India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: పలువురు బీఆర్ఎస్ అగ్ర నాయకులు బీజేపీలోకి వెళ్తారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్, హరీశ్ రావు ఒకే పార్టీలో ఉండబోరని ఆయన జోస్యం చెప్పారు. త్వరలోనే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని మహేశ్ వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేపటి నుంచి తాను జిల్లాల్లో పర్యటిస్తానని ఆయన వెల్లడించారు.
AP: సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్న ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడంతో పాటు నిధులు కేటాయించాలని కోరనున్నారు. అనంతరం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో భేటీ కానున్నారు. మరికొందరు కేంద్రమంత్రులను సైతం సీఎం కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సూర్య నటించిన ‘కంగువా’ మూవీని పైరసీ భూతం వెంటాడుతోంది. నిన్న విడుదలైన ఈ సినిమా పలు వెబ్సైట్లలో దర్శనమివ్వడం మేకర్స్ని షాకింగ్కు గురి చేస్తోంది. తమిళ్ రాకర్స్, ఫిల్మీజిల్లా, మూవీ రూల్స్, టెలిగ్రామ్ తదితర సైట్లలో కంగువా HD ప్రింట్ అందుబాటులో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రూ.కోట్లు ఖర్చు పెట్టిన సినిమాను ఇలా పైరసీ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూర్య ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
కొన్ని ప్రేమ కథలు కాలాల్ని దాటి ప్రయాణిస్తాయి. అలాంటిదే ఈ కథ. ఆర్కియాలజిస్టుల కథనం ప్రకారం.. 2800 ఏళ్ల క్రితం ఇరాన్లోని టెప్పే హసన్లు ప్రాంతానికి చెందిన ఓ జంట, తమ తండాలో కార్చిచ్చు నుంచి పారిపోతూ ఓ గుంతలో తలదాచుకున్నారు. మృత్యువు వెంటాడటంతో ప్రాణాలు పోయే చివరి క్షణంలో ఒకరినొకరు ముద్దాడారు. 1972లో ఈ ప్రేమికుల అస్థిపంజరాలు వెలుగుచూశాయి. ఆ ప్రాంతం పేరిట వీరిని ‘హసన్లూ ప్రేమికులు’గా పిలుస్తున్నారు.
నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మూవీలో విలన్ రోల్కి తమిళ నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్ను సంప్రదించారని భోగట్టా. అందుకాయన సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఇక హీరోయిన్గా రవీనా టాండన్ కుమార్తె రాశా థడానీని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య క్లైమాక్స్లో ప్రత్యేక పాత్రలో తళుక్కుమంటారని మూవీ టీమ్ చెబుతోంది.
AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలోనే రేపు కూడా ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని APSDM తెలిపింది.
AP: జగన్ హయాంలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగిపోలేదని వైసీపీ నేత కురసాల కన్నబాబు తెలిపారు. కొవిడ్ సమయంలోనూ వాటిని ప్రజలకు అందించామని చెప్పారు. ‘రాష్ట్రాన్ని జగన్ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. కానీ రాష్ట్రాన్ని వైసీపీ విధ్వంసం చేసిందని, చంద్రబాబు ఏదో అద్భుతం చేసినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఒక్క పథకం కూడా ప్రారంభించలేదు. శాసనసభలో టీడీపీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది’ అని ఆయన మండిపడ్డారు.
ఛాంపియన్స్ ట్రోఫీ టూర్కు సంబంధించి పీసీబీకి ఐసీసీ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK)లో టూర్ నిర్వహించొద్దని సూచించినట్లు సమాచారం. ఇందుకు పీసీబీ కూడా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా దేశవ్యాప్త ప్రదర్శన కోసం ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ ఇప్పటికే పాకిస్థాన్కు పంపింది. పాక్లోని ప్రధాన నగరాల్లో దీనిని ప్రదర్శనకు ఉంచుతారు.
ఎదిగేందుకు, లక్ష్యాలను సాధించేందుకు వయసు అన్న పదం అడ్డు కాకూడదు. ఇంకే చేయగలంలే అంటూ డీలా పడకూడదు. KFCని శాండర్స్ తన 62వ ఏట మొదలుపెట్టారు. పోర్షేను ఫెర్డినాండ్ 56వ ఏట, స్టార్ బక్స్ను గోర్డన్ తన 51వ ఏట, వాల్మార్ట్ను శామ్ వాల్టన్ 44వ ఏట, కోకాకోలాను ఆసా కాండ్లర్ 41వ ఏట ప్రారంభించారు. సాధించాలన్న తపన, సాధించగలమన్న నమ్మకమే వీరిని విజయతీరాలకు చేర్చాయి.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) టెలికమ్యూనికేషన్ విభాగంలో 526 ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి DEC 14 వరకు మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సై పోస్టులకు 20-25 ఏళ్లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-25 ఏళ్లు ఉండాలి. ఎస్సైల పే స్కేల్ రూ.35,400-1,12,400, హెడ్ కానిస్టేబుల్ పే స్కేల్ రూ.25,500-81,100గా ఉంది. సైట్: recruitment.itbpolice.nic.in
Sorry, no posts matched your criteria.