news

News December 18, 2024

స్టాక్‌మార్కెట్లు: నిన్నటి విలవిల.. నేడూ తప్పదా?

image

స్టాక్‌మార్కెట్లు నేడూ నష్టాల్లోనే మొదలవ్వొచ్చు. గిఫ్ట్ నిఫ్టీ 67PTS మేర తగ్గడం దీనినే సూచిస్తోంది. US FED వడ్డీరేట్ల కోత నిర్ణయం కోసం వేచిచూస్తున్న ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎకానమీ, ఇన్‌ఫ్లేషన్ డేటా వచ్చేంత వరకు అనిశ్చితి తప్పకపోవచ్చు. నిన్న US, EU సూచీలన్నీ ఎరుపెక్కాయి. నేడు ఆసియా మార్కెట్లూ నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. STOCKS 2 WATCH: AXIS BANK, NATIONALUM, OBEROIRLTY, UNITDSPR, VBL

News December 18, 2024

పెన్షన్ల రద్దుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

AP: అర్హత లేని వారికి పెన్షన్లు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనర్హులుగా గుర్తించిన వారికి తొలుత నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. లబ్ధిదారుల వివరణ ఆమోదయోగ్యంగా ఉంటే పింఛను కొనసాగించాలని, అర్హతలు నిరూపించుకోలేకపోతే రద్దు చేయాలని సూచించింది. నోటీసులకు స్పందించని వారి పింఛన్లను హోల్డ్‌లో పెట్టాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 3.5 లక్షల మంది అనర్హులున్నట్లు అంచనా.

News December 18, 2024

చివరి విడత EAPCET కౌన్సెలింగ్

image

AP: EAPCET(Bi.P.C) స్ట్రీమ్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆప్షన్ల నమోదుకు రేపటి నుంచి 22 వరకు అవకాశం కల్పించింది. 22న వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు. 24న సీట్లు కేటాయిస్తారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా బయో, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బీఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో చేరవచ్చు.

News December 18, 2024

వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్

image

బ్రిస్బేన్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. ఐదవ రోజు ఆట ఆరంభమైన కాసేపటికే భారత్ <<14910004>>ఆలౌటైంది<<>>. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి ఆకాశం మేఘావృతమై ఉరుములు రావడంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ వర్షం కురుస్తోందని, ఇవాళ వాతావరణం మ్యాచుకు అనుకూలించేలా లేదని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.

News December 18, 2024

BIG ALERT.. అతి భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడు, యానాంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల్లో TNలో ఇది తీరం దాటనుంది. ఇవాళ VSP, అనకాపల్లి, కాకినాడ, NLR, TPTY జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, VZM, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. దక్షిణ కోస్తా తీరంలో గంటకు 55కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దంది.

News December 18, 2024

శాంసన్‌కు కేరళ క్రికెట్ బోర్డు షాక్

image

విజయ్ హజారే ట్రోఫీలో ఆడే కేరళ జట్టుకు సంజూ శాంసన్ ఎంపిక కాలేదు. ట్రైనింగ్ క్యాంపులకు ఆయన హాజరు కాలేదని, ప్రాక్టీస్ మ్యాచుల్లో ఆడిన వారినే సెలక్ట్ చేస్తామని ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డు సెక్రటరీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన SMATలో సంజూ కేరళ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇప్పుడు అతని స్థానంలో సల్మాన్ నిజార్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఈ 50 ఓవర్ల టోర్నీ ఈనెల 21 నుంచి ప్రారంభం కానుంది.

News December 18, 2024

టెన్త్ విద్యార్థులకు అలర్ట్

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ పేర్ల వివరాల్లో తప్పుల సవరణకు ఈ నెల 19 నుంచి 23 వరకు అవకాశం ఉండనుంది. విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, మీడియం వంటివి ఇప్పటికే సమర్పించిన నామినల్ రోల్స్‌లో సవరించుకోవచ్చు. HMలు తమ ఆన్‌లైన్ లాగిన్ ద్వారా ఈ సవరణలు చేయవచ్చు. ఇందుకోసం అపార్ వివరాలతో విద్యార్థుల డీటైల్స్‌ను మరోసారి పరిశీలిస్తారు.

News December 18, 2024

BREAKING: టీమ్ ఇండియా ఆలౌట్

image

ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 260 పరుగులకు ఆలౌటైంది. దీంతో AUS తొలి ఇన్నింగ్స్‌లో 185 రన్స్ ఆధిక్యం సంపాదించింది. IND బ్యాటర్లలో రాహుల్ 84, జడేజా 77, ఆకాశ్ దీప్ 31 రన్స్‌తో రాణించారు. AUS బౌలర్లలో కమిన్స్ 4, స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా, హెజిల్‌వుడ్, హెడ్, లియోన్ తలో వికెట్ తీశారు. ఇవాళ చివరి రోజు కావడంతో AUS గెలుస్తుందా? లేదా మ్యాచ్ డ్రా అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

News December 18, 2024

100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు

image

హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్‌లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2583 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తంలో సివిల్ పనుల కోసం రూ.1980 కోట్లు, ఇతర పనుల కోసం రూ.603 కోట్లు ఖర్చు చేయనుంది. హైకోర్టు భవన నిర్మాణానికి ఈ నెలాఖరున లేదా వచ్చే నెల తొలి వారంలో ఆర్‌అండ్‌బీ టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.

News December 18, 2024

నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్

image

TG: అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు, మణిపుర్ అల్లర్లపై ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ TPCC ఇవాళ ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో CM రేవంత్, Dy.CM భట్టితో సహా కాంగ్రెస్ MPలు, MLAలు పాల్గొంటారు. ఉ.11 గంటలకు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. మణిపుర్‌లో అల్లర్లు జరిగినప్పటి నుంచి ప్రధాని అక్కడ పర్యటించలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది.