news

News February 12, 2025

కాంగ్రెస్‌లో చేరిన ప్రణబ్ ముఖర్జీ కుమారుడు

image

దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. బెంగాల్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఆయన 2012, 2014లో కాంగ్రెస్ నుంచి MPగా గెలిచారు. అనంతరం 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. 2021బెంగాల్ ఎన్నికల్లో తృణముాల్ విజయంతో ఆ పార్టీలో చేరారు. వచ్చేఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

News February 12, 2025

రేపు గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల

image

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల హాల్‌టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు APPSC తెలిపింది. ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్‌లైన్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని, అందులోని సూచనలను గమనించాలని APPSC తెలిపింది. ఒకరోజు ముందుగానే కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని సూచించింది.

News February 12, 2025

Stock Markets: లాభాలు నిలబెట్టుకోలేదు..

image

బెంచ్‌మార్క్ సూచీలు నేడు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 23,045 (-26), సెన్సెక్స్ 76,171 (-122) వద్ద ముగిశాయి. ఒకానొక దశలో నిఫ్టీ 200, సెన్సెక్స్ 600 Pts మేర నష్టపోయి మళ్లీ పుంజుకోవడం గమనార్హం. PSU బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, ఫార్మా, రియాల్టి, హెల్త్‌కేర్, O&G సూచీలు ఎరుపెక్కాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్.

News February 12, 2025

శుభ్‌మన్ గిల్ ‘శతక’బాదుడు!

image

భారత స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో సెంచరీతో కదం తొక్కారు. 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇది ఆయనకు 7వ వన్డే సెంచరీ. ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో గిల్ 87, 60 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. కాగా.. భారత్ స్కోరు ప్రస్తుతం 206/2గా ఉంది. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ 43(36 బంతుల్లో) కూడా ధాటిగా ఆడుతున్నారు.

News February 12, 2025

ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. సిఫీకి లోకేశ్ ఆహ్వానం

image

AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సిఫీ టెక్నాలజీస్ ఎండీ రాజు వేగేశ్నను మంత్రి నారా లోకేశ్ కోరారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాజుతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై చర్చించారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి వివరించారు. ఏపీలో పెట్టుబడికి తాము సుముఖంగా ఉన్నట్లు రాజు లోకేశ్‌కు తెలిపారు.

News February 12, 2025

Gold Bars అమ్మకాలు నిలిపివేత.. ఎక్కడంటే!

image

బంగారం ధరలు పెరుగుతున్న వేళ సౌత్ కొరియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. అక్కడి మింటింగ్ కార్పొరేషన్ గోల్డ్‌బార్స్ అమ్మకాలను నిలిపివేసింది. Feb 11న కమర్షియల్ బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాని ముడిసరుకు సేకరించడం కష్టంగా మారింది. అందుకే గోల్డ్ బార్స్ అమ్మకాలు ఆపేశాం. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు’ అని పేర్కొంది. ప్రస్తుతం Hydలో గోల్డ్ 10gr ధర రూ.87k ఉంది.

News February 12, 2025

BREAKING: అకౌంట్లో డబ్బుల జమ

image

TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపింది. జనవరి 26న ఈ పథకం కింద ప్రభుత్వం నిధుల జమను ప్రారంభించింది. ఫిబ్రవరి 5న 17.03 లక్షల మందికి, ఫిబ్రవరి 10న 8.65 లక్షల మందికి విడతల వారీగా నిధులు జమ చేసిన సంగతి తెలిసిందే.

News February 12, 2025

అదరగొడుతున్న గిల్.. కోహ్లీ ఫిఫ్టీ

image

భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అదరగొడుతున్నారు. వరుసగా మూడు వన్డేల్లో 50+ స్కోర్ చేశారు. తొలి వన్డేలో 87, రెండో వన్డేలో 60 పరుగులు చేశారు. మూడో వన్డేలోనూ అర్ధసెంచరీతో కొనసాగుతున్నారు. మరోవైపు పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న కింగ్ కోహ్లీ(52) ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యారు.

News February 12, 2025

రేపు పార్లమెంట్ ముందుకు ట్యాక్స్ బిల్లు

image

రేపు పార్లమెంట్‌లో కొత్త ఇన్‌కం ట్యాక్స్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. 536 సెక్షన్లు, 23 చాప్టర్లు, 622 పేజీలతో బిల్లును రూపొందించినట్లు సమాచారం. 1961 నుంచి ఉన్న పాత బిల్లుకు స్వస్తి పలకనున్న కేంద్రం, ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్యాక్స్ బిల్లును అమల్లోకి తీసుకురానుంది. దీని ద్వారా ట్యాక్స్ విధానం సులభతరం కానుందని కేంద్రం తెలిపింది.

News February 12, 2025

‘తండేల్’ కలెక్షన్ల ప్రభంజనం

image

థియేటర్ల వద్ద ‘తండేల్’ మూవీ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ చిత్రం రూ.80.12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. వాలంటైన్స్ వీక్‌లో బ్లాక్ బస్టర్ తండేల్‌పై ప్రేమ అన్‌స్టాపబుల్‌గా కొనసాగుతుందని పేర్కొంది. నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తాయి.