news

News December 17, 2024

త్వరలో చేనేత రుణాల మాఫీ: తుమ్మల

image

TG: త్వరలోనే రాష్ట్రంలోని చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామని అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఏడాదిలో 13 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని, వారిలో ముగ్గురి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. మరో 10 మందికీ త్వరలోనే సాయం చేస్తామని వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని జిల్లాల సంఖ్యను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మరో మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

News December 17, 2024

క్యాబినెట్ నిర్ణయాలపై అసెంబ్లీలో ప్రకటన

image

సోమవారం సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలను ప్రజలకు వెల్లడించలేదు. CM రేవంత్ ఇవాళ లేదా రేపు నేరుగా అసెంబ్లీలో ప్రకటిస్తారని సమాచారం. ఫార్ములా రేసు- KTR, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు-KCR వ్యవహారాలతో పాటు పంచాయతీరాజ్, యూనివర్సిటీ, GST చట్టాలకు చేసే సవరణ బిల్లులను మంత్రివర్గం ఆమోదించినట్లు తెలుస్తోంది. అటు భూమి లేని రైతులకు రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం.

News December 17, 2024

రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు!

image

AP: రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి భూరిజిస్ట్రేషన్ ఛార్జీలు 15% వరకు పెరిగే అవకాశముంది. భూమి విలువల పెంచుతున్నట్లు కలెక్టర్ల ప్రతిపాదనలకు జిల్లా కమిటీల ఆమోదం లభించగా, ఈ నెల 20న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని నోటీసు బోర్డుల్లో సవరణ వివరాలు అంటించనున్నారు. 24 వరకు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ.. 27న పరిశీలన చేయనున్నారు. కొత్త ఏడాది నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

News December 17, 2024

నేడు పార్లమెంటులో జమిలి ఎన్నికల బిల్లు

image

నేడు పార్లమెంటులో జమిలి ఎన్నికల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. LSలో బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫార్సు చేయాలని స్పీకర్‌ను కోరే అవకాశముంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే తమ ఎంపీలు పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరవ్వాలని BJP విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌తో పాటు పలు ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.

News December 17, 2024

మరోసారి వర్షం.. ఆగిన ఆట

image

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వరుణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. IND 105/5 స్కోర్ వద్ద ఉండగా వాన మొదలైంది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. నిన్న కూడా వర్షం వల్ల ఆట పూర్తిగా సాగలేదు. ఉదయం ఎండతో కూడిన పొడి వాతావరణం ఉంటున్నా తర్వాత ఆకాశం మేఘావృతమై వాన పడుతోంది. మరోవైపు వందకే 5 వికెట్లు కోల్పోయిన భారత్‌ గట్టెక్కాలంటే వర్షం కొనసాగాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News December 17, 2024

ఏపీలో పేపర్ లీక్ కలకలం

image

ఏపీలో పదో తరగతి గణితం ప్రశ్న పత్రం యూట్యూబ్, టెలిగ్రామ్ గ్రూపుల్లో లీకవడం కలకలం రేపింది. దీంతో 6-10 తరగతుల విద్యార్థులకు నిన్న జరగాల్సిన సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 మ్యాథ్స్ పరీక్షను ఈనెల 20కి పాఠశాల విద్యాశాఖ వాయిదా వేసింది. మిగతా పేపర్లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేసింది. పేపర్ లీక్‌పై అధికారులు ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News December 17, 2024

అరకులో 3.8°C ఉష్ణోగ్రత

image

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో 3.8°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఏజెన్సీ వ్యాప్తంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారి. జి.మాడుగులలో 4.1°C, డుంబ్రిగుడలో 6°C, జీకే వీధిలో 7.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితో పాటు ఉదయం 10 గంటల వరకు పొగమంచు వీడటం లేదు. బుధవారం నుంచి చలి స్వల్పంగా తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

News December 17, 2024

మామిడి బీమా ప్రీమియం చెల్లింపు గడువు పెంపు

image

AP: మామిడి బీమా ప్రీమియం చెల్లింపు గడువును వ్యవసాయ శాఖ ఈనెల 31 వరకు పొడిగించినట్లు ఏపీ కౌలు రైతు సంఘం తెలిపింది. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది. మామిడి సాగుదారులు, కౌలుదారుల పేరుతోనే ఈ క్రాప్ చేయాలని, ప్రీమియంలో రైతులు ఒక్క రూపాయి చెల్లిస్తే మిగిలిన మొత్తం ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు సంఘం అధ్యక్షుడు రాధాకృష్ణ వెల్లడించారు.

News December 17, 2024

ఇవాళ, రేపు జాగ్రత్త!

image

తెలంగాణలో చలి విజృంభిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 5.2C టెంపరేచర్ నమోదవుతోంది. ఇవాళ, రేపు కూడా చలి తీవ్రత అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ ఉమ్మడి ADB, RR, MDK, KRN, NLG, MBNR, WGL జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. బుధవారం ADB, NZB, WGL, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

News December 17, 2024

ముగిసిన గ్రూప్-2.. సగం మంది కూడా రాయలేదు!

image

TG: గ్రూప్-2 ఎగ్జామ్స్ నిన్నటితో ముగిశాయి. పేపర్-3 పరీక్షకు 45.62% మంది, పేపర్-4కు 45.57% మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మంది కూడా పరీక్ష రాయకపోవడం గమనార్హం. మొత్తం 5,51,855 మంది అప్లై చేసుకోగా 2,51,486 మంది హాజరయ్యారు. పరీక్షలో చంద్రబాబు, ఎన్టీఆర్ పాలన, పాత తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రశ్నలు చర్చకు దారితీశాయి. కాగా మార్చి నాటికి గ్రూప్-2 ఫలితాలు వెల్లడిస్తామని TGPSC తెలిపింది.