India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాల తరలింపు: సీఎం రేవంత్
* హిందీ తప్పనిసరని ఎక్కడా చెప్పలేదు: లోకేశ్
* రాష్ట్రానికి మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న
* ఎరువుల సరఫరాలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష: పొన్నం
* బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలి: భట్టి
* ఉపరాష్ట్రపతి ఎన్నికకు మా ఎంపీలు దూరం: KTR
* అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి రాజారెడ్డి: షర్మిల
* టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్
మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు NDA ఎంపీలు ‘స్వదేశీ మేళా’లను నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. GST రేట్ల తగ్గింపుపై వ్యాపారులతో సమావేశాలు నిర్వహించాలని, GST సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు MPలు తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో NDA MPలతో ఆయన సమావేశమయ్యారు. ఓటు వృథా కాకుండా సరైన పద్ధతిలో వేయాలన్నారు.
భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైన పంజాబ్కు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ తన వంతు సాయం చేశారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు 11 స్టీమర్ బోట్లు, 3 అంబులెన్సులు, రూ.50 లక్షలను సేకరించి విరాళంగా అందించారు. కాగా భారీ వర్షాలకు పలు ఘటనల్లో పంజాబ్లో 48 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరదలతో పంట నష్టపోయిన చోట ఎకరాకు రికార్డు స్థాయిలో రూ.20 వేల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది.
అమెరికాలో విదేశీ వర్కర్లను నియమించుకునే కంపెనీలపై 25 శాతం అదనంగా పన్నులు విధించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పన్నులు ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత అమలు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ఈ విధానం తీసుకొస్తున్నట్లు సమాచారం.
యూఎస్ ఓపెన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ సందడి చేసింది. ఈ ఈవెంట్కు ట్రంప్తో పాటు ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లా రోజ్ కుష్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియా కళ్లన్నీ 13 ఏళ్ల అరబెల్లానే ఫోకస్ చేయడంతో ఆమె హైలైట్ అయ్యారు. తన తాత ట్రంప్తో ముచ్చటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
AP: ఉపరాష్ట్రపతి ఓటింగ్ ప్రక్రియపై మంత్రి నారా లోకేశ్ టీడీపీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. రేపు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. కాగా టీడీపీకి లోక్సభలో 16, రాజ్యసభలో ఇద్దరు ఎంపీల బలం ఉంది.
AP: సీఎం చంద్రబాబు ప్రతిపాదన మేరకు ఇకపై ప్రతి రోజూ తిరుపతి-షిర్డీ మధ్య రైలు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 07637/07638 నంబర్ రైలు రేణిగుంట, కడప, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ మీదుగా ప్రయాణిస్తుంది. బ్రహ్మోత్సవాలు, పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ రైలును రెగ్యులర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ రైలు టెంపరరీ సర్వీస్గా కొనసాగింది.
TG: ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. రేపు ఉ.10 గం. నుంచి సా.5 గం. వరకు ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు. అటు రేవంత్ రేపు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పెండింగ్ నిధులపై వినతిపత్రాలు ఇస్తారని తెలుస్తోంది. యూరియా కొరత, ఇటీవల భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని వారికి వివరించనున్నారు.
ఉద్యోగులు ఫిట్గా ఉండేందుకు చైనాలోని Arashi Vision అనే కంపెనీ వెరైటీ విధానానికి శ్రీకారం చుట్టింది. బరువు తగ్గితే మొత్తం 1 మిలియన్ యువాన్లు (రూ.1.23 కోట్లు) రివార్డుల రూపంలో ఇస్తామని ప్రకటించింది. 500 గ్రాములు తగ్గితే రూ.6,181 ఇస్తామని తెలిపింది. ఓ ఉద్యోగి 3 నెలల్లో 20 కేజీలు తగ్గి రూ.2.46 లక్షలు గెలుచుకున్నాడు. ఈ పోటీలో పాల్గొన్న ఉద్యోగులు తిరిగి బరువు పెరిగితే 500 గ్రా.కు రూ.9,867 చెల్లించాలి.
జమ్మూకశ్మీర్లోని కుల్గాంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. ఆపరేషన్ గడర్లో ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించినట్లు అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేతకు గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.