India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ తేది: డిసెంబర్ 26, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.14 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
✒ ఇష: రాత్రి 7.07 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
✒ తిథి: బహుళ ఏకాదశి రా.11:27 వరకు
✒ నక్షత్రం: స్వాతి సా.5.42 వరకు
✒ శుభ సమయం: ఉ.11.00 నుంచి మ.12.00 వరకు
✒ రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు
✒ యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి మ.10.48 వరకు
✒ దుర్ముహూర్తం: మ.2.48 నుంచి మ.3.36 వరకు
✒ వర్జ్యం: రా.7.50 నుంచి 9.34 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.7.57 నుంచి 9.43 వరకు
* ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ
* రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల సాయం
* రేపు సీఎం రేవంత్తో సినీ ప్రముఖుల భేటీ
* ఘోర విమాన ప్రమాదం.. 42 మంది దుర్మరణం
* జానీ మాస్టర్పై పోలీసుల ఛార్జిషీటు
* ఏపీలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు
* ఏపీలో ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
* అంబేడ్కర్కు క్రెడిట్ దక్కనివ్వని కాంగ్రెస్: మోదీ
TG: కర్ణాటకలోని బెలగావిలో గురువారం నుంచి జరిగే CWC సమావేశాల్లో పాల్గొనేందుకు CM రేవంత్ వెళ్లనున్నారు. ఉదయం 11 తర్వాత బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో ఆయన బెలగావికి పయనమవుతారు. వందేళ్ల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడిగా గాంధీజీ బెలగావిలోనే బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ‘సత్యాగ్రహ బైఠక్’ పేరుతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. గురు, శుక్రవారాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి.
ప్రస్తుతం దేశంలో తెలుగు సినీ పరిశ్రమే అగ్రస్థానంలో ఉందని మలయాళ నటుడు మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. టాలెంట్ను టాలీవుడ్ ప్రోత్సహిస్తుంటుందని ఓ ఇంటర్వ్యూలో కొనియాడారు. సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తూ సరిహద్దుల్ని తెలుగు సినిమా చెరిపేస్తోందని ఆయన ప్రశంసించారు. అవకాశం దక్కితే <<14978053>>మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తానంటూ<<>> ఆయన ఇప్పటికే అభిలాషను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
మహేశ్ బాబు గత మూవీ ‘గుంటూరు కారం’ అంతంతమాత్రంగానే ఆడింది. సోషల్ మీడియాలో మాత్రం మూవీ గురించి మంచి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు ఆ సినిమాను డిసెంబరు 31న పరిమిత స్క్రీన్లలో మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈసారి మాత్రం సీట్లన్నీ చకాచకా నిండిపోతుండటం విశేషం. ఈ ఆదరణ కొనసాగితే స్క్రీన్ల సంఖ్యను మరింత పెంచాలని మూవీ టీమ్ యోచిస్తున్నట్లు సమాచారం.
AP: సమస్యలపై తక్షణమే స్పందిస్తుండటంతో వైసీపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కష్టకాలంలో వారికి అండగా ఉంటామని నేతలు భరోసా అందించాలని ఆయన చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపింది. దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన చేపట్టాలి. ఈ నెల 27న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలి’ అని ఆయన నేతలకు సూచించారు.
తన చేతిలో విషయమైతే అశ్విన్ను అలా సాదాసీదాగా రిటైర్ కానిచ్చేవాడిని కానని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యల్ని అశ్విన్ తప్పుబట్టారు. ఫేర్వెల్ మ్యాచులనేవి తనకు నచ్చవని స్పష్టం చేశారు. అవి సెలబ్రిటీ సంస్కృతిలో భాగమన్నారు. ‘నాకోసం ఎవరైనా ఒక చుక్క కన్నీరు కార్చినా నాకిష్టం ఉండదు. ఒకరి ఘనతల్ని చూసి స్ఫూర్తి పొందొచ్చు. అంతే తప్ప ఆ ఘనతల వెనక పడకూడదు’ అని పేర్కొన్నారు.
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయిన ఆయన కాసేపటి క్రితం కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఇవాళ్టితో బాబు హస్తిన టూర్ ముగిసింది. రేపు ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడ జరిగే మంత్రి టీజీ భరత్ కూతురు వివాహానికి హాజరవుతారు.
సెలబ్రిటీలు క్రిస్మస్ను కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకోవడం తెలిసిందే. నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు మాత్రం తమ సిబ్బందితో పండుగ వేడుకలు చేసుకున్నారు. వీరిలో వారి ఇంటి సిబ్బందితో పాటు అపోలో సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. తమ వద్ద పనిచేసేవారికీ పండుగను సెలబ్రేట్ చేయడం గ్రేట్ అంటూ మెగా ఫ్యాన్స్ వారిని కొనియాడుతున్నారు.
Sorry, no posts matched your criteria.