News February 14, 2025
మస్క్తో ఈ అంశాలపైనే చర్చించా: PM మోదీ

USలో పర్యటనలో ఉన్న PM మోదీ ఎలాన్ మస్క్తో భేటీ అయినట్లు ట్వీట్ చేశారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సంస్కరణల వైపు భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి, ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’ను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆయనతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్జ్, వివేక్ రామస్వామితోనూ PM చర్చలు జరిపారు.
Similar News
News March 19, 2025
భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్

వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు హీరోచితంగా భూమిపైకి వచ్చిన వారికి సుస్వాగతం పలికారు. వీరి కథ అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదని, బ్లాక్ బస్టర్ అని రాసుకొచ్చారు. సునీత, బుచ్ మరింత శక్తిని పొందాలని ఆకాంక్షించారు.
News March 19, 2025
మహేశ్, రాజమౌళి వర్కింగ్ టైటిల్ ఫిక్స్!

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 ఒడిశా షెడ్యూల్ షూటింగ్ పూర్తైంది. ఈ మేరకు గౌరవ ఆతిథ్యాన్ని అందించిన అక్కడి యంత్రాంగానికి స్పెషల్ థాంక్స్ చెబుతూ రాజమౌళి రాసిన నోట్ వైరలవుతోంది. ఇందులో జక్కన్న వర్కింగ్ టైటిల్ను SSMB29గా పేర్కొనడం గమనార్హం. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఖుషి అవుతున్నారు. కాగా ఈ మూవీలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు.
News March 19, 2025
సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?

సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యది గుజరాత్లోని ఝులసన్ గ్రామం. 1957లో M.D. పూర్తి చేసిన ఆయన అమెరికాకు వెళ్లి విద్యను అభ్యసించారు. అక్కడే వివిధ ఆస్పత్రులు, రీసెర్చ్ సెంటర్లలో పని చేశారు. స్లోవేనియన్-అమెరికన్ అయిన ఉర్సులిన్ బోనీ జలోకర్ను పెళ్లి చేసుకున్నారు. సునీత నేవీలో చేరినప్పుడు పరిచయమైన ఫెడరల్ మార్షల్ మైఖేల్ జె.విలియమ్స్ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు.