news

News December 25, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 25, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

✒ తేది: డిసెంబర్ 25, బుధవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.49 గంటలకు
✒ ఇష: రాత్రి 7.07 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 25, 2024

శుభ ముహూర్తం (25-12-2024)

image

✒ తిథి: బహుళ దశమి రా.9:23 వరకు
✒ నక్షత్రం: చిత్త మ.3.05 వరకు
✒ శుభ సమయం: సా.4.00 నుంచి 5.00 వరకు
✒ రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు
✒ యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి మ.12.24 వరకు
✒ వర్జ్యం: రా.9.18 నుంచి 11.04 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.8.28 నుంచి 10.14 వరకు

News December 25, 2024

ఈనాటి ముఖ్యాంశాలు

image

* భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది: సీఎం రేవంత్
* ఎన్టీఆర్ రూ.12 లక్షలు ఇచ్చారు: అభిమాని తల్లి
* లోయ‌లో ప‌డిన ఆర్మీ వాహ‌నం.. ఐదుగురు జవాన్లు మృతి
* చంద్రబాబులో భయం పెరిగిపోతోంది: జగన్
* ఏపీలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
* ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల
* అల్లు అర్జున్‌ను విచారించిన పోలీసులు
* గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్
* పాక్‌కు చైనా నుంచి 40 యుద్ధవిమానాలు

News December 25, 2024

విలన్ పాత్రకు రూ.200 కోట్ల రెమ్యునరేషన్?

image

కథానాయకులు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం తెలిసిందే. కానీ కన్నడ నటుడు యశ్ విలన్ పాత్రకు ఏకంగా రూ.200 కోట్లు తీసుకుంటున్నారని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. రణ్‌బీర్, సాయి పల్లవి జంటగా నితీశ్ తివారీ హిందీలో తెరకెక్కిస్తున్న రామాయణంలో రావణుడి పాత్ర చేయడానికి గాను యశ్‌ భారీగా డిమాండ్ చేశారని సమాచారం. పాత్రకు ఆయనే కరెక్ట్ అని భావించిన మేకర్స్, ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

News December 25, 2024

₹10కే టీ, ₹20కి సమోసా.. అది కూడా విమానాశ్రయంలో

image

అధిక ధరల కారణంగా విమానాశ్రయంలో ఏం తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. అలాంటిది ₹10కే టీ, వాట‌ర్ బాటిల్‌, ₹20కే కాఫీ, సమోసా లభించనున్నాయి. తక్కువ ధరలకే రీఫ్రెష్‌మెంట్స్ అందించే ‘ఉడాన్ యాత్రి కేఫే’ పైల‌ట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు మంగ‌ళ‌వారం కోల్‌క‌తా విమానాశ్ర‌యంలో ప్రారంభించారు. ఆప్ ఎంపీ రాఘవ్ చ‌ద్దా ఈ అంశాన్ని పార్ల‌మెంటులో లేవ‌నెత్తగా, ప్ర‌భుత్వం కేఫే ఏర్పాటుకు ముందుకొచ్చింది.

News December 25, 2024

కుటుంబ సభ్యులతో YS జగన్(PHOTO)

image

AP: YS జగన్ కడప జిల్లా పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇడుపులపాయలోని YSR ఎస్టేట్‌లో తన బంధువులు, కుటుంబ సభ్యులతో జగన్ సరదాగా ఓ ఫొటో దిగారు. ఇందులో జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతితో పాటు సోదరులు YS అనిల్, సునీల్, అవినాశ్ రెడ్డి, కుమార్తెలు వర్ష, హర్ష సహా తదితరులు ఉన్నారు. దీంతో ఈ ఫొటోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నాయి.

News December 24, 2024

మణిపుర్‌కు కొత్త గవర్నర్.. కేంద్రం వ్యూహం ఇదేనా?

image

అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో ప‌రిస్థితుల్ని చ‌క్క‌దిద్దేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి కొత్త‌ గ‌వ‌ర్న‌ర్‌గా అజ‌య్ కుమార్ భ‌ల్లాను నియ‌మించింది. గ‌తంలో కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన ఆయ‌న్ను అనూహ్యంగా తెర‌మీద‌కు తేవ‌డం అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. శాంతి భ‌ద్ర‌త‌ల అంశాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉన్న కార‌ణంగానే కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

News December 24, 2024

జనవరి 1న శ్రీశైలం వెళ్తున్నారా?

image

AP: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో జనవరి 1న స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. న్యూఇయర్ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న అంచనాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఉదయాస్తమాన, ప్రాతఃకాల, ప్రదోషకాల సేవలనూ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తులందరికీ స్వామి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని వెల్లడించారు.

News December 24, 2024

కాకినాడ పోర్టులో అక్రమాల కేసు.. కె.వి.రావు పిటిషన్

image

AP: కాకినాడ పోర్టులో అక్రమాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోర్టు మాజీ యజమాని కె.వి.రావు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. అటు ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 31కి వాయిదా పడింది. అప్పటివరకు ఆయనపై చర్యలు వద్దని, కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా సీ పోర్టును అక్రమంగా రాయించుకున్నారని విక్రాంత్‌పై ఆరోపణలొచ్చాయి.