news

News December 18, 2024

ఈ ఏడాది రిటైర్మెంట్ పలికిన క్రికెటర్లు వీరే!

image

ఈ ఏడాది 20 మందికిపైగా ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. వారిలో అశ్విన్, శిఖర్ ధవన్, బరిందర్ శ్రాన్, వృద్ధిమాన్ సాహా, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, వరుణ్ అరోన్, సౌరభ్ తివారీ, ఎల్గర్, వార్నర్, వాగ్నర్, మున్రో, వీస్, అండర్సన్, మలాన్, మొయిన్ అలీ, మహ్మద్ అమీర్, ఇమాద్ వసీమ్, టిమ్ సౌథీ ఉన్నారు. వీరే కాకుండా ఒక్కో ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పినవారు చాలా మంది ఉన్నారు.

News December 18, 2024

అందుకే అశ్విన్ రిటైర్మెంట్?

image

BGT సిరీస్ మధ్యలోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం షాక్‌కు గురిచేసింది. వాస్తవానికి జట్టులో చోటు కోసం కాంపిటేషన్ ఎక్కువైంది. 3వ టెస్టుకు ఎంపికైన జడేజా బ్యాటింగ్‌లోనూ రాణించడంతో మిగతా 2 టెస్టుల్లో తనకు చోటు దక్కకపోవచ్చని అశ్విన్ భావించి ఉండొచ్చు. మరో స్పిన్నర్ సుందర్, ఆల్‌రౌండర్ కోటాలో నితీశ్ రెడ్డి కూడా దూసుకొస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని ఇదే మంచి సమయమని యాష్ భావించినట్లు తెలుస్తోంది.

News December 18, 2024

అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: విజయ్ దళపతి

image

అంబేడ్కర్‌పై అమిత్ షా <<14912480>>వ్యాఖ్యలను<<>> తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ దళపతి ఖండించారు. ‘కొందరికి అంబేడ్కర్ పేరంటే నచ్చకపోవచ్చు. కానీ ప్రస్తుతం స్వాతంత్ర్య స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న ప్రతి భారతీయుడు ఆరాధించే వ్యక్తి ఆయన. అంబేడ్కర్ పేరు పలకడానికి గుండె, పెదవులు కూడా ఎంతో సంతోషిస్తాయి. ఆయనను అగౌరవపరచడాన్ని అంగీకరించం. మా పార్టీ తరఫున కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

News December 18, 2024

లైంగిక వేధింపుల కేసులో నటుడు అరెస్ట్

image

లైంగిక వేధింపుల కేసులో నటుడు, యూట్యూబర్ ప్రసాద్ బెహరాను HYD జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న సమయంలో తన ప్రైవేట్ పార్ట్స్‌ను తాకారంటూ మణికొండకు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది నెలలుగా ప్రసాద్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ తెలిపారు. కాగా, ప్రసాద్ వెబ్‌సిరీస్‌లతో పాటు కమిటీ కుర్రాళ్లు సినిమాలో నటించారు.

News December 18, 2024

అల్లు అర్జున్ అందుకే శ్రీతేజ్‌ను పరామర్శించలేదు: అల్లు అరవింద్

image

కేసు కోర్టులో ఉన్నందున తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ పరామర్శించలేకపోయారని ఆయన తండ్రి అల్లు అరవింద్ తెలిపారు. అందుకే ఆయన తరఫున బాలుడిని తాను పరామర్శించినట్లు చెప్పారు. కిమ్స్ ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రేవతి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం మాకు పూర్తి సహకారం అందించింది. తమకు మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు’ అని ఆయన పేర్కొన్నారు.

News December 18, 2024

అశ్విన్ ఓ లెజెండ్: రోహిత్ శర్మ

image

రవిచంద్రన్ అశ్విన్ ఓ ఓజీ, లెజెండ్ అని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొనియాడారు. రాబోయే తరం బౌలర్లకు ఆయన స్ఫూర్తి అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘భారత్ క్రికెట్ కాకుండా ప్రపంచ క్రికెట్ కూడా అశ్విన్ సేవలు కోల్పోయింది. మా ఇద్దరి మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అశ్విన్ ఎప్పటికీ మ్యాచ్ విన్నరే. ఆయనకు, ఆయన కుటుంబానికి ఆల్ ది బెస్ట్’ అని ఆయన పేర్కొన్నారు.

News December 18, 2024

జనవరి 2 నుంచి టెట్

image

తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉ.9 నుంచి 11.30 వరకు, మ.2 నుంచి 4.30 వరకు రెండు షెడ్యూళ్లుగా పరీక్షలు ఉండనున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. కాగా, ప్రతి ఏడాది టెట్ నిర్వహిస్తామని ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

News December 18, 2024

కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన 2024!

image

క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది ఒకటి తర్వాత మరొకటి షాక్‌లు తగులుతున్నాయి. 2024లో ఇప్పటికే టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజాలు రిటైర్మెంట్ ప్రకటించారు. శిఖర్ ధవన్ అన్ని ఫార్మాట్లకూ, దినేశ్ కార్తీక్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఈరోజు లెజెండరీ ఆల్ రౌండర్ అశ్విన్ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగారు. దీంతో ఈ ఏడాది క్రికెట్ ఫ్యాన్స్‌కు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

News December 18, 2024

ఫార్ములా-ఈ రేసులో అవకతవకలు జరగలేదు: KTR

image

TG: CM రేవంత్‌కు KTR బహిరంగ లేఖ రాశారు. ‘ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి. అప్పుడే నిజాలేమిటో తేలుతాయి. HYDకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఫార్ములా-ఈ రేసు సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. కానీ మీరు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారు. అందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. BRSపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల లబ్ధి చేకూరింది’ అని వెల్లడించారు.

News December 18, 2024

శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్

image

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌‌ను అల్లు అరవింద్ పరామర్శించారు. ఇవాళ సికింద్రాబాద్ కిమ్స్‌కు వెళ్లిన ఆయన వైద్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న థియేటర్ బయట తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోగా, బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ జైలుకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే.