India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అలహాబాద్ HC జడ్జి జస్టిస్ శేఖర్ యాదవ్ Tue సుప్రీంకోర్టు కొలీజియం ముందు హాజరయ్యారు. Dec 8న VHP ప్రొగ్రాంలో పాల్గొన్న ఆయన ‘అసమాన న్యాయ వ్యవస్థలను యూనిఫాం సివిల్ కోడ్ తొలగిస్తుంది’ అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం అవ్వడంతో సుప్రీంకోర్టు వివరణ కోరింది. నిబంధనల ప్రకారం వివాదాలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు కొలీజియం ముందు తమ వాదన వినిపించే అవకాశం ఉండడంతో ఆయన తాజాగా వివరణ ఇచ్చారు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మలో ధీమా లేదని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. ఆ ప్రభావం ఆయన ఆటమీద కూడా కనిపిస్తోందని పేర్కొన్నారు. ‘రోహిత్ తన టెక్నిక్ను తాను విశ్వసించాలి. ఆ టెక్నిక్తోనే కదా దశాబ్దానికి పైగా క్రికెట్ ఆడారు. తన సమస్య అది కాదు. ఆయనలో విశ్వాసం లోపించినట్లు కనిపిస్తోంది. వాటిపై పోరాడాలి. తనపై తనకు నమ్మకమున్న రోహిత్ శర్మ ఇప్పుడు దేశానికి అవసరం’ అని పేర్కొన్నారు.
మూడో టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డి పరిణతిని క్రికెట్ దిగ్గజం గవాస్కర్ ప్రశంసించారు. ‘తొలి 2 మ్యాచుల్లోనూ అతడికి అటువైపున టెయిలెండర్స్ ఉన్నారు. దాంతో దూకుడుగా ఆడాడు. ఈ మ్యాచ్లో జడేజా ఉన్నాడు కాబట్టి భాగస్వామ్యం కోసం చాలా నియంత్రణతో అద్భుతంగా ఆడాడు. అనవసరమైన షాట్ల జోలికి పోలేదు. 16 పరుగులే చేసినా అందుకోసం 61 బంతుల్ని అడ్డుకున్నాడు. 22 ఏళ్ల ఆ కుర్రాడు ఇప్పుడు మగాడిగా మారుతున్నాడు’ అని కొనియాడారు.
జమిలి ఎన్నికల బిల్లులపై JPC ఏర్పాటు విషయమై సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని పార్టీలను LS స్పీకర్ ఓం బిర్లా కోరారు. 129 రాజ్యాంగ సవరణ సహా, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణల బిల్లులను కేంద్రం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లులపై అన్ని స్థాయుల్లో విస్తృత చర్చలకు 31 మందితో జేపీసీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బీజేపీ సభ్యుడే ఛైర్మన్గా వ్యవహరిస్తారు.
ప్రొఫెషనల్ లైఫ్లో ఎప్పుడూ స్మార్ట్గా పనిచేయాలి తప్ప హార్డ్గా కాదని ఉద్యోగులకు Dell CEO Michael Dell సూచించారు. రోజులో అధిక పనిగంటలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయన్నారు. పని ప్రదేశాల్లో సరదాగా ఉండకపోతే పనిచేసే విధానం సరిగాలేదనే అర్థమన్నారు. పనిలో ప్రయోగాలు చేయాలని, రిస్క్ తీసుకోవాలని, విఫలమవ్వాలని, క్లిష్ట సమస్యలను పరిష్కరిస్తూ ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.
రణ్బీర్ కపూర్తో కలిసి సిగరెట్ తాగిన ఫొటోలు లీక్ అయినప్పుడు తన కెరీర్ నాశనమైందని భావించినట్లు పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ అన్నారు. ఫొటోల కారణంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగానూ చాలా కోల్పోయానని ఆమె వాపోయారు. ‘నా జీవితంలో పెళ్లి, విడాకులు, పాప పుట్టడం, సింగిల్గా ఉండటం, రణ్బీర్తో కలిసి ఉన్న ఫొటోలు లీక్ కావడం, ఓ దేశంలో నాపై నిషేధం విధించడం. ఇవన్నీ నాకు కష్టకాలంగా అనిపించాయి’ అని ఆమె పేర్కొన్నారు.
నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఇకపై పదో తరగతికి బోర్డు పరీక్షలు ఉండవనే మెసేజ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని నమ్మిన విద్యార్థులు అయోమయంలో పడటంతో కేంద్రానికి చెందిన PIB FactCheck దీనిపై క్లారిటీ ఇచ్చింది. కేంద్ర విద్యాశాఖ ఇలాంటి ఆర్డర్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మి భయాందోళనకు గురికావొద్దని, దీనిని నమ్మి ఇతరులకు షేర్ చేయొద్దని కోరింది.
విమానాలకు నకిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపే వారిపై క్రిమినల్ కేసుల నమోదుతోపాటు ఇక నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. అలాగే వారి విమాన ప్రయాణాలపై నిషేధం విధించేలా పౌర విమానయాన భద్రతా బ్యూరో(BCAS)కు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ఇలా బెదిరింపు సందేశాలు పంపి అప్పటికే విమానం ఎక్కిన వారిని కిందికి దింపే అధికారాన్ని కూడా కల్పించింది.
తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేసేందుకు ఆమిర్ ఖాన్ అంగీకరించినట్లు ఓ వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. వరుసగా రెండు ఫ్లాపులు చవిచూసిన ఆమిర్, టాలీవుడ్ డైరెక్టర్తో పనిచేయాలని భావించినట్లు సమాచారం. ఇప్పటికే వంశీ స్టోరీ లైన్ చెప్పారని, ఆమిర్కు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ తయారుచేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించే అవకాశం ఉన్న ఈ మూవీపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడ్డ <<14906305>>శ్రీతేజ్<<>> (9) ఆరోగ్యం విషమంగానే ఉందని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అతడు ఐసీయూలో వెంటిలేటర్పైనే ఉన్నాడని, జ్వరం పెరుగుతోందని పేర్కొన్నారు. మెదడుకు ఆక్సిజన్ సరిగా అందట్లేదని, బాలుడిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.