India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

2019లో సరిగ్గా ఇదే రోజున భారతీయుల గుండెలు పగిలాయి. జమ్మూ, శ్రీనగర్ హైవేపై పుల్వామా వద్ద CRPF జవాన్లపై టెర్రరిస్టులు దాడి చేశారు. ఓ ఉగ్రవాది కారులో పేలుడు పదార్థాలు నింపుకుని నేరుగా జవాన్ల బస్సును ఢీకొట్టాడు. భారీ పేలుడు సంభవించి బస్సులోని 40 మంది జవాన్లు అక్కడికక్కడే వీరమరణం పొందారు. శరీరాలు ముక్కలుముక్కలుగా తెగిపడ్డాయి. ఇందుకు ప్రతీకారంగా భారత్ PAKలోని ఉగ్రస్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది.

AP: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల మెనూలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులు, గర్భిణులకు అందించే పాలు, బాలామృతంలో మార్పులు చేస్తోంది. పాలకు బదులు పాలపొడి, బాలామృతంలో మరిన్ని పోషకాలు జోడించి అందించనుంది. ఇప్పటికే దీనిని పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. మెనూ మార్పు బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్కు అప్పగించారు.

ప్రెసిడెంట్ ట్రంప్ తరచూ MAGA గురించి మాట్లాడతారని PM మోదీ అన్నారు. భారత్లో తాము ‘వికసిత్ భారత్’ దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. US కాంటెక్ట్స్లో దీనిని MIGAగా (Make India Grate Again) అనువదించుకోవచ్చన్నారు. ఇక భారత్, అమెరికాది MEGA పార్ట్నర్షిప్గా వర్ణించారు. అంతకు ముందు డొనాల్డ్ ట్రంప్తో వైట్హౌస్లో అద్భుతమైన మీటింగ్ జరిగిందని ట్వీట్ చేశారు. ఆయన్ను భారత్కు రావాల్సిందిగా ఆహ్వానించారు.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ జియో, డిస్నీప్లస్ హాట్స్టార్ విలీనం పూర్తైంది. ఈ యాప్కు జియోహాట్స్టార్గా నామకరణం చేశారు. ఈ రెండు యాప్స్ ఒకే గూటి కిందకు చేరడంతో జియోహాట్స్టార్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్గా అవతరించింది. ఇకపై డిస్నీ ప్లస్ హాట్స్టార్, జియో సినిమాలోని కంటెంట్ మొత్తం ఒకే చోట దర్శనమివ్వనుంది. ప్లేస్టోర్లో జియోకు 100 మిలియన్, హాట్స్టార్కు 500 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి.

TG: నేటి నుంచి ఇసుక 24 గంటల ఆన్లైన్ బుకింగ్ను అందుబాటులోకి తెస్తున్నట్లు గనులశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. రీచ్లు, డంపింగ్ యార్డుల నుంచి అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధిక లోడ్ లారీలను అనుమతించవద్దని సూచించారు. వివిధ ప్రాజెక్టులకు ఇసుక వినియోగంపై వివరాలను మార్చి 31లోపు సమర్పించాలని జాతీయ రహదారులు, R&B, TGMSIDC, సాగునీటి, పంచాయతీరాజ్ శాఖలను కోరారు.

AP: రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు, ఈఎంఆర్ఎస్ స్కూళ్లలో విద్యార్థులకు చికెన్ నిలిపేస్తున్నట్లు గురుకులాల సెక్రటరీ సదా భార్గవి తెలిపారు. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చికెన్ బదులుగా పండ్లు, స్వీట్లు, వెజ్ కర్రీ అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చికెన్ పెట్టకూడదని ఆమె అధికారులను ఆదేశించారు.

AP: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలానికి ఈ నెల 19-మార్చి 1 వరకు అటవీ శాఖ చెక్పోస్టులో 24 గంటలూ అనుమతించనున్నారు. పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైలం సబ్ DFO అబ్దుల్ రవూఫ్ చెప్పారు. అటవీ ప్రాంతంలోకి 2-5L వాటర్ బాటిల్స్ తీసుకెళ్లొచ్చని, చెత్తకుండీల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు వేయాలన్నారు. సాధారణ రోజుల్లో రాత్రి 9- ఉ.6 వరకు శ్రీశైలానికి రోడ్డు మార్గంలో అనుమతించరు.

దేశీయ స్టాక్మార్కెట్లు నేడు భారీగా లాభపడొచ్చు. గిఫ్ట్నిఫ్టీ 100pts లాభంతో మొదలవ్వడం దీనినే సూచిస్తోంది. అమెరికా, ఫ్రాన్స్తో కీలక ఒప్పందాలు కుదరడమూ పాజిటివ్ సెంటిమెంటును నింపింది. డాలర్ ఇండెక్స్ తగ్గడం శుభపరిణామం. ఆసియా మార్కెట్ల నుంచైతే మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. నిఫ్టీ రెసిస్టెన్సీ 23,250, సపోర్టు 22,900 వద్ద ఉన్నాయి. సూచీ 23,200 పై స్థాయిలో నిలదొక్కుకుంటేనే బలం పెరిగినట్టు లెక్క.

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కడప చేరుకుంటారు. అక్కడ 11 గంటలకు ఓ కన్వెన్షన్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారని వైసీపీ కార్యాలయం పర్యటన వివరాలు వెల్లడించింది. అనంతరం ఆయన అక్కడి నుంచి బెంగళూరు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

AP: విద్యార్థులు తక్కువున్న ఎయిడెడ్ పాఠశాలలపై విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. 3ఏళ్ల నుంచి విద్యార్థులు తగ్గిపోతున్న సూళ్లకు నోటీసులివ్వాలని RJDలు, DEOలను విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు. 40మంది కంటే తక్కువ విద్యార్థులున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే తీసుకుంటే ఆ నివేదికలు అందించాలని సూచించారు. రాష్ట్రంలోని 126 ఎయిడెడ్ స్కూళ్లలో 40మంది లోపు, 80 చోట్ల అసలు విద్యార్థులే లేరని తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.