news

News November 15, 2024

BGT: INDపై AUS గేమ్‌ప్లాన్

image

ఆసీస్‌లో అడుగుపెట్టిన IND ఒకేసారి 2 గేముల్లో తలపడాల్సి ఉంటుంది. ఒకటి క్రికెట్. రెండోది మైండ్‌గేమ్. కొన్నేళ్లుగా అక్కడిదే ఒరవడి. ముందు అక్కడి మీడియా భారత జట్టులో విభేదాలున్నట్టు నెరేటివ్ సృష్టిస్తుంది. ఆ తర్వాత పాంటింగ్ సహా ఇతర మాజీలు భారత క్రికెటర్ల ఫామ్ బాలేదని, ఓడిపోతారని చెప్పేస్తారు. కోహ్లీతో పెట్టుకోవద్దని అప్పట్లో మానేశారు. IND ఫామ్ లేమి, NZ చేతిలో క్లీన్‌స్వీప్ అవ్వడంతో మళ్లీ మొదలెట్టారు.

News November 15, 2024

SALUTE: చేయి చేయి కలిపి.. ఊరి దారిని బాగుచేసి..

image

AP: అనారోగ్యమొస్తే వేగంగా ఆస్పత్రికి వెళ్లే దారే ఆ ఊరికి లేదు. తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం దక్కలేదు. దీంతో గ్రామస్థులంతా ఏకమై పలుగు, పార చేతపట్టి శ్రమదానంతో 5KM మేర మార్గాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఈ ఘటన అల్లూరి(D) పెదబయలు(M) పెదకొండాలో జరిగింది. ఇప్పటికైనా పక్కారోడ్డును నిర్మించాలని కోరుతున్నారు. వారి స్ఫూర్తికి సెల్యూట్ చేయాల్సిందే.

News November 15, 2024

జగన్ ఒక్క ఛాన్స్ అని నాశనం చేశారు: సీఎం

image

AP: జగన్ 2019లో ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో విమర్శించారు. తాము ఊహించిన దాని కంటే ఎక్కువ విధ్వంసం చేశారని, జీవోలు కూడా ఆన్‌లైన్‌లో ఉంచలేదన్నారు. జగన్ చీకటి పాలనలో రాష్ట్రంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు. భూమి ఉంది కాబట్టే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, అందుకే అమరావతి కోసం భారీగా భూమి కావాలనుకున్నామని వివరించారు.

News November 15, 2024

మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే: బాంబే హైకోర్టు

image

అంగీకారంతో మైనర్ భార్య(18 ఏళ్లలోపు)తో భర్త శృంగారంలో పాల్గొన్నా అత్యాచారమేనని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అతనికి చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేసింది. నిందితునికి కింది కోర్టు విధించిన 10ఏళ్ల జైలు శిక్షను సమర్థించింది. MH వార్ధాలో ఓ వ్యక్తి మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకుని పెళ్లిచేసుకున్నాడు. తర్వాత విభేదాలు రావడంతో ఆమె రేప్ కేసు పెట్టింది. ఈ కేసు సమర్థనీయమేనని కోర్టు అభిప్రాయపడింది.

News November 15, 2024

ధాన్యం సేకరించిన వారంలోపే బోనస్: మంత్రి

image

TG: సన్న రకాల ధాన్యం పండించిన రైతులకు ₹500 బోనస్ కచ్చితంగా ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ధాన్యం సేకరించిన వారంలోపే చెల్లిస్తామన్నారు. సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా కూడా ఇస్తామని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. హరీశ్ రావు, KTR రైతులను రెచ్చగొడుతున్నారని, రైతుల కష్టాలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.

News November 15, 2024

జగన్ ఆర్థిక ఉగ్రవాది: మంత్రి పయ్యావుల

image

AP: ఐదేళ్ల పాలలో జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, ఆయనొక ఆర్థిక ఉగ్రవాది అని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో విమర్శించారు. రాష్ట్ర సంపద పెంచకుండా విపరీతంగా అప్పులు చేశారని దుయ్యబట్టారు. ‘బిల్లులను పెండింగ్‌లో పెట్టడంతో అనేకమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టారు. పోలవరం పనులు నిలిపేసి డయాఫ్రంవాల్ డ్యామేజీకి జగన్ కారణమయ్యారు’ అని ఆరోపించారు.

News November 15, 2024

GREAT: ఒక్కడే 8 గవర్నమెంట్ జాబ్స్ కొట్టాడు!

image

ఈరోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం రావడమే కష్టం. అలాంటిది 8 సర్కారు కొలువులతో సత్తాచాటారు WGL (D) నల్లబెల్లికి చెందిన రాయరాకుల రాజేశ్. కోచింగ్‌ లేకుండానే ప.సెక్రటరీ, PGT గురుకుల, ASO, TGT గురుకుల, హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2, గ్రూప్-4, DSC, JL ఉద్యోగాలు సాధించి ప్రస్తుతం మల్లంపల్లిలో PGT(SOCIAL)గా పనిచేస్తున్నారు. అన్న స్ఫూర్తిగా తమ్ముడు సంతోష్ కూడా గ్రూప్-4 సాధించి, గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు.

News November 15, 2024

కులగణన సర్వే 30% పూర్తి: మంత్రి పొన్నం

image

TG: కులగణన సర్వే 30% పూర్తయినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. కులగణన సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదని, సర్వేలో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడగట్లేదని చెప్పారు. కులం వివరాలు చెప్పడం ఇష్టం లేకపోతే 999 ఆప్షన్ ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేటర్లను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News November 15, 2024

శాసనమండలిలో రగడ.. మంత్రి ఆగ్రహం

image

AP: మెడికల్ కాలేజీలపై చర్చ సందర్భంగా శాసనమండలిలో రగడ జరిగింది. కాలేజీల నిర్మాణం, సీట్ల కేటాయింపుపై ప్రభుత్వ విధానం చెప్పాలని YCP ఎమ్మెల్సీలు నినదించారు. దీనిపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. YCP ప్రభుత్వ హయాంలో ప్రచారం చేశారే తప్ప కాలేజీలు కట్టలేదని మండిపడ్డారు. 26జిల్లాల్లో కాలేజీల పేరుతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పార్టీ ఆఫీసులు కట్టారని ఆరోపించారు. అనంతరం YCP సభ్యులు వాకౌట్ చేశారు.

News November 15, 2024

NCP, BJP మీటింగ్‌లో అదానీ: అసలు నిజం చెప్పిన శరద్ పవార్

image

2019లో న్యూఢిల్లీలోని గౌతమ్ అదానీ ఇంట్లో NCP, BJP పొలిటికల్ <<14596038>>మీటింగ్‌<<>> జరగడం నిజమేనని శరద్ పవార్ అంగీకరించారు. ఈ చర్చల్లో అదానీ మాత్రం పాల్గొనలేదని వెల్లడించారు. ఆఖర్లో డిన్నర్‌కు ఆతిథ్యమిచ్చారని తెలిపారు. ఎన్నికలయ్యాక మహారాష్ట్రలో NCP, BJP ప్రభుత్వం 80 గంటల్లో కూలిపోవడానికి ముందు ఈ మీటింగ్ జరిగింది. అందులో Sr పవార్, ప్రఫుల్, షా, ఫడ్నవీస్, తాను పాల్గొన్నట్టు అజిత్ పవార్ చెప్పడం సంచలనమైంది.