India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖేల్ రత్న అవార్డుపై నెట్టింట జరుగుతున్న చర్చపై ఒలింపిక్స్ మెడలిస్ట్ మనూ భాకర్ స్పందించారు. ‘అథ్లెట్గా నా దేశం కోసం ఆడటమే నా పాత్ర అని చెప్పాలని అనుకుంటున్నా. అవార్డులు, గుర్తింపులు నన్ను చైతన్యవంతం చేస్తాయి కానీ అవి నా లక్ష్యం కాదు. నామినేషన్ కోసం అప్లై చేసేటప్పడు పొరపాటు జరిగిందని అనుకుంటున్నా. అవార్డులతో సంబంధం లేకుండా నా దేశం కోసం మరిన్ని పతకాలు సాధించేందుకు కృషిచేస్తా’ అని తెలిపారు.
పాకిస్థాన్ తన సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. చైనాకు చెందిన 40 జే-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను తాజాగా కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే రెండేళ్లలో చైనా వీటిని దశలవారీగా డెలివరీ చేయనుంది. ఈ డీల్ విలువ ఎంత అన్నది రహస్యంగా ఉంచారు. ఐదో తరం విమానమైన జే-35ని చైనా ఇప్పటి వరకూ వేరే దేశాలకు విక్రయించలేదు. అమెరికాకు చెందిన ఎఫ్-35 జెట్స్కు పోటీగా వీటిని తయారుచేసినట్లు చైనా వర్గాలు చెబుతున్నాయి.
AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో శుక్రవారం వరకు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. 25, 26, 27 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల.. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడతాయని వివరించింది. కోస్తా తీరంలో 35-55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పుతీరం వెంబడి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ-పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్ హామీ ఇచ్చిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. దీనికోసం తొలుత రూ.6100 కోట్లను పెట్టుబడిగా పెట్టనుందని తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం క్రమంగా పుంజుకుంటోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏపీని ఎంచుకున్నందుకు బీపీసీఎల్కు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ను నిర్మిస్తామని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభగ్ చందక్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది నటిస్తారని సమాచారం. తన అభిమానులతో చిట్చాట్ సందర్భంగా యువీ బయోపిక్లో నటించాలనుందని ఆయన తెలిపారు. దీంతో ఈ చిత్రంలో ఆయన నటిస్తారని టాక్. కాగా తన పాత్రలో సిద్ధార్థ్ అయితే బాగుంటుందని యువీ కూడా గతంలో చెప్పారు.
TG: మున్నేరు వరద ముంపు నుంచి ప్రజలను కాపాడేందుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ‘రిటైనింగ్ వాల్కు భూసేకరణ చేపడతాం. ఖమ్మంలో మున్నేరుకు ఇరువైపులా కాంక్రీట్ వాల్స్ నిర్మిస్తాం. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల పరిధిలో 23 కి.మీ మేర గోడ ఏర్పాటు చేస్తాం’ అని ఆయన వివరించారు.
క్రైస్తవులకు AP మాజీ CM YS జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. తద్వారా మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా మార్గనిర్దేశం చేశారు. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ బాటలు వేశారు’ అని తెలిపారు.
భారత షూటర్ మనూ భాకర్ను ఖేల్రత్నకు నామినేట్ <<14958848>>చేయకపోవడంపై<<>> ఆమె తండ్రి రామ్ కిషన్ స్పందించారు. ‘ఆమెను షూటింగ్ క్రీడాకారిణికి బదులుగా క్రికెటర్ని చేసి ఉండాల్సింది. ఒలింపిక్స్లో ఎవరూ సాధించని రికార్డును నెలకొల్పింది. నా బిడ్డ దేశం కోసం ఇంకా ఏమి చేయాలని మీరు ఆశిస్తున్నారు? దీనిపై మనూ కూడా బాధపడింది. తాను ఒలింపిక్స్కు వెళ్లి దేశం కోసం పతకాలు సాధించకపోవాల్సిందని ఆవేదన వ్యక్తం చేసింది’ అని తెలిపారు.
AP: ఈ నెల 28, 29 తేదీల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. విజయవాడలోని KBN కాలేజీలో ఈ సభలు జరుగుతాయని చెప్పారు. పర్యావరణంపై 170 మందితో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రసంగాలు, కవి సమ్మేళనాలు, సదస్సులు ఉంటాయని చెప్పారు.
AP ఫైబర్నెట్లో గత ప్రభుత్వం నియమించిన 410 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. మరో 200 మంది ఉద్యోగుల నియామకపత్రాలు పరిశీలిస్తున్నామని, లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరుతామని ఫైబర్నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి వెల్లడించారు. వైసీపీ అర్హత లేని వారిని నియమించిందని, కొందరు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లల్లో పనిచేశారని వెల్లడించారు. వేతనాల పేరుతో రూ.కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.