దాదాపు 10 రోజుల తర్వాత బలహీనపడింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ APలోని ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ పలుచోట్ల వానలు పడే అవకాశం ఉందంది. కాగా ఇక వచ్చే వేసవి వరకు అల్పపీడనాలు, భారీ వర్షాలకు ఛాన్స్ లేదని పేర్కొంది.
ఇటీవల కాస్త తగ్గిన పసిడి ధర మళ్లీ ఎగబాకుతోంది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.280 పెరగగా, ఇవాళ మరో రూ.270 పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రా. ధర రూ.78వేలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పెరిగి రూ.71,500గా ఉంది. అటు కేజీ సిల్వర్ రేట్ లక్ష రూపాయలుగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నిన్నటితో గడువు ముగియగా నేడు కోర్టులో విచారణ జరగనుంది. కాగా రిమాండ్ విధించిన మరుసటి రోజే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. రిమాండ్ పూర్తి ప్రాసెస్లో భాగంగా ఐకాన్ స్టార్ కోర్టుకు హాజరుకానున్నారు.
TG: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా రాష్ట్రంలోని కాలేజీలకు కూడా సెలవు ఇచ్చారు. ఈమేరకు JNTU, కాకతీయ, ఓయూ తదితర యూనివర్సిటీలు ప్రకటన చేశాయి. ఆయా వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ఇవాళ జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటికే స్కూళ్లకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అటు ఏపీలో ఎలాంటి సెలవు ప్రకటించలేదు.
స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే అందాయి. ఇన్వెస్టర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్న మంచి స్టాక్స్ను కొంటున్నారు. సెన్సెక్స్ 78,896 (+424), నిఫ్టీ 23,858 (+108) వద్ద ట్రేడవుతున్నాయి. రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. బ్యాంకు, ఫార్మా, హెల్త్కేర్ షేర్లు జోరుమీదున్నాయి. BAJAJAUTO, TATAMOTORS, DRREDDY, EICHERMOT, INDUSIND టాప్ గెయినర్స్.
TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను స్మరించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘అగాధపు అంచుల నుంచి అద్భుత ప్రస్థానం వరకు.. భారత ఆర్థిక వ్యవస్థకు భాగ్య విధాత. మన్మోహన్ జీ.. మా హృదయాల్లో మీ స్థానం శాశ్వతం’ అని పేర్కొన్నారు. ఇవాళ సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. మన్మోహన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు.
TG: కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అర్హుల ఆదాయపరిమితి ప్రస్తుతం గ్రామాల్లో ₹1.50L, పట్టణాల్లో ₹2L ఉండగా, దాన్ని మరో ₹20K పెంచుతారని తెలుస్తోంది. ప్రజా పాలనలో 10L దరఖాస్తులు రాగా JAN మొదటి వారం నుంచి మరో అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. కార్డుల్లో మార్పులపై కూడా దరఖాస్తులు స్వీకరిస్తారని సమాచారం. 30న జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కార్ల ధరలు పెంచుతామని ప్రకటించిన పలు కంపెనీలు కొత్త ఏడాది నుంచి వాటిని అమల్లోకి తీసుకురానున్నాయి. దీంతో పాటు NBFC, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లలో నిబంధనలతో పాటు GST పోర్టల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. యూపీఏ 123పే ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.5వేల నుంచి రూ.10వేలకు పెరగనుంది.
Sorry, no posts matched your criteria.