India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఔషధాలు, ఆహార ఉత్పత్తుల్లో అశ్వగంధ వేర్లు లేదా దాని సారాన్ని మాత్రమే వాడాలని తయారీదారులను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ఆదేశించింది. ఆకులను పౌడర్ రూపంలో లేదా వేరే ఏ ఇతర రూపంలోనూ వాడకూడదంటూ నిషేధం విధించింది. ఈ ఆకుల వాడకం వల్ల కాలేయం, నరాలు, జీర్ణక్రియ సమస్యలు వచ్చే ప్రమాదముందని తెలిపింది. కంపెనీలు తాము మొక్కలోని ఏ భాగాన్నీ వాడుతున్నదీ తప్పనిసరిగా పేర్కొనాలని సూచించింది.

రజనీకాంత్, నెల్సన్ దిలీప్కుమార్ కాంబోలో వస్తున్న ‘జైలర్ 2’ అప్పుడే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా ₹160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఒక తమిళ సినిమాకు ఈ స్థాయి ధర లభించడం ఇదే తొలిసారి. మొదటి పార్ట్ కంటే రెట్టింపు ధరకు డీల్ కుదరడం విశేషం. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ యాక్షన్ డ్రామాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.

అక్షయ తృతీయ (నేడు) పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన రోజని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన చేసే స్నానం, జపం, హోమం, దానాలు ‘అక్షయ’మైన (తరగని) ఫలితాలను ఇస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులు, చల్లని మజ్జిగ, నవధాన్యాలు దానం చేయడం విశేషమైన పుణ్యమని తెలుపుతున్నారు. ముఖ్యంగా నీటి కుండను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.

ఉదయాన్నే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు ఉన్నవారు నీళ్లు అధికంగా తాగితే ఆయా అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారికి కడుపులో ఇబ్బంది కలగొచ్చు. ఒంట్లో నీరు చేరి వాపులు వచ్చే వారు కూడా వైద్యుల సలహా మేరకే నీటిని తీసుకోవాలి.

AP హైకోర్టులో 300 ఉద్యోగాలకు అప్లై చేసుకునే గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇందులో అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసర్ సబార్డినేట్, టైపిస్ట్ తదితర ఉద్యోగాలున్నాయి. పోస్టుల ఆధారంగా 7వ తరగతి/డిగ్రీ/బీటెక్, షార్ట్ హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి. CBT, స్కిల్ ఆధారంగా ఎంపిక ఉండనుంది. పోస్టులను బట్టి నెల వేతనం రూ.20వేల-రూ.లక్షన్నర వరకు ఉంది. నోటిఫికేషన్, అప్లై చేయడానికి ఇక్కడ <

AP హైకోర్టులో 300 ఉద్యోగాలకు అప్లై చేసుకునే గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇందులో అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసర్ సబార్డినేట్, టైపిస్ట్ తదితర ఉద్యోగాలున్నాయి. పోస్టుల ఆధారంగా 7వ తరగతి/డిగ్రీ/బీటెక్, షార్ట్ హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి. CBT, స్కిల్ ఆధారంగా ఎంపిక ఉండనుంది. పోస్టులను బట్టి నెల వేతనం రూ.20వేల-రూ.లక్షన్నర వరకు ఉంది. నోటిఫికేషన్, అప్లై చేయడానికి ఇక్కడ <

IPL: SRHతో నిన్న ఓడిన చెన్నై జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2019 నుంచి 180+ స్కోరును ఒక్కసారి కూడా ఛేదించలేకపోయింది. అప్పటి నుంచి CSK జట్టుకు 14 సార్లు 180+ లక్ష్యాన్ని ఛేదించాల్సిన అవసరం రాగా అన్నింటిలోనూ ఓడింది. మరోవైపు HYDలోని ఉప్పల్ స్టేడియంలో CSK 8 ఏళ్లుగా ఒక్క గెలుపునూ నమోదు చేయలేకపోయింది. ఇక ఈ సీజన్లో ఆడిన 6 మ్యాచుల్లో రెండింటిలోనే గెలిచి పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో ఉంది.

APలోని పప్పు ధాన్యాల రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ పరిమితిని పెంచుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 94,500 టన్నుల పరిమితిని ఇప్పుడు ఏకంగా 1.13 లక్షల టన్నులకు పెంచారు. మార్కెట్లో ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.

AP Dy.CM పవన్ కళ్యాణ్ ముక్కుకు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఉన్న సైనసైటిస్ కారణంగా నిన్న ఊపిరి తీసుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది కలగడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. సర్జరీ అవసరమని డాక్టర్లు నిర్ధారించి ముక్కుకు ఆపరేషన్ చేసి శ్వాస ఇబ్బందిని తొలగించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సర్జరీ అనంతరం పవన్ ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నాయి.

IPLలో నేడు క్రికెట్ ఫ్యాన్స్కు డబుల్ వినోదం పంచేందుకు 2 ఆసక్తికరమైన మ్యాచ్లు సిద్ధమయ్యాయి. మొదటి మ్యాచ్లో KKR, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈరోజు ఓడిపోతే KKR దాదాపు ఇంటిబాట పట్టినట్లే. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్కతా వేదికగా ప్రారంభమవుతుంది. ఇక రెండో మ్యాచ్లో PBKS, LSG జట్లు ఢీకొంటాయి. చండీగఢ్ వేదికగా 7:30Pmకు ఈ పోరు మొదలవుతుంది. పాయింట్ల పట్టికలో PBKS ఫస్ట్ ప్లేస్లో ఉంది.
Sorry, no posts matched your criteria.