India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అమెరికా నుంచి వస్తున్న అక్రమ వలసదారుల విమానాలను అమృత్సర్లో ల్యాండ్ చేసి పంజాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని సీఎం భగవంత్ మాన్ చేసిన <<15466008>>వ్యాఖ్యలకు<<>> బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి సున్నితమైన అంశాల్లోనూ రాజకీయం చేయడం తగదని హితవు పలికింది. ఆప్ నేతలు దేశ భద్రతను పట్టించుకోరని, వారికి రాజకీయాలే కావాలని బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ విమర్శించారు.

దేశంలో ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి కొనసాగాల్సిందేనని ఇండియా టుడే-సీ ఓవర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో అత్యధిక మంది కోరుకున్నారు. 65% మంది ఈమేరకు అభిప్రాయపడగా 26% మంది అవసరంలేదని తేల్చి చెప్పారు. ఇక కూటమికి నాయకుడిగా రాహుల్ గాంధీకి అత్యధికంగా 24శాతం ఓట్లు రాగా 14శాతం ఓట్లతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కేజ్రీవాల్, అఖిలేశ్ నిలిచారు.

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా మరిన్ని సేవలు చేస్తానని ఆస్పత్రి ఛైర్మన్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా అమరావతిలోని తుళ్లూరులో త్వరలో ఆస్పత్రి ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్ క్యాన్సర్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ ఆంకాలజీ యూనిట్ ప్రారంభం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు అందుబాటు ధరల్లోనే క్యాన్సర్కు చికిత్స అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

అపర కుబేరుడు ఎలాన్ మస్క్తో కలిసి తాను ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు రచయిత్రి ఆష్లే సెయింట్ క్లైర్ ఆరోపించారు. ఆ బిడ్డ మస్క్కు 13వ సంతానమని ఆమె తెలిపారు. తమ చిన్నారి గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని ఆమె వేడుకున్నారు. తన బిడ్డను సురక్షితంగా పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాగా దీనిపై ఎలాన్ మస్క్ ఇంకా స్పందించలేదు.

శారీరక సంబంధం పెట్టుకోకుండా భార్య మరో వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కిందకి రాదని MP హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పరాయి పురుషుడితో ఆమె లైంగికంగా కలిస్తేనే అక్రమసంబంధం అవుతుందని తెలిపింది. తన భార్య వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నందున ఆమెకు భరణం పొందే హక్కులేదంటూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్పై ఇలా స్పందించింది. భార్యకు నెలకు రూ.4వేల మధ్యంతర భరణం చెల్లించాలన్న ఫ్యామిలీకోర్టు ఆదేశాలను HC సమర్థించింది.

TG: ఎండాకాలం రావడంతో బీర్ల అమ్మకాలు పెరుగుతున్నట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సరఫరా పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 13 సంస్థలు బీర్లను తయారు చేస్తున్నాయి. ఇప్పటివరకు 2 షిఫ్టుల్లో కార్మికులు పనిచేసేవారు. కానీ డిమాండ్ పెరగడంతో మూడు షిఫ్టుల్లో ఉత్పత్తి చేసేందుకు కంపెనీలు ప్లాన్ చేసుకున్నాయి. ఒక్కో కంపెనీ రోజుకు 2 లక్షల బీర్లను తయారుచేసి డిపోలకు పంపనున్నాయి.

TG: సినీ నటి, బీజేపీ నేత మాధవీలత ఫిర్యాదు మేరకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్పై సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గత నెల 21న సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసి బెదిరిస్తున్నారని సైబరాబాద్ సీసీఎస్లో ఆమె కంప్లైంట్ ఇచ్చారు. జేసీ అనుచరులు, అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. జేసీ తనను అసభ్యపదజాలంతో దూషించారని ఆమె ఫిర్యాదులో తెలిపారు.

శంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ‘ఛావా’ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు ₹31కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ ఏడాది బాలీవుడ్లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ రికార్డు ఇప్పటివరకు అక్షయ్ కుమార్ ‘స్కై ఫోర్స్’ (₹15.30cr) పేరిట ఉండేది. విక్కీ కౌశల్, రష్మిక నటించిన ఈ మూవీని లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు.

యూపీలోని ప్రయాగ్రాజ్-మీర్జాపూర్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి మహా కుంభమేళాకు భక్తులతో వెళ్తున్న బొలెరో ఓ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు చనిపోయారు. 19 మందికి గాయాలయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మేజా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2025లో ఇవాళ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. వడోదరలోని కోటంబి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి సీజన్లో విజేతగా నిలిచిన ముంబై గత సీజన్లో స్థాయికి తగ్గట్లు రాణించలేదు. మరోవైపు గత రెండు సీజన్లలో ఫైనల్కు చేరిన ఢిల్లీ టైటిల్ సాధించలేకపోయింది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్లో LIVE చూడవచ్చు.
Sorry, no posts matched your criteria.