India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తన పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ మాజీ సీఎం జగన్ సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారందరికీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు చెప్పారు. తన ప్రతి అడుగులో తోడుగా ఉండి, తనను నడిపిస్తూ వెలకట్టలేని అభిమానాన్ని చూపిస్తున్న వైసీపీ కుటుంబ సభ్యుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదన్నారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: డిసెంబర్ 22, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5.24 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.15 గంటలకు
అసర్: సాయంత్రం 4.12 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5.48 గంటలకు
ఇష: రాత్రి 7.05 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
✒ తిథి: బహుళ సప్తమి మ.3:14 వరకు
✒ నక్షత్రం: ఉ.8.44 వరకు
✒ శుభ సమయం: ఉ.7 నుంచి 9.00 వరకు
✒ రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
✒ యమగండం: మ.12.00 నుంచి 1.30 వరకు
✒ దుర్ముహూర్తం: సా.4.25 నుంచి 5.13 వరకు
✒ వర్జ్యం: మ.3.37 నుంచి 5.21 వరకు
✒ అమృత ఘడియలు: రా.2.05 నుంచి 3.49 వరకు
* అనుమతి లేకున్నా అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లారు: CM రేవంత్
* పోలీసుల అనుమతితోనే వెళ్లా: అల్లు అర్జున్
* నేను రోడ్షో చేయలేదు, CM వ్యాఖ్యలు బాధించాయి: బన్నీ
* ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు: కోమటిరెడ్డి
* రేవంత్ను పిచ్చాసుపత్రిలో చూపించాలి: KTR
* జగన్ కటౌట్ చూసినా భయపడుతున్నారు: రోజా
* నీటిసంఘం ఎన్నికల ఫలితాలు జగన్కు చెంపపెట్టు: నిమ్మల
* పాత కార్లపై 18శాతానికి జీఎస్టీ పెంపు
TG: ఈ నెల 25న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాష్ట్రంలో పర్యటిస్తారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఉన్న ఐసీఏఆర్-కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారు. అనంతరం ఆయన సేంద్రీయ రైతులతో సమావేశమవుతారు. ఆ రోజు కన్హా శాంతివనంలో బస చేసి మరుసటిరోజు ఉదయం ఢిల్లీకి వెళ్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ పర్యవేక్షిస్తున్నారు.
AP: GST విధానంలో మార్పులు, చేర్పులపై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక సూచనలు చేశారు. ‘5శాతానికి మించి శ్లాబులో ఉన్న వస్తువులపై 1% ఫ్లడ్ సెస్ విధించాలి. ఈ సెస్తో వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడతాం. రేషన్ ద్వారా వచ్చే పోర్టిఫైడ్ బియ్యంపై GST సుంకం తగ్గించాలి. IGST వ్యవస్థను పారదర్శకంగా చేపట్టాలి. రాష్ట్రాలకూ డేటా అందుబాటులో ఉండేలా చూడాలి’ అని జైసల్మేర్లో జరిగిన GST కౌన్సిల్ సమావేశంలో మంత్రి అన్నారు.
కొందరు నిద్రలోనే మాట్లాడుతుంటారు. కొంతమంది గొణగడం చేస్తే, మరికొందరు స్పష్టంగా గట్టిగా కలవరిస్తుంటారు. 3 నుంచి పదేళ్ల మధ్య ఉన్న పిల్లలు, కొందరు పెద్దలు నిద్రలో మాట్లాడుతుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం తాము చేసిన పని గురించి, కలలతో సంబంధం ఉన్నా, కొన్ని రకాల మందులు వాడినా, ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇలా ప్రవర్తిస్తారు. కొందరికి జన్యుపరంగా కూడా ఈ అలవాటు వస్తుంది.
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్సులు ప్రీమియంలపై జీఎస్టీ భారం తగ్గనుందనే ప్రచారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దీనిపై మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా ఇన్సూరెన్సుల ప్రీమియంలపై ప్రస్తుతం ఉన్న 18శాతం జీఎస్టీని తగ్గించనున్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా నిర్మల ప్రకటనతో క్లయింట్లకు నిరాశే ఎదురైంది.
చెక్కర అధికంగా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల జీవితంలో కొంత కాలాన్ని కోల్పోతామని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కోక్ లాంటి కూల్డ్రింక్ తాగితే 12 నిమిషాల జీవితకాలం తగ్గిపోతుందని తెలిపారు. ఇది తాగిన తర్వాత ఊబకాయం, మధుమేహం వంటివి సోకి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. హాట్ డాగ్ తింటే 36 నిమిషాలు, శాండ్విచ్లు తింటే 13 నిమిషాలు, చీజ్బర్గర్లు తింటే జీవితంలో 9 నిమిషాలను కోల్పోతారు.
Sorry, no posts matched your criteria.