India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నార్త్ బస్తర్ రీజియన్లో మావోయిస్టు సంస్థ కీలక సభ్యుడు, తెలంగాణలోని బీర్పూర్కు చెందిన ప్రభాకర్ రావు అలియాస్ బల్మూరి నారాయణ రావు (57)ను ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది. ప్రభాకర్ రావు కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు కణ్కేర్ జిల్లా పరిధిలో అరెస్టు చేశారు. 40 ఏళ్లుగా దళంలో ఉన్న ప్రభాకర్ రావు మావోల MOPOS టీంలో కీలకమని పోలీసులు తెలిపారు.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ షమీ తన భార్యతో, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్తతో కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే షమీ, సానియా పెళ్లి చేసుకున్నారంటూ తాజాగా కొన్ని ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ ఏఐ రూపొందించిన ఫొటోలే. కొందరు కావాలనే షమీ, సానియా పక్కపక్కనే ఉన్నట్లుగా ఫొటోలను ఏఐతో డిజైన్ చేశారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. హనుమకొండలో దీక్ష చేస్తున్న SSA ఉద్యోగులను ఆయన కలిశారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారని దుయ్యబట్టారు. తాము రూ.4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, రూ.7 లక్షల కోట్లని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
సినిమా హాల్లో ఇంటర్వెల్ అవ్వగానే పాప్కార్న్ తెచ్చుకొని తినడం చాలామందికి అలవాటు. మల్టీప్లెక్సుల్లో వీటిధర రూ.250-350 వరకూ ఉంటోంది. ఇప్పటికే అంత పెట్టలేక కస్టమర్లు లబోదిబో అంటున్నారు. తాజాగా GST మండలి వీటిపై పన్నును వర్గీకరించడంతో భారం మరింతకానుంది. లూజ్ పాప్కార్న్పై 5, ప్రీప్యాక్డ్పై 12, కారమెల్ వంటి షుగర్ కోటింగ్స్ వేస్తే 18% GST అమలవుతుంది. ఇకపై నాలుకకు తీపి తగలాలంటే జేబుకు చిల్లుపడాల్సిందే.
దర్శకధీరుడు రాజమౌళిపై తెరకెక్కిన ‘RRR: Behind & Beyond’ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈనెల 20న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా, ఓటీటీలో రిలీజ్కు సిద్ధమైంది. ఈ నెల 27న నెట్ఫ్లిక్స్లో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ డాక్యుమెంటరీలో చరణ్, ఎన్టీఆర్ సీన్స్తో పాటు ఇతర నటీనటుల చిత్రీకరణలో జక్కన్న పడిన కష్టాన్ని చూపారు.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనను థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కాంబ్లీ పరిస్థితి క్రిటికల్గా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఇటీవలే కాంబ్లీని ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఆయన ఆసుపత్రిపాలయ్యారు. కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడ్రోజులు దక్షిణ కోస్తాలో వర్షాలు పడనున్నాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పోర్టుల్లో మూడో నంబర్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
దేశంలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని భారత్ను బంగ్లా మధ్యంతర ప్రభుత్వం అధికారికంగా కోరింది. భారత్తో ఉన్న ఖైదీల మార్పిడి ఒప్పందం మేరకు న్యాయపరమైన ప్రక్రియ కోసం ఆమెను అప్పగించాల్సిందిగా కోరినట్టు బంగ్లా దేశ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ తెలిపారు. హసీనా హయాంలో చెలరేగిన అల్లర్లలో జరిగిన హత్య కేసుల్లో ఆమెపై ఇప్పటికే అభియోగాలు మోపారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్తో దిగిన ఫొటోలను దర్శకుడు బుచ్చిబాబు తమన్ పంచుకున్నారు. ‘DHOP మూమెంట్’ అంటూ తమన్, నా అభిమాన హీరోలంటూ బుచ్చిబాబు రాసుకొచ్చారు. వీరంతా దుబాయ్లో ఓ ఈవెంట్ సందర్భంగా కలుసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ‘వార్-2’ చిత్రంలో నటిస్తున్నారు. కాగా RC నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.
2025 FEB 1, శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి. ఆ రోజు బడ్జెట్ను ప్రవేశపెడుతుండటమే ఇందుకు కారణం. అందులో ప్రకటనలను అనుసరించి సత్వర నిర్ణయాలు తీసుకొనేందుకు ఇన్వెస్టర్లకు అవకాశమివ్వడమే దీని ఉద్దేశం. 2020, 2015లోనూ ఇలాగే జరిగింది. సాధారణంగా బడ్జెట్ రోజు బ్యాంకింగ్, ఇన్ఫ్రా, తయారీ, హెల్త్కేర్ షేర్లలో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. స్టాక్స్ రేట్లు నిమిషాల్లో ఆటుపోట్లకు లోనవుతుంటాయి.
Sorry, no posts matched your criteria.