news

News November 15, 2024

మా రిలీజ్‌లు ఉన్నప్పుడే సెంటిమెంట్ మాటలు: నాగవంశీ

image

తమ సినిమాలు వస్తున్నప్పుడే పోటీ సినిమాలు సెంటిమెంట్ కార్డ్ ప్లే చేస్తుంటాయని నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించారు. ‘మా సినిమాలకు పోటీగా విడుదల చేసే సినిమావాళ్లే తమ కష్టాలు, కన్నీళ్లు గురించి చెబుతుంటారు. మేం రిలీజ్ పెట్టుకున్నప్పుడే ఇలాంటివి ఎందుకు జరుగుతాయో మరి! ఇకపై మేము కూడా సింపతీ మాటలు చెప్పాలేమో’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’కు పోటీగా హనుమాన్ విడుదలైన సంగతి తెలిసిందే.

News November 15, 2024

శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త

image

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తుల కోసం SCR 8 స్పెషల్ రైళ్లను ప్రకటించింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి-కొల్లం, 18, 25 తేదీల్లో మచిలీపట్నం-కొల్లం, ఈ నెల 24, డిసెంబర్ 1న కొల్లం-మౌలాలి, ఈ నెల 20, 27 తేదీల్లో కొల్లం-మచిలీపట్నం మధ్య ఈ 8 సర్వీసులు తిరుగుతాయని వెల్లడించింది. పైన ఫొటోలో రైలు టైమింగ్స్, హాల్టింగ్స్ వివరాలు చూడొచ్చు.

News November 15, 2024

‘కంగువ’ థియేటర్లలో సౌండ్ తగ్గింపు?

image

నిన్న విడుదలైన కంగువ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆడియో చాలా లౌడ్‌గా, ఇబ్బందిగా ఉందన్న విమర్శలు వచ్చాయి. ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రెసూల్ సైతం దీనిపై పెదవి విరిచారు. పెద్ద సినిమాలు సౌండ్ డిజైనింగ్ లౌడ్‌నెస్ యుద్ధంలో చిక్కుకుంటున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ‘కంగువ’ థియేటర్లలో సౌండ్ తగ్గించాలని ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా సూచించినట్లు తెలుస్తోంది.

News November 15, 2024

ఖలిస్థానీలతో కలిసి ర్యాలీ.. పోలీసుకు కెనడా క్లీన్ చిట్

image

ఈ నెల 3న ఖలిస్థానీ వేర్పాటువాదులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఓ పోలీసు అధికారికి కెనడా సర్కారు క్లీన్ చిట్ ఇచ్చింది. బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంలోకి చొరబడిన నిరసనకారులు భక్తులపై దాడి చేశారు. వారితో వెళ్లిన పోలీసు అధికారి హరీందర్ సోహీని పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. అయితే, ఆయన చట్టబద్ధంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో గుర్తించామని పేర్కొంటూ తాజాగా నిర్దోషిగా ప్రకటించింది.

News November 15, 2024

‘టెంపుల్ టూరిజం’ బలాన్ని AP గుర్తించడం లేదా?

image

మన దేశానికున్న అతిపెద్ద బలం టెంపుల్ టూరిజం. కాశీ, అయోధ్య, ప్రయాగ వల్ల UPకి ఆదాయం బాగా పెరిగింది. హోటల్ సహా అనేక అనుబంధ రంగాలు రాణిస్తున్నాయి. తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, ఒంటిమిట్ట, శ్రీశైలం, విజయవాడ, ద్రాక్షారామం, అన్నవరం, అరసవెల్లి, సింహాచలం, ఆంధ్రమహా విష్ణు వంటి ఆలయాలు AP సొంతం. వీటిపై మరింత ఫోకస్ పెట్టి టెంపుల్ టూరిజాన్ని పెంచితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయం. మీరేమంటారు?

News November 15, 2024

గాడిద పాల పేరుతో ఘరానా మోసం

image

గాడిద పాల పేరుతో డాంకీ ప్యాలెస్ సంస్థ తెలంగాణ, AP, తమిళనాడు, కర్ణాటకలోని రైతులను ₹100 కోట్ల వరకూ మోసం చేసింది. ఒక్కో గాడిదను రూ.లక్షన్నరకు అమ్మిన సంస్థ లీటర్ పాలను ₹1600కు కొంటామని నమ్మించింది. తొలి 3 నెలలు నమ్మకంగా సేకరణ డబ్బులు చెల్లించి, గత 18 నెలలుగా పెండింగ్‌లో ఉంచింది. చెక్కులు ఇచ్చినా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో AP, TG CMలు న్యాయం చేయాలని బాధితులు HYD ప్రెస్‌ క్లబ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

News November 15, 2024

అంతర్జాతీయ ప్రయాణికులు వచ్చే చోటు.. పేరుమార్చిన కేంద్రం

image

కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని సరాయి కాలే ఖాన్ చౌక్ పేరును భగవాన్ బిర్సాముండా చౌక్‌గా మార్చింది. స్వతంత్ర సమరయోధుడు, గిరిజనుల ఆరాధ్యదైవం అయిన బిర్సాముండా 150వ జయంతి నేడు. ఈ సందర్భంగా నగరంలోని ఇంటర్నేషనల్ బస్టాండ్ వద్ద ఆయన విగ్రహం ఆవిష్కరించింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బిర్సాముండా గిరిజనులతో సైనిక విప్లవం సృష్టించారు. ఆయన జయంతి రోజైన NOV 15ను కేంద్రం 2021లో జన జాతీయ గౌరవ దివస్‌గా ప్రకటించింది.

News November 15, 2024

ప్ర‌ధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం

image

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌యాణించాల్సిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తిన‌ట్టు తెలుస్తోంది. మోదీ శుక్రవారం ఝార్ఖండ్ పర్యటన ముగించుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో దేవ్‌ఘర్ విమానాశ్ర‌యంలో ఉన్న విమానంలో సమస్య తలెత్తినట్టు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. దీనిపై PM Office స్పందించాల్సి ఉంది. మోదీ తిరుగు ప్ర‌యాణం మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.

News November 15, 2024

OTD: సచిన్ అరంగేట్రానికి సరిగ్గా 35 ఏళ్లు

image

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ అరంగేట్రం చేసి నేటికి సరిగ్గా 35 ఏళ్లు అవుతోంది. 1989 నవంబర్ 15న పాకిస్థాన్‌పై 16 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చారు. తొలి మ్యాచ్‌లో డకౌటైనా ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 200కుపైగా టెస్టులు, 400కుపైగా వన్డేలు ఆడి శత శతకాలు బాదారు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో అంతర్జాతీయ క్రికెట్‌లో 34,357 పరుగులు చేశారు. 2013లో ఇదే తేదీన చివరిసారిగా బ్యాటింగ్‌కు దిగారు.

News November 15, 2024

గుజరాత్‌లో 500 కేజీల డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌

image

గుజ‌రాత్‌ పోర్‌బంద‌ర్‌లో స‌ముద్ర మార్గంలో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 500 KGల డ్ర‌గ్స్‌ను అధికారులు ప‌ట్టుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఈ భారీ డ్ర‌గ్స్ రాకెట్ గుట్టుర‌ట్టైంది. ఇరాన్ దేశానికి చెందిన బోటులో డ్ర‌గ్స్ తెచ్చిన‌ట్టు అధికారులు గుర్తించారు. సరిహద్దు జలాల్లో నేవీ సాయంతో న‌డిసంద్రంలో ఈ ఆపరేషన్ చేపట్టారు.