News February 17, 2025
కేజీహెచ్లో GBS మరణం? కొట్టిపారేసిన సూపరింటెండ్

AP: విశాఖపట్నం కేజీహెచ్లో GBSతో ఓ మహిళ మృతి చెందిందన్న ప్రచారాన్ని ఆసుపత్రి సూపరింటెండ్ శివానందం కొట్టిపారేశారు. ఇప్పటివరకు ఐదు అనుమానిత కేసులు నమోదయ్యాయని, ఎవరూ మరణించలేదని చెప్పారు. ఇది అంటువ్యాధి కాదని వెల్లడించారు. కాగా ఛాతిలో నొప్పితో ఎల్.కోట మండలం మల్లివీడుకు చెందిన రేణుకా మహంతి ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వార్తలొచ్చాయి.
Similar News
News March 19, 2025
BYD సంచలనం.. 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 470 కి.మీ

చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ BYD సంచలనం సృష్టించింది. కేవలం 5-8 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే కారు దాదాపు 470 కి.మీ వెళ్తుందని ఆ కంపెనీ ప్రకటించింది. చైనావ్యాప్తంగా 4వేల అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించబోతున్నామని తెలిపింది. దీంతో టెస్లా, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలకు గట్టి సవాల్ ఎదురుకానుంది.
News March 19, 2025
చేనేత కార్మికులకు అవార్డులు.. దరఖాస్తు ఇలా

TG: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ పేరుతో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 నాటికి చేనేతలుగా 30yrs వయసు, పదేళ్ల అనుభవం, చేనేత డిజైనర్లుగా 25yrs వయసు, ఐదేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులు. ఏప్రిల్ 15లోగా ఆయా జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులకు దరఖాస్తులను సమర్పించాలి. పూర్తి వివరాలకు https://handtex.telangana.gov.in/ చూడండి.
News March 19, 2025
టెన్త్ పరీక్షలు రాసేవారికి అలర్ట్

TG: ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్తో పాటు సీరియల్ నంబర్ను ముద్రిస్తున్నారు. 24 పేజీల ఆన్సర్ బుక్లెట్ ఇవ్వనున్నారు. అదనపు షీట్లు ఇవ్వరు. ఉ.9.30 గం.కు పరీక్ష ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. హాల్ టికెట్లు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.